గుర్జర ప్రతీహార రాజవంశం

గుర్జర ప్రతీహార రాజవంశం భారత ఉపఖండంలో చివరి క్లాసికలు కాలంలో ఒక సామ్రాజ్య శక్తి. ఇది 8 వ శతాబ్దం మధ్య నుండి 11 వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం పరిపాలించింది. వారు మొదట ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని, తరువాత కన్నౌజ్ను రాజధానిగా చేసుకుని పాలించారు.[1]

గుర్జర ప్రతీహార వంశం

సా.శ. 8 వ శతాబ్ది మధ్యలో–సా.శ. 1036
ప్రతీహార సామ్రాజ్యం
ఆకుపచ్చ రంగులో ప్రతీహార సామ్రాజ్యం
స్థాయిరాజ్యం
రాజధానికన్నౌ
సామాన్య భాషలుసంస్కృతం, ప్రాకృతం
మతం
హిందూమతం
ప్రభుత్వంరాచరికం
చారిత్రిక కాలంమధ్య యుగ భారతీయ పాలకులు
• స్థాపన
సా.శ. 8 వ శతాబ్ది మధ్యలో
• కన్నౌజ్‌పై గజనీ మహమ్మదు దండయాత్ర
సా.శ. 1008
• పతనం
సా.శ. 1036
Preceded by
Succeeded by
పుష్యభూతి వంశం
చందేలా
పరామర వంశం
త్రిపురి కాలచుర్యులు
ఘురిద్ సుల్తానులు
Chavda dynasty
శాకంబరీ చహమానులు
Today part ofభారతదేశం

అరబ్బు సైన్యాలను సింధు నదికి తూర్పుప్రాంతం దాటకుండా చేయడంలో గుర్జర ప్రతీహారులు కీలక పాత్ర పోషించాయి.[2] మొదటి నాగభట భారతదేశంలో కాలిఫేటు పోరాటంలో జునైదు టామిను ఆధ్వర్యంలో అరబు సైన్యాన్ని ఓడించారు. రెండవ నాగభట ఆధ్వర్యంలో గుర్జర ప్రతీహారులు ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజవంశం అయ్యాయి. అతని తరువాత అతని కుమారుడు రామభద్ర, అతని కుమారుడు మిహిరా భోజా తరువాత కొంతకాలం పాలించారు. భోజా, అతని వారసుడు మొదటి మహేంద్రపాల కింద, ప్రతీహార సామ్రాజ్యం శ్రేయస్సు, శక్తి గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మహేంద్రపాల సమయానికి, గుప్తా సామ్రాజ్యం పశ్చిమాన సింధు సరిహద్దు నుండి తూర్పున బెంగాలు వరకు ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన నర్మదా దాటిన ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.[3][4] ఈ విస్తరణ భారత ఉపఖండం నియంత్రణలో రాష్ట్రకూట, పాల సామ్రాజ్యాలతో త్రైపాక్షిక శక్తి పోరాటాన్ని ప్రేరేపించింది. ఈ కాలంలో ఇంపీరియలు ప్రతీహార ఆర్యావర్త (భారతదేశపు గొప్ప రాజుల రాజు) మహారాజాధిరాజ బిరుదును పొందారు.

గుర్జర ప్రతీహార శిల్పాలు, కుడ్యచిత్రాలు, మాహాద్వారాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందాయి. వారి ఆలయ నిర్మాణ శైలి గొప్ప నిదర్శనం ప్రస్తుత యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖాజురాహో వద్ద ఉంది.[5]

