సరస్వతి బ్యారేజి

(అన్నారం బ్యారేజి నుండి దారిమార్పు చెందింది)

సరస్వతి బ్యారేజి (అన్నారం బ్యారేజి) కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా సరస్వతి బ్యారేజి నిర్మించబడింది. యెల్లంపల్లి & మేడిగడ్డ మధ్య మూడు బారేజ్లను నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించిన బారేజిల్లో సరస్వతి బ్యారేజి ఒకటి.

సరస్వతి బ్యారేజి
సరస్వతి బ్యారేజి is located in Telangana
సరస్వతి బ్యారేజి
సరస్వతి బ్యారేజి
సరస్వతి బ్యారేజి is located in India
సరస్వతి బ్యారేజి
సరస్వతి బ్యారేజి (India)
ప్రదేశంఅన్నారం, మహాదేవపూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు18°45′51.9″N 79°49′24.7″E / 18.764417°N 79.823528°E / 18.764417; 79.823528
స్థితినిర్మాణంలో ఉంది
నిర్మాణం ప్రారంభం02 మే 2016
ప్రారంభ తేదీ22 జూన్, 2019
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
Spillways68
జలాశయం
సృష్టించేదిసరస్వతి బ్యారేజి
మొత్తం సామర్థ్యం11.9 tmcft
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeబ్యారేజి

ప్రాజెక్టు వివరాలు మార్చు

2016 మే 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారం వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు.[1] గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్‌ చేశారు.[2]

అంచనా బ్యారేజి వివరాలు:

బ్యారేజి బెడ్ స్థాయి (మీటర్లు) చెరువు స్థాయి (మీటర్లు) స్థూల నిల్వ (TMC లో) గేట్ల సంఖ్య
సరస్వతి బ్యారేజి 107.0 120.0 11.9

ప్రారంభం మార్చు

2019, జూన్ 22న ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది.[3]

పునఃప్రారంభం మార్చు

2022 జూలైలో వచ్చిన వరదలతో ఇక్కడి పంపుహౌస్‌ పూర్తిగా నీటమునిగి అందులోని పలు పరికరాలు దెబ్బతిన్నాయి. ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 మోటార్లు/పంపులు నీటమునగగా ప్యానల్‌ బోర్డు, స్విచ్డ్‌గేర్‌ పరికరాలకు నష్టం జరిగింది. వరదలు తగ్గిన తరువాత మోటార్లలోని విడిభాగాలన్నింటినీ విప్పి, అరబెట్టారు. మొత్తం మోటార్లలో తొలి దశలో నాలుగు మోటార్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన అధికారులు, ప్రతీ 10 రోజుల విరామంతో నడిపించనున్నారు. దాంతో 2022 అక్టోబరు 8న తొలి మోటార్‌ను విజయవంతంగా నడిపిన అధికారులు, నీటిని సుందిళ్ళ బ్యారేజీలోకి ఎత్తిపోశారు. కాళేశ్వరంలో అదనపు టీఎంసీ కోసం తెప్పించి, ఇంకా అమర్చని పరికరాలను ఉపయోగించి అక్టోబరు 18న రెండో మోటార్‌ను కూడా నడిపారు.[4][5] అక్టోబరు 31న మూడో మోటార్‌ను[6], నవంబరు 7న నాలుగో మోటరును నడిపారు.

మూలాలు మార్చు

  1. 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 25 November 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  2. నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Archived from the original on 22 మే 2019. Retrieved 25 November 2017.
  3. "కాళేశ్వరంలో 'మోటార్‌' రేస్‌". Sakshi. 2019-05-16. Archived from the original on 2019-05-15. Retrieved 2022-10-19.
  4. "అన్నారంలో రెండో మోటార్‌ విజయవంతం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-10-19. Archived from the original on 2022-10-19. Retrieved 2022-10-19.
  5. "'అన్నారం' రెండో పంపు అందుబాటులోకి." EENADU. 2022-10-19. Archived from the original on 2022-10-19. Retrieved 2022-10-19.
  6. "'అన్నారం'లోని మూడో పంపు ట్రయల్‌ రన్‌". EENADU. 2022-11-01. Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-09.