అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం సెప్టెంబరు 28న నిర్వహించాలని యునెస్కో ద్వారా నిర్ణయించబడింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడంకోసం ఈ ఉద్యమం ప్రారంభించబడింది. సమాచార హక్కు చట్టం ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినది. భారతదేశంలో 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది.[1]

అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
యునెస్కో పతాకం
అధికారిక పేరుఅంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
జరుపుకొనేవారుయునెస్కో
ప్రారంభం2015
జరుపుకొనే రోజుసెప్టెంబరు 28
ఉత్సవాలుయునెస్కో
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రారంభం మార్చు

2015 నవంబరులో ప్రారంభించబడిన ఈ దినోత్సవం 2016, సెప్టెంబరు 28న మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. 2002 సెప్టెంబరులో బల్గేరియా రాజధాని సోఫియాలో అంతర్జాతీయ హక్కు దినోత్సవంగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పౌర సమాజ న్యాయవాదులచే 2012లో మొదలయింది.[2]

కార్యక్రమాలు మార్చు

సెప్టెంబరు 28వ తేదీన అంతర్జాతీయంగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ, ప్రభుత్వ ఆశయాన్ని గురించి ప్రచారం చేయడం జరుగుతుంది.

మూలాలు మార్చు

  1. ప్రజాశక్తి, నెల్లూరు (27 September 2018). "ధైర్యంగా ప్రశ్నించండి". Archived from the original on 28 September 2018. Retrieved 28 September 2018.
  2. "UNESCO Names Sept. 28 Access to Information Day". freedominfo.org. 17 November 2015. Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 28 September 2018.