ప్రతీహారుల శక్తి రాజవంశ కలహాలతో బలహీనపడింది. రాష్ట్రకూట పాలకుడు మూడవ ఇంద్ర నేతృత్వంలోని గొప్ప దండయాత్ర ఫలితంగా ఇది మరింత తగ్గిపోయింది. సుమారు 916 లో కన్నౌజ్ను తొలగించారు. అస్పష్టమైన పాలకుల వారసత్వంలో ప్రతీహారులు తమ పూర్వ ప్రభావాన్ని తిరిగి పొందలేదు. వారి భూస్వామ్య అధిపతులు మరింత శక్తివంతమయ్యారు. 10 వ శతాబ్దం చివరినాటికి ప్రతీహారుల సామంతులు ఒక్క్కొకరుగా వారి విధేయతను వదిలివేసి స్వతత్రులయ్యారు. చివరికి ప్రతీహారులు గంగామైదానంతో మరికొంత ప్రాంతాన్ని మాత్రం నియత్రించగలిగారు. వారి చివరి ముఖ్యమైన రాజు రాజపాలను కన్నౌజ్ నుండి 1018 లో ఘజ్నీ మహముదు తరిమికొట్టాడు.[4]

పేరు వెనుక చరిత్ర మార్చు

 
నిల్గుండు శిలాశాసనం (క్రీ.పూ 866)లో అమోఘవర్ష తన తండ్రి గుర్జర రాజు (చిత్రకూట) వద్ద సామంతుడుగా ఉన్నాడని పేర్కొన్నాడు

రాజవంశం మూలం దాని పేరులో "గుర్జర" అనే పదం అర్థం చరిత్రకారులలో చర్చనీయాంశం. ఈ రాజవంశం పాలకులు తమ వంశం కోసం "ప్రతీహార" అనే స్వీయ-హోదాను ఉపయోగించారు. తమను తాము గుర్జరులమని ఎప్పుడూ పేర్కొనలేదు.[6] పురాణ హీరో లక్ష్మణుడు పదానికి మూలమని వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఆయన తన సోదరుడు రాముడికి ప్రతీహారుడి ("ద్వారపాలకుడు") గా వ్యవహరించాడని చెబుతారు. [7][8] కొంతమంది ఆధునిక పరిశోధకులు ప్రతీహార పూర్వీకుడు రాష్ట్రకూట రాజసభలో "రక్షణ మంత్రి" (ప్రతీహార) గా పనిచేశారని సిద్ధాంతీకరించారు. ఈ విధంగా రాజవంశం ప్రతీహార అని పిలువబడింది.[9]

వారి పొరుగు రాజవంశాల బహుళ శాసనాలు ప్రతీహారులను "గుర్జర"గా వర్ణించాయి.[10] "గుర్జర ప్రతిహర" అనే పదం తనను తాను "గుర్జర ప్రతీహార"గా అభివర్ణించే మథానదేవ అనే భూస్వామ్య పాలకుడి రాజోరు శాసనంలో మాత్రమే సంభవిస్తుంది. ఒక ఆలోచనా విధానం ఆధారంగా గుర్జర అనేది ప్రతీహారుల చేత పాలించబడిన భూభాగం (గుర్జర దేశం చూడండి); క్రమంగా ఈ పదం ఈ భూభాగంలోని ప్రజలను సూచిస్తుంది. ఒక వ్యతిరేక సిద్ధాంతం ఏమిటంటే గుర్జర అనేది రాజవంశం చెందిన తెగ పేరు ప్రతీహార ఈ తెగకు చెందిన వంశం.[11]

గుర్జర అనే పదం మొదట గిరిజన తెగ అని విశ్వసించే వారిలో వారు స్థానిక భారతీయులు లేదా విదేశీయులు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.[12]ఆ ప్రాంతం మీద హుణులు దాడి చేసిన కొద్దికాలానికే సా.శ. 6 వ శతాబ్దంలో గుర్జర ప్రతీహారులు అకస్మాత్తుగా ఉత్తర భారతదేశంలో రాజకీయ శక్తిగా ఉద్భవించాయని విదేశీ మూలం సిద్ధాంతం ప్రతిపాదకులు అభిప్రాయపడుతున్నారు. [13] విదేశీ మూలం సిద్ధాంతం విమర్శకులు వారి విదేశీ మూలానికి నిశ్చయాత్మకమైన ఆధారాలు లేవని వాదించారు: వారు భారతీయ సంస్కృతిలో బాగా కలిసిపోయారు. అంతేకాకుండా వారు వాయవ్య దిశలో భారతీయుల మీద దాడిచేస్తే వారు సారవంతమైన ఇండో-గంగా మైదానం వదిలి ప్రస్తుత రాజస్థాను అర్ధ-శుష్క ప్రాంతంలో ఎందుకు స్థిరపడతారో వివరించలేము.[14]

