కుంజి లాల్ దుబే

భారతీయ స్వాతంత్ర కార్యకర్త, న్యాయవాది, విద్యావేత్త మరియు రాజకీయవేత్త

కుంజి లాల్ దుబే (మార్చి 18, 1896 - జూన్ 2, 1970) ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఈయన పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[1]

కుంజి లాల్ దుబే
జననం(1896-03-18)1896 మార్చి 18
అమగావ్, నర్సింగ్‌పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ భారతదేశం
మరణం1970 జూన్ 2(1970-06-02) (వయసు 74)
మధ్యప్రదేశ్, భారతదేశం
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు
విద్యావేత్త
రాజకీయవేత్త
న్యాయవాది
జీవిత భాగస్వామిలలితబాయ్
పిల్లలుపండిట్. విశ్వనాథ్ దుబే
పురస్కారాలుపద్మభూషణ్

తొలినాళ్ళ జీవితం మార్చు

ఈయన 1896 మార్చి 18 న మధ్యప్రదేశ్‌ లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని అమ్గావ్ అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను కరేలిలోని గ్రామ పాఠశాలలో, నరసింగ్‌పూర్‌లో, అకోలాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు.[2] ఈయన 1914లో జబల్పూర్ లోని రాబర్ట్ సన్ కాలేజీలో చేరిన అతను 1918 లో పట్టభద్రుడయ్యాడు. 1920 అలహాబాద్ లో తన గ్రాడ్యుయేషన్ ని లా విభాగంలో పూర్తిచేసాడు. ఈ సమయంలోనే ఈయన మదన్ మోహన్ మాలవియా, నరసింహ చింతమన్ కేల్కర్ వంటి భారత స్వాతంత్ర్య సమరయోధులను కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన 1934 లో ఇంటర్-యూనివర్శిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా, బర్మా, సిలోన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, దాని శాసనసభ అధ్యక్ష పదవిని కూడా చేపట్టాడు. మరుసటి సంవత్సరం ఈయన జబల్పూర్ హిట్కారిని లా కాలేజీలో ప్రొఫెసర్ గా చేరాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాలతో తనను తాను పొత్తు పెట్టుకుని, 1937 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) లో సభ్యుడయ్యాడు, రెండు సంవత్సరాల తరువాత, 1939 లో ఎఐసిసి యొక్క త్రిపురి సెషన్ సమావేశమైనప్పుడు ఈయన రిసెప్షన్ కమిటీకి కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన్ని1941 లో మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి ఎంపిక చేశాడు, కాని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరు నెలల జైలు శిక్ష విధించారు. 1942 లో జైలు నుండి విడుదలైన తరువాత, ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్ళీ జైలు పాలయ్యాడు. ఈయన 1946 లో జబల్పూర్ నుండి మొదటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1956 నవంబరు ఒకటిన ఏర్పడిన మధ్యప్రదేశ్ యొక్క మొదటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు మొట్టమొదటి స్పీకర్ గా 1956 లో పనిచేశాడు.ఈయన 1957 నుండి 1962 వరకు, 1962 నుండి 1967 వరకు మరో రెండు పర్యాయాలకు స్పీకర్ గా చేసాడు. 1946 లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన అదే సంవత్సరంలో, అతను నాగ్పూర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా వరుసగా మూడుసార్లు నియమితుడయ్యాడు. ఈయనకి హిందీ, మరాఠీ విభాగాలకు సీట్లు ఏర్పాటు చేశాడు, 34 హిందీ గ్రంథాలు, 42 మరాఠీ గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించి, స్థానిక భాషలలో మాట్లాడే విద్యార్థులకు సైన్స్ విషయాలు తెలిసేలా వివరించాడు. మధ్యప్రదేశ్ సాహిత్య సమ్మెలన్ తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు, ఒక మారు సాహిత్య సమ్మెలన్ కు అధ్యక్షుడిగా పనిచేశాడు.[3]

పురస్కారాలు , గుర్తింపులు మార్చు

ఈయనకు భారత ప్రభుత్వం 1964లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈయనకు 1965 లో జబల్పూర్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ లా (హానెరిస్ కాసా) డిగ్రీని అందుకున్నాడు. 1967లో విక్రమ్ విశ్వవిద్యాలయం నుండి డి. లిట్ అందుకున్నాడు. 1996లో ఇండియా పోస్టల్ విభాగం స్మారక తపాలా స్టాంపును విడుదల చేసింది.'[4]

మూలాలు మార్చు

  1. "Commemorative Stamp". India Post. 2016. Retrieved 11 January 2020.
  2. "Dubey on Indianage". Indianage. 2016. Archived from the original on 8 అక్టోబరు 2016. Retrieved 11 January 2020.
  3. "Honorable Chairs of the State Legislative Assembly". Madhya Pradesh Legislative Assembly. 2016. Retrieved 11 January 2020.
  4. "Pandit Kunjilal Dubey Auditorium". Panoramio. 2016. Archived from the original on 13 అక్టోబరు 2016. Retrieved 11 January 2020.