గోపికాభాయి హోల్కరు

గోపికాబాయి (1724 డిసెంబరు 20, భారతదేశంలోని పూనాకు సమీపంలో ఉన్న సుపాలో - 1778 ఆగస్టు 11 నాసికులో) పూనా సమీపంలోని వైకు చెందిన భికాజీ నాయకు రాస్టే కుమార్తె.

బాల్యం మార్చు

పేష్వా బాలాజీ విశ్వనాథు భార్య రాధాబాయి రాస్టే కుటుంబాన్ని సందర్శించినప్పుడు గోపికాబాయిని గుర్తించింది. మతపరమైన ఉపవాసం, ఆచారాలను గోపికాబాయి సనాతనంగా పాటించడం చూసి రాధాబాయి ముగ్ధురాలై, మొదటి బాజీ రావు పెద్ద కుమారుడు బాలాజీ బాజీరావుతో(తరువాత నానాసాహెబ్ పేష్వా అని పిలుస్తారు) వివాహం చేసుకోవడానికి ఆమెను ఎన్నుకున్నది. గోపికాభాయి పురోహిత బ్రాహ్మణ కుటుంబాలలోని ఆచరించే పూజారుల మతాచారాలు, సంప్రదాయాలు గురించి చక్కగా అవగాహన కలిగిన మహిళగా గుర్తించబడింది.

సంప్రదాయ ఆచారాలు మార్చు

గోపికాబాయి తన తరువాతి జీవితంలో తీవ్రమైన లోపాలను ఎదుర్కొంది. ఎందుకంటే ఆమె తక్కువగా అంచనా వేయబడలేదు లేదా రాజసభా పరిపాలనా లేదా సైనిక విషయాలను నిర్వహించడంలో సరైన శిక్షణ ఇవ్వలేదు. ఆమె అహంకార ప్రవర్తన, సంకుచిత మనస్తత్వ దృక్పథానికి ఆమె సనాతన మత పెంపకం ప్రధాన కారణమని భావించారు. ఆమె రెండవ కుమారుడు మాధవరావుతో సంబంధాలను తెంచుకోవడంతో సహా, తరువాతి జీవితంలో గోపికాబాయి తీసుకున్న కొన్ని క్రూర నిర్ణయాలు ఆమె సనాతన పెంపకం ఫలితంగా గుర్తించబడ్డాయి. గోపికాబాయి మతపరమైన పెంపకంతో అభివృద్ధి చేదుకున్న చాంధసభాల కారణంగా షాహు, నానాసాహెబు పేష్వా అనుసరిస్తున్న సభారాజకీయాలను అర