పృథ్వీరాజు రాసో తరువాతి వ్రాతప్రతులలో ఇచ్చిన అగ్నివాంశా పురాణం ఆధారంగా ప్రతీహారులు, మరో మూడు రాజపుత్ర రాజవంశాలుఅ మౌంట్ అబూ వద్ద ఉన్న అగ్నికుండం నుండి ఉద్భవించాయి. కొంతమంది వలసరాజ్యాల యుగ చరిత్రకారులు ఈ రాజ్యాన్ని ఒక విదేశీ మూలాన్ని సూచించడానికి ఈ పురాణాన్ని ఆధారం చేసుకున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం అగ్నికర్మ చేసిన తరువాత విదేశీయులను హిందూ కుల వ్యవస్థలో చేర్చారు. [15] అయితే ఈ పురాణం పృథ్వీరాజు రాసో తొలి కాపీలలో కనుగొనబడలేదు. ఇది పరమరా పురాణం మీద ఆధారపడి ఉంటుంది; 16 వ శతాబ్దపు రాజపుత్ర బోర్డులు మొఘలులకు వ్యతిరేకంగా రాజపుత్ర ఐక్యతను పెంపొందించడానికి ప్రతిహరాలతో సహా ఇతర రాజవంశాలను చేర్చడానికి అసలు పురాణాన్ని విస్తరించాయి.[16]

చరిత్ర మార్చు

ప్రతీహార శక్తి అసలు కేంద్రం వివాదాస్పదమైంది. సా.శ. 783 లోని హరివంశ-పురాణంలోని ఒక పద్యం ఆధారంగా ఆర్.సి.మజుందారు అభిప్రాయంలో వత్సరాజు ఉజ్జయిని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడని భావిస్తున్నారు.[17] దశరథ శర్మ దీనిని భిన్నంగా అర్థం చేసుకుని అసలు రాజధాని భిన్మల జలోరు ప్రాంతంలో ఉంది.[18] ఎం.డబల్యూ. మీస్టరు,[19] శాంత రాణి శర్మ [20]

ఈ తీర్మానంతో ఏకీభవించారు. జైన కథనం కువలయమల రచయిత దీనిని సా.శ. 778 లో వత్సరాజు కాలంలో జలోరు వద్ద కంపోజు చేశారని పేర్కొంది. హరివంశ-పురాణం కూర్పుకు ఇది ఐదేళ్ళకు ముందు జరిగింది.

ఆరంభకాల పాలకులు మార్చు

మొదటి నాగభట (730-756) తన నియంత్రణను మాండోరు నుండి తూర్పు, దక్షిణాన విస్తరించి, మాల్వాను గ్వాలియరు వరకు స్వాధీనం చేసుకుని గుజరాతు లోని భరూచు నౌకాశ్రయాన్ని జయించాడు. ఆయన తన మాల్వాలోని అవంతిని రాజధానిగా స్థాపించాడు. సింధులో తమను తాము స్థాపించుకున్న అరబ్బుల విస్తరణను ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో (సా.శ. 738) అప్పటి వరకు పశ్చిమ ఆసియా, ఇరాను నుండి విస్తరణ కావడానికి ప్రయత్నిస్తున్న ముస్లిం అరబ్బులను ఓడించడానికి నాగభట గుర్జర ప్రతీహారుల సమాఖ్యకు నాయకత్వం వహించారు. మొదటి నాగభట తరువాత ఇద్దరు బలహీనమైన వారసులు ఉన్నారు. వీరి తరువాత వత్రజరాజ (775–805) అధికారం చేపట్టాడు.

