అమ్ము స్వామినాథన్

అమ్ము స్వామినాథన్ లేదా అమ్ముకుట్టి స్వామినాథన్ (1894–1978) భారతీయ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంది. ఆమె భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు.[1][2][3]

అమ్ము స్వామినాథన్
అమ్ము స్వామినాథన్


పార్లమెంట్ సభ్యులు
పదవీ కాలం
1951 – 1957
ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.
ముందు None
నియోజకవర్గం దిండిగల్

వ్యక్తిగత వివరాలు

జననం 1894
మరణం 1978
పాల్‌ఘాట్ జిల్లా
జాతీయత భారతీయులు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి డా. సుబ్బరామ స్వామినాథన్
వృత్తి రాజకీత వేత్త
మతం హిందూ

ప్రారంభ జీవితం మార్చు

అమ్ముకుట్టి స్వామినాథన్ కేరళ రాష్ట్రంలోని పాల్‌ఘాట్ జిల్లా లోని అనక్కర వదక్కాత్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి గోవింద మీనన్. ఆయన స్థానిక అధికారి. అమ్ముకుట్టి తల్లిదండ్రులు నాయిర్ కులానికి చెందినవారు. వారికి గల సంతానంలో ఈమె కనిష్ఠ పుత్రిక. 13 వ యేట ఆమె వివాహం డా. సుబ్బరామ స్వామినాథన్ తో సాంప్రదాయ పద్ధతులలో జరిగింది. అతను బ్రాహ్మణ కుటుంబీకుడు. ఆమె భర్త మద్రాసులో బారిష్టరుగా పనిచేసాడు. అతను లండన్ విశ్వవిద్యాలయంలో బారిష్టరు చదివాడు. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ చేశారు.[1][2]

జీవిత గమనం మార్చు

అమ్ము జీవితం డా.స్వామినాథన్ తో వివాహం చేసుకున్న తరువాత అనేక మార్పులకు గురైంది. అతను ఆమె కన్న 20 సంవత్సరాలు పెద్దవాడు. అతను ఆమె ప్రతిభను గుర్తించి ఆమె అభివృద్ధిని ప్రోత్సహించాడు. అతని ప్రభావంతో ఆమె మహాత్మా గాంధీ అనుచరురాలిగా, శిష్యురాలిగా మారి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆమె భారత రాజ్యాంగ పరిషత్ సభ్యురాలిగా యున్నారు.[1][2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Constitution of India". www.constitutionofindia.net. Retrieved 2021-09-26.
  2. 2.0 2.1 2.2 "Ammu Swaminathan: The strongest advocate against caste discrimination, she lived by example". The Indian Express. 2018-02-03. Retrieved 2021-09-26.
  3. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-10-08.

బయటి లింకులు మార్చు