అత్తిరాల

అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం లోని గ్రామం


అత్తిరాల (హత్యరాల) అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇక్కడి పరశురామాలయం కారణంగా ప్రముఖ యాత్రాస్థలం.

గ్రామం
పటం
Coordinates: 14°14′37″N 79°09′53″E / 14.243604°N 79.164734°E / 14.243604; 79.164734
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండలంరాజంపేట మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

చరిత్ర మార్చు

  • 1830ల నాటికే ఈ గ్రామానికి పుణ్యక్షేత్రంగా పేరుంది. ఆనాటికే గ్రామం పేటస్థలం, సకల వస్తువులు దొరుకేవి. గ్రామంలో ముస్లిములు ఎక్కువగా ఉండేవారని 19వ శతాబ్ది యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు.[1]
  • అత్తిరాలలో రెండు వేల సంవత్సరాల కాలం నాటి రోమన్ నాణేలు దొరికినాయి.
  • దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు. పొత్తపి రాజు శ్రీకంఠ చోళుడు 'మందరం' గ్రామాన్ని ఈ స్వామికి సమర్పించినాడు. భర్తలు చనిపోయిన భార్యలు, భార్యలు చనిపోయిన భర్తలు ఏడాది లోపు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు.

పేరు వ్యుత్పత్తి మార్చు

ఒక సారి శివుడు తనను దూషించిన బ్రహ్మ ఐదవ తలను నరికినప్పుడు ఆ తల రాలి ఇక్కడే పడిందని, "హత్య! (తల) రాలె!" అనే మాటలే చివరకు "అత్తిరాల" అయ్యాయని అంటారు. ఇంకో కథ ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతాడు. తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బాహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని సేవించాడు. పరశురాముని చేతికంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు అని పేరు వచ్చింది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమనీ, హత్యరాల అనీ అంటారు.

గ్రామ భౌగోళికం మార్చు

వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి నెల్లూరు వెళ్ళే మార్గంలో రాజంపేటకు 5-6 కి.మీ. దూరంలో అత్తిరాల ఉంది. ఈ క్షేత్రం బాహుదా నది ఒడ్డున వెలసింది.

దర్శనీయ ప్రదేశాలు మార్చు

  • పరశురామాలయం: కొండ దిగువన పరశురామాలయం ఉంది. పరశురామాలయం మీద నృత్య భంగిమ శిల్పాలు, రామ, కృష్ణ, విష్ణు, పరశురామ శిల్పాలు ఉన్నాయి. ఇవి కాక మట్లి రాజుల కాలంలో ఉన్న ఏకా తాతయ్య విగ్రహం ఉంది. తలనొప్పితో బాధపడేవారు తమ తలతో తాతయ్య తలకు కొట్టుకుంటారు. అలా చేస్తే తలనొప్పి పోతుందని వారి విశ్వాసం.
  • గదాదరస్వామి ఆలయం: పరశురామాలయం ప్రక్కనే గదాధర స్వామి ఉన్నాడు. ఇది విష్ణ్వాలయం.
  • త్రేతేశ్వరాలయం
  • కామాక్షి ఆలయం: స్త్రీలు ప్రధానంగా కామాక్షీ దేవిని దర్శిస్తారు. గుట్ట పైన జ్యోతి స్తంభం ఉంది. శివరాత్రి నాడు జ్యోతిని వెలిగిస్తారు. మాఘ మాసంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో కూడా ఇక్కడికి చాలా మంది వచ్చి శివుడిని దర్శనం చేసుకొంటారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం జరిగే జాతరకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేశం నలు మూలల నుండి ఈ జాతరను కోసం భక్తులు వస్తారు.

అత్తిరాల బాహుదా నదీ తీరాన ఉన్న పరశురాముడి ఆలయం వద్ద, నీరు ఎండిపోవడంతో, తమిళ శాసనాలతో కూడిన బండలు, ఒక దేవతామూర్తి విగ్రహం బయట పడ్డాయి. అత్తిరాల బాహుదానది ఇంతవరకు ఎండిపోయిన దాఖలాలు లేవు. తీవ్రకరవుతో చెయ్యేరు కొన్నేళ్ళుగా పారకపోవడంతో , బాహుదానది నీటిమట్టం, పూర్తిగా పడిపోయింది. ఈ కారణంగా జీవనది అత్తిరాల బాహుదానదిలో నీరు లేకుండా పోయింది. ఒకప్పుడు నదిలోనికి అడుగు పెట్టాలంటే భయపడే భక్తులు, ఇప్పుడు నదిలో దిగి నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. [2]

మూలాలు, వనరులు మార్చు

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. ఈనాడు కడప; 2014, ఆగష్టు-6; 2వ పేజీ.

బయటి లింకులు మార్చు

  • వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు
"https://te.wikipedia.org/w/index.php?title=అత్తిరాల&oldid=3828977" నుండి వెలికితీశారు