 
గుర్జర - ప్రతీహారుల (సా.శ. 850-900) కాలంలో వరాహావతారం బొమ్మతో ముద్రించబడిన నాణ్యం (బ్రిటిషు మ్యూజియం)

కాలిఫటేల అడ్డగింత మార్చు

గుర్జర ప్రతీహార చక్రవర్తి నాగభట "శక్తివంతమైన మ్లేచా రాజు పెద్ద సైన్యాన్ని ధ్వంశం చేసాడు" అని రికార్డు చేయబడింది. ఈ పెద్ద సైన్యంలో అశ్వికదళం, పదాతిదళం, ముట్టడి ఫిరంగిదళాలు, బహుశా ఒంటెల శక్తి ఉన్నాయి. టామిను కొత్త రాజప్రతినిధి అయినందున, ఆయనకు డమాస్కసు నుండి సిరియను అశ్వికదళం ఉంది. స్థానిక అరబ్బు దళాలు సింధు హిందువులను, తురుక్కులు వంటి విదేశీ కిరాయి సైనికులను ముస్లిములుగా మార్చాయి. ఆక్రమణ సైన్యం మొత్తం 10–15,000 అశ్వికదళం, 5000 పదాతిదళం, 2000 ఒంటెల దళం ఉండవచ్చు.[ఆధారం చూపాలి]

సా.శ. 851 లో ప్రతీహారుల సైన్యం ఉన్నట్లు అరబు చరిత్రకారుడు సులైమాను వివరిస్తూ "గుర్జార్ల పాలకుడు అనేక శక్తులను నిర్వహిస్తున్నాడు. ఆయనకు మినహా మరే ఇతర భారతీయ యువరాజుకు అశ్వికదళం లేదు. ఆయన రాజు అని అంగీకరించాడు. అరబ్బులు గొప్పపాలకులని ఆయన గ్రహించినప్పటికీ ఆయన అరబ్బులతో స్నేహపూర్వకంగా లేడు. భారత రాజకుమారులలో ఆయన కంటే ఇస్లామికు విశ్వాసానికి గొప్ప శత్రువు మరొకరు లేరు. ఆయన సంపన్నుడు అయ్యాడు. ఆయనకు ఒంటెలు, గుర్రాలు చాలా ఉన్నాయి. "[21]

కన్నౌజ్ విజయం, అదనపు విస్తరణ మార్చు

 
గుర్జర - ప్రతీహారులు కాలంలో కన్నౌజ్ రాజు మిహిర భోజుడు ముద్రించిన నాణ్యాలు.వరాహావతారంలో విష్ణువు. సూర్య చిహ్నం.ససానియను శైలిలో శ్రీమదు ఆది వరాహం[22][23]

హర్షుడు వారసులు లేకుండా మరణించినందున కన్నౌజ్ మహానగరంలో అధికార శూన్యత ఏర్పడింది. దీని ఫలితంగా హర్ష సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఈ స్థలం చివరికి ఒక శతాబ్దం తరువాత యశోవర్మ ఆక్రమించాడు. కాని ఆయన స్థానం లలితాదిత్య ముక్తపీడుడితో పొత్తు మీద ఆధారపడింది. ముక్తపీడుడు యశోవర్మను బలహీనం చేసినప్పుడు, నగరనియంత్రణ కొరకు త్రి-పక్ష పోరాటం అభివృద్ధి చెందింది. ఇందులో ప్రతీహారులు పాల్గొన్నారు. ఆ సమయంలో పశ్చిమ, ఉత్తరాన ఉన్న భూభాగం, తూర్పున బెంగాలు పాలాలకు, రాష్ట్రకూటుల స్థావరం దక్షిణాన ఉన్నాయి.[24][25] కన్నౌజ్ నియంత్రణ కొరకు వాలాజరా పాల పాలకుడు ధర్మపాల, రాష్ట్రకూట రాజు దంతిదుర్గను సవాలు చేసి ఓడించాడు.

