కందికొండ యాదగిరి

కందికొండ (1973 అక్టోబరు 13 - 2022 మార్చి 12) గా పిలువబడే కందికొండ యాదగిరి ప్రముఖ సినీ గీత రచయిత, కవి, కథకుడు.[1][2] 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు.

కందికొండ యాదగిరి
జననంఅక్టోబర్ 13, 1973
నాగుర్లపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా
మరణంమార్చి 12, 2022
వెంగళరావు నగర్‌, హైదరాబాదు
మరణ కారణంక్యాన్సర్‌, అనారోగ్యం
విద్యఎం. ఎ పాలిటిక్స్, ఎం. ఎ తెలుగు
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిసినీ గీత రచయిత, కవి, కథకుడు
జీవిత భాగస్వామిరమాదేవి
పిల్లలుమాతృక (కూతురు), ప్రభంజన్‌ (కుమారుడు)

జీవిత విశేషాలు మార్చు

కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్ లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ (తెలుగు లిటరేచర్), యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు.

ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.

కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు వ్రాసారు. అంతేకాకుండా తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి.

ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.[3]

గేయ రచయితగా మార్చు

మరణం మార్చు

49 ఏళ్ల కందికొండ క్యాన్సర్‌ని జయించి, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2022 మార్చి 12న హైదరాబాదులోని తన ఇంట్లో మరణించాడు.[4][5][6]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ. "పాటకు కొత్త పరిమాళాలద్దిన కందికొండ". Retrieved 30 September 2017.[permanent dead link]
  2. http://telugucinemacharitra.com/%E0%B0%97%E0%B1%80%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%95%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1/
  3. Sakshi (13 March 2022). "1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  4. విలేకరి (12 March 2022). "గేయ రచయిత కందికొండ కన్నుమూత!". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 12 March 2022.[permanent dead link]
  5. Namasthe Telangana (12 March 2022). "కందికొండ కన్నుమూత". Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
  6. Andhra Jyothy (13 March 2022). "గీత రచయిత కందికొండ ఇకలేరు". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.

ఇతర లింకులు మార్చు