సుదర్శన శతకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.
ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదు. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామి ని యాధాస్థానమున దించవలెనని తలచినారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించినారు.. అట్లు స్వామి ని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము కలదు.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడి ని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించినారు.............
ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాషిని శ్రీస్వామివారి భందాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి ' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పటించుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లొకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను చేదించినా శ్రీ కూరనారయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన 'పవన శక్తి ' ని తిరిగి పొందునటూల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము ఈ స్తోత్రము పటించువలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందకే ఆస్తికులందరూ ధర్మార్థ కామ మోక్షాది నిమిత్తమై ఈ స్తోత్రమును పారాయణాదులు జరిపించెదరు.
 
==శతకంలోని శ్లోకాలు==
పంక్తి 34:
ఘోషై: స్వై: క్షోభయంతీ విఘటితభగద్యోగనిద్రాన్ సముద్రాన్,
వ్యూడొర: ప్రౌడచార త్త్రుతిటపటురత్కీకసక్షుండ దైత్యా,
నేమిస్సౌదర్షనీవ: శ్రియమతి శయనీం దాశతాదాశతాబ్దందాశతాదాశతాబ్దమ్
<poem>
39
</poem>
ఉత్పాతాలాత కల్పాన్యసుర పరిషదామాహవ ప్రార్ధినీనామ్,
;41 వ శ్లోకమ్
అధ్వాన ధాన భోదక్షపణ క్షణ తమ: క్షేప దీపోపమాని,
త్రైల్లోకాగార భారోద్వహన సహమణిస్సంభ సంపత్సఖాని
త్రాయంతాం అంతిమాయాం విపది సపదివో రాణి సౌదర్శనాని
<poem>
;41 వ శ్లోకమ్
</poem>
జ్వాలా జ్వలాబ్దిముద్రం క్షితివలయ మివబిభ్రతీనేమిచక్రం,
నాగేంద్రస్యేవనాభే:ఫణ పరిషదివ ప్రౌడరత్న ప్రకాశా,
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_శతకం" నుండి వెలికితీశారు