786 లో రాష్ట్రకూట పాలకుడు ధ్రువ (మ. 780–793) నర్మదా నదిని మాల్వాలాను దాటి, అక్కడి నుండి కన్నౌజ్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. రాష్ట్రకూట రాజవంశానికి చెందిన ధ్రువ ధరవర్ష 800 లో వత్సరాజును ఓడించాడు. వత్సరాజును వెన్నంటి రెండవ నాగభట (805–833)పాలించాడు. ఆయనను మొదట రాష్ట్రకూట పాలకుడు మూడవ గోవింద (793–814) ఓడించాడు. కాని తరువాత మాల్వాను రాష్ట్రకూటుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. పలాల నుండి బీహారు వరకు కన్నౌజ్, ఇండో-గంగా మైదానాన్ని జయించి, పశ్చిమాన ముస్లింలను తిరిగి ఎదుర్కొన్నాడు. సింధు నుండి అరబ్బుల దాడిలో కూల్చివేసిన గుజరాతులోని సోమనాథ వద్ద ఉన్న గొప్ప శివాలయాన్ని ఆయన పునర్నిర్మించారు. కన్నౌజ్ గుర్జర ప్రతీహార రాష్ట్రానికి కేంద్రంగా మారింది. ఇది వారి శక్తి శిఖరాగ్రస్థితిలో ఉన్న సమయంలో ఉత్తర భారతదేశాన్ని చాలా వరకు కవరు చేసింది. సి. 836-910.[ఆధారం చూపాలి]

రెండవ నాగభట తరువాత రాంభద్ర (833-సి. 836) కొంతకాలం వచ్చారు. మిహిరా భోజా (మ. 836–886) ప్రతీహార రాజ్యాలను పశ్చిమాన సింధు సరిహద్దుకు, తూర్పున బెంగాలుకు, దక్షిణాన నర్మదాకు విస్తరించింది. ఆయన కుమారుడు మొదటి మహేంద్రపాలుడు (890–910), మగధ, బెంగాలు, అస్సాంలలో మరింత తూర్పువైపు విస్తరించాడు.[ఆధారం చూపాలి]

క్షీణత మార్చు

రెండవ భోజా (910-912) ను మొదటి మహిపాల I (912-944) పడగొట్టాడు. గుర్జర ప్రతీహారుల తాత్కాలిక బలహీనతను సద్వినియోగం చేసుకుని సామ్రాజ్యంలోని అనేక మంది భూస్వామ్యవాదులు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. వీరిలో మాల్వా పరమారాలు, బుందేలుఖండు చందేలాలు, మహాకోషలు, కలాచురీలు, హర్యానా తోమారాలు, శకాంభరి చాహమానాలు ఉన్నారు. రాష్ట్రకూట రాజవంశంలోని దక్షిణ భారత చక్రవర్తి మూడవ ఇంద్ర (మ. 914-928) 916 లో కన్నౌజ్ను స్వల్పకాలం స్వాధీనం చేసుకున్నారు. ప్రతిహరులు నగరాన్ని తిరిగి పొందినప్పటికీ 10 వ శతాబ్దంలో వారి స్థానం బలహీనపడటం కొనసాగింది. కొంతవరకు ఏకకాలంలో పోరాటాల ఫలితంగా పడమటి నుండి తురుక్కుల దాడులతో పోరాడటం, దక్షిణం నుండి రాష్ట్రకూట రాజవంశం నుండి దాడులు, తూర్పున పాల పురోగతి ప్రతిహరాలను మరింత బలహీన పరచింది. గుర్జర ప్రతీహారులు తమ భూస్వామ్యవాదులకు రాజస్థాను నియంత్రణను కోల్పోయారు. చందేలాలు 950 లో మధ్య భారతదేశంలోని గ్వాలియరు కోటను వ్యూహాత్మకంగా స్వాధీనం చేసుకున్నారు. 10 వ శతాబ్దం చివరి నాటికి గుర్జర ప్రతీహార డొమైన్లు కన్నౌజ్ కేంద్రీకృతమై ఉన్న ఒక చిన్న రాజ్యంగా క్షీణించాయి.[ఆధారం చూపాలి]

