ఆనందమయి మాత లేదా నిర్మల సుందరి (30 ఏప్రిల్ 1896 - 27 ఆగస్టు 1982) ఒక భారతీయ సన్యాసి, యోగా గురువు. పరమహంస యోగానంద సంస్కృత నామధేయమైన ఆనందమయిని ఆంగ్లంలో "Joy-permeated" అని అనువదించారు. ఈ పేరు ఆమెకు 1920వ దశకంలో దైవిక ఆనందం శాశ్వత స్థితిని తెలిజేయడానికి ఆమె భక్తులు ఆమెకు పెట్టారు.[1][2]

శ్రీ ఆనందమయి మా
ఆనందమయి మాత స్టూడియో ఫోటో
జననంనిర్మల సుందరి
(1896-04-30)1896 ఏప్రిల్ 30
ఖేజ్రా, బ్రహ్మంబారియా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్)
నిర్యాణము1982 ఆగస్టు 27(1982-08-27) (వయసు 86)
కిషన్పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారతదేశం
భాగస్వా(ములు)మిరమణి మోహన్ చక్రవర్తి
క్రమముఆత్మసాక్షాత్కారం
తత్వంతంత్రం, భక్తి యోగ

ఆధ్యాత్మిక జీవితం మార్చు

నిర్మల 1924లో తన భర్తతో కలిసి షాబాగ్‌కు వెళ్లింది, అక్కడ అతను ఢాకా నవాబ్ తోటలకు సంరక్షకునిగా నియమించబడ్డాడు. ఈ కాలంలో నిర్మల, కీర్తనలలో పారవశ్యంలో మునిగిపోయింది. "భాయిజీ" అని పిలువబడే జ్యోతిశ్చంద్ర రే ప్రారంభ, సన్నిహిత శిష్యుడు. నిర్మలను ఆనందమయి మా అని పిలవాలని, అంటే "ఆనందం వెల్లివిరిసిన తల్లి" లేదా "బ్లిస్ పెర్మిటెడ్ mother" అని పిలవాలని సూచించిన మొదటి వ్యక్తి. ఆనందమయి మా కోసం 1929లో రామనా కాళీ మందిర్ ఆవరణలో రామనా వద్ద నిర్మించిన మొదటి ఆశ్రమానికి అతను ప్రధాన బాధ్యత వహించాడు. 1926లో, ఆమె సిద్ధేశ్వరి ప్రాంతంలో గతంలో పాడుబడిన పురాతన కాళీ ఆలయాన్ని పునరుద్ధరించింది. షాబాగ్‌లో ఉన్న సమయంలో, ఎక్కువ మంది ప్రజలు దైవిక స్వరూపంగా భావించే వాటివైపు ఆకర్షితులయ్యారు.[3]

మరణం మార్చు

ఈమె 27 ​​ఆగస్టు 1982న డెహ్రాడూన్‌లో మరణించారు, తర్వాత 29 ఆగస్టు 1982న ఉత్తర భారతదేశంలోని హరిద్వార్‌లో ఆమె కంఖాల్ ఆశ్రమం ప్రాంగణంలో సమాధి నిర్మించబడింది.[4]

మూలాలు మార్చు

  1. Newcombe, Suzanne (2017). "The Revival of Yoga in Contemporary India" (PDF). Religion. Oxford Research Encyclopedias. 1. doi:10.1093/acrefore/9780199340378.013.253. ISBN 9780199340378.
  2. Lipski, Alexander (1993). Life and Teaching of Sri Anandamayi Ma. Motillal Benarsidass Publishers. p. 28. ISBN 9788120805316.
  3. McDaniel, June (1989). The Madness of the Saints: Ecstatic Religion in Bengal. University of Chicago Press. p. 194. ISBN 978-0-226-55723-6.
  4. Life History: Chronology of Mothers life Archived 21 ఏప్రిల్ 2016 at the Wayback Machine Anandamayi Ma Ashram Official website. "Prime Minister Smt. Indira Gandhi arrives at noon, Ma's divine body given Maha Samadhi at about 1.30 pm near the previous site of an ancient Pipal tree, under which she used to sit on many occasions and give darshan."