కణితి విశ్వనాథం

భారతీయ రాజకీయ నాయకుడు.

కణితి విశ్వనాథం భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త, విద్యావేత్త, వైద్యుడు.[1] కనితి విశ్వనాథం 2023 ఏప్రిల్ 15న మరణించారు.

కణితి విశ్వనాథం
కణితి విశ్వనాథం


భారతదేశ పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
1989–1991, 1991-1996
ముందు హనుమంతు అప్పయ్యదొర
తరువాత కింజరాపు ఎర్రన్నాయుడు
నియోజకవర్గం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1932-07-01) 1932 జూలై 1 (వయసు 91)
హరిదాసుపురం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లలితా విశ్వనాథం
నివాసం శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి ఆంధ్రా మెడికల్ కాలేజీ
మతం హిందూ మతము

జీవిత విశేషాలు మరణం మార్చు

అతను 1932 జూలై 1న శ్రీకాకుళం జిల్లా లోని హరిదాసుపురంలో జన్మించాడు. అతని తండ్రి దొంగాన చౌదరి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ చదివాడు.

అతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అతను అతను శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989, 1991 లలో రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2][3] అతను 2014 నవంబరు 7న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సమక్షంలో బిజెపిలో చేరాడు. కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో అతని తనయుడు రాజేంద్ర, అతని అనుచరులు అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు.[4] కణితి విశ్వనాథం 2023 ఏప్రిల్ 15న తన నివాసంలో విశ్వాస విడిచారు.

నిర్వహించిన పదవులు మార్చు

  • 1989 : 9వ లోక్‌సభకు ఎన్నిక
  • 1989 : కన్సల్ కమిటీ సభ్యుడు, ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వశాఖలో.
  • 1990 :10వ లోక్‌సభకు ఎన్నిక
  • ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యునిగా 34 సంవత్సరాలు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "10వ లోక్ సభ సభ్యుని ప్రొఫైల్".
  2. "Tenth Lok Sabha Members Bioprofile".
  3. "Cadres in limbo over Dharmana's move". Siva G. The Times of India. 4 December 2013. Retrieved 8 May 2015.
  4. "సబ్బం హరికి పిలువు: బిజెపిలోకి కణితి విశ్వానాథం". 8 November 2014.

బయటి లంకెలు మార్చు