ఘజ్నీ మహమూదు 1018 లో కన్నౌజ్ను స్వాధీనం చేసుకున్నాడు. ప్రతిహర పాలకుడు రాజపాల పారిపోయాడు. తరువాత అతన్ని చందేలా పాలకుడు విద్యాధరుడు బంధించి చంపాడు.[26][27] అప్పుడు చందేలా పాలకుడు రాజపాల కుమారుడు త్రిలోచన్పాలాను సింహాసనం మీద ప్రతినిధిగా ఉంచాడు. కన్నౌజ్ చివరి గుర్జర ప్రతీహార పాలకుడు జసపాల 1036 లో మరణించారు.[ఆధారం చూపాలి]

గుర్జర - ప్రతీహార కళలు మార్చు

ప్రతీహార శకం శిల్పాలు, చెక్కిన ప్యానెల్స్‌తో సహా.[29] వారి దేవాలయాలు, బహిరంగ మహాద్వారం శైలిలో నిర్మించబడ్డాయి. గుర్జర ప్రతీహార శిల్పకళలో గుర్తించదగినది ఖజురాహో. దీనిని వారి సామ్రాజ్యాలైన బుందేలు ఖండు చందేలాలు నిర్మించారు.[5]

మరు - గుర్జర నిర్మాణకళ మార్చు

గుర్జర ప్రతీహారుల పాలనలో మరు - గుర్జర నిర్మాణకళ అభివృద్ధి చెందింది.

బతేశ్వరు హిందూ ఆలయసమూహాలు మార్చు

8 – 11 శతాబ్ధాల మద్యకాలంలో గుర్జర - ప్రతీహార సామ్రాజ్యపాలనా కాలంలో భతేశ్వర హిందూ ఆలయం (మద్యప్రదేశు) నిర్మించబడింది. [30]

బరోలీ ఆలయ సమూహం మార్చు

గుర్జర - ప్రతీహారుల కాలంలో ప్రాహారం లోపల నిర్మించబడిన బరోలీ ఆలయసమూహంలో 8 ఆలయాలు ఉన్నాయి.

వారసత్వం మార్చు

భారతదేశ చరిత్రకారులు ఎల్ఫిన్స్టోను కాలం నుండి భారతదేశంలో ముస్లిం ఆక్రమణదారులు నెమ్మదిగా పురోగతి చెందడం గురించి ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వారి వేగవంతమైన పురోగతితో పోలిస్తే. అరబ్బులు ఖలీఫు నుండి స్వతంత్రంగా చిన్న దండయాత్రలను మాత్రమే సాగించారు. ఈ ప్రత్యేకమైన దృగ్విషయాన్ని వివరించడానికి సందేహాస్పదమైన వాదనలు తరచూ బలపడ్డాయి. ప్రస్తుతం గుర్జర ప్రతీహార సైన్యం శక్తి సింధు పరిమితికి మించి ముస్లింల పురోగతిని సమర్థవంతంగా అడ్డుకున్నదని విశ్వసిస్తున్నారు. వారి మొదటి విజయం దాదాపు మూడు వందల సంవత్సరాలుగా ఇది కొనసాగింది. తరువాతి సంఘటనలు దీనిని "భారత చరిత్రకు గుర్జర ప్రతీహారుల ముఖ్య సహకారం"గా పరిగణించవచ్చు.[21]

పాలకుల జాబితా మార్చు

మూలాలు మార్చు

  1. Avari 2007, pp. 204–205: Madhyadesha became the ambition of two particular clans among a tribal people in Rajasthan, known as Gurjara and Pratihara. They were both part of a larger federation of tribes, some of which later came to be known as the Rajputs
  2. Wink, André (2002). Al-Hind: Early Medieval India and the Expansion of Islam, 7th–11th Centuries. Leiden: BRILL. p. 284. ISBN 978-0-391-04173-8.
  3. Avari 2007, p. 303.
  4. 4.0 4.1 Sircar 1971, p. 146.
  5. 5.0 5.1 Partha Mitter, Indian art, Oxford University Press, 2001 pp.66
  6. Sanjay Sharma 2006, p. 188.
  7. Tripathi 1959, p. 223.
  8. Puri 1957, p. 7.
  9. Agnihotri, V. K. (2010). Indian History. Vol. 26. p. B8. Modern historians believed that the name was derived from one of the kings of the line holding the office of Pratihara in the Rashtrakuta court
  10. Puri 1957, p. 9-13.
  11. Majumdar 1981, pp. 612–613.
  12. Puri 1957, p. 1-2.
  13. Puri 1957, p. 2.
  14. Puri 1957, pp. 4–6.
  15. Yadava 1982, p. 35.
  16. Singh 1964, pp. 17–18.
  17. Majumdar, R.C. (1955). The Age of Imperial Kanauj (First ed.). Bombay: Bharatiya Vidya Bhavan. pp. 21–22.
  18. Sharma, Dasharatha (1966). Rajasthan through the Ages. Bikaner: Rajasthan State Archives. pp. 124–30.
  19. Meister, M.W (1991). Encyclopaedia of Indian Temple Architecture, Vol. 2, pt.2, North India: Period of Early Maturity, c. AD 700-900 (first ed.). Delhi: American Institute of Indian Studies. p. 153. ISBN 0-19-562921-3.
  20. Sharma, Shanta Rani (2017). Origin and Rise of the Imperial Pratihāras of Rajasthan: Transitions, Trajectories and Historical Chang (First ed.). Jaipur: University of Rajasthan. pp. 77–78. ISBN 978-93-85593-18-5.
  21. 21.0 21.1 Chaurasia, Radhey Shyam (2002). History of Ancient India: Earliest Times to 1000 A. D. Atlantic Publishers & Distributors. p. 207. ISBN 978-81-269-0027-5.
  22. Smith, Vincent Arthur; Edwardes, S. M. (Stephen Meredyth) (1924). The early history of India : from 600 B.C. to the Muhammadan conquest, including the invasion of Alexander the Great. Oxford : Clarendon Press. p. Plate 2.
  23. Ray, Himanshu Prabha (2019). Negotiating Cultural Identity: Landscapes in Early Medieval South Asian History (in ఇంగ్లీష్). Taylor & Francis. p. 164. ISBN 978-1-00-022793-2.
  24. Chopra, Pran Nath (2003). A Comprehensive History of Ancient India. Sterling Publishers. pp. 194–195. ISBN 978-81-207-2503-4.
  25. Kulke, Hermann; Rothermund, Dietmar (2004) [1986]. A History of India (4th ed.). Routledge. p. 114. ISBN 978-0-415-32920-0.
  26. Dikshit, R. K. (1976). The Candellas of Jejākabhukti. Abhinav. p. 72. ISBN 9788170170464.
  27. Mitra, Sisirkumar (1977). The Early Rulers of Khajurāho. Motilal Banarsidass. pp. 72–73. ISBN 9788120819979.
  28. K. D. Bajpai (2006). History of Gopāchala. Bharatiya Jnanpith. p. 31. ISBN 978-81-263-1155-2.
  29. Kala, Jayantika (1988). Epic scenes in Indian plastic art. Abhinav Publications. p. 5. ISBN 978-81-7017-228-4.
  30. "ASI to resume restoration of Bateshwar temple complex in Chambal". Hindustan Times. 21 మే 2018.

గ్రంధసూచిక మార్చు

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Gurjara-Pratihara kings మూస:Middle Kingdoms of India