గల్లా అరుణకుమారి

రాజకీయ నాయకురాలు

గల్లా అరుణకుమారి భారత రాజకీయ నాయకురాలు. ఆమె భారత పార్లెమెంటు సభ్యురాలు.[1]

గల్లా అరుణకుమారి
గల్లా అరుణకుమారి
జననంగల్లా అరుణకుమారి
ఆగష్టు 1, 1949
దిగువమాఘం
వృత్తిఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
ప్రసిద్ధిఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ
శాసనసభ సభ్యురాలు , మంత్రి
పదవి పేరుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
పదవీ కాలం1989:చంద్రగిరి నియోజకవర్గం శాసన సభ్యులు
1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్.ఎల్.ఎ
మొత్తం మూడు సార్లు మంత్రి పదవి
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ (2013 వరకు), తెలుగుదేశం పార్టీ (2014 నుండి)
మతంహిందూ మతము
భార్య / భర్తగల్లా రామచంద్ర నాయుడు
పిల్లలుగల్లా జయదేవ్ , గౌరినేని రమాదేవి
తండ్రిపాతూరి రాజగోపాల నాయుడు
తల్లిఅమరావతమ్మ

జీవిత విశేషాలు మార్చు

గల్లా అరుణ కుమారి ఆగష్టు 1, 1949లో పాటూరి రాజగోపాలనాయుడు, అమరావతమ్మ దంపతులకు జన్మించింది. దిగువమాఘం ఈమె స్వగ్రామము.

అరుణ కుమారి అమరరాజా సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడును వివాహము చేసుకున్నది. జయదేవ్, రమాదేవి వీరి సంతానము. కంప్యూటర్ విభాగములో బి.యస్. డిగ్రీ పొంది కొన్ని దినములు క్రైస్లెర్ కార్పొరేషన్ లో కంప్యూటర్ ప్రోగ్రామరుగా, డిపార్ట్మెంటు హెడ్డుగా పనిచేసింది.

రాజకీయ జీవితం మార్చు

అరుణకుమారి తన రాజకీయ జీవితములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు గానూ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ గానూ వ్యవహరించింది. ఆ తరువాత చంద్రగిరి నియోజక వర్గం నుండి 1989 లో మొదటి సారి, 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు ఎమ్.ఎల్.ఎగా విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభ (భారతదేశం)కు ఎన్నికైన తరువాత మూడు సార్లు మంత్రి పదవిని అలంకరించింది. 2008వ సంవత్సరంలో వైద్య విద్య, ఆరోగ్య బీమా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈమె ఆరోగ్యశ్రీ పథక విజయానికి ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాల్గవ సారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టినది. 2010 నవంబరులో రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖలో భూగర్భ, గనుల శాఖా మంత్రిగా స్థానము పొందినది. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని విడనాడి, తెలుగుదేశం పార్టీలో చేరి, 2014 శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ చంద్రగిరి నియోజక వర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అదే సమయంలో రాజకీయ అరంగేట్రం చేసిన తన తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు నియోజక వర్గానికి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడంతో పుత్రోత్సాహం పొందారు.

మూలాలు మార్చు

  1. "Profile - Smt Aruna Kumari". Andhra Pradesh Govt. Archived from the original on 2009-02-02. Retrieved 2009-07-13.

బయటి లంకెలు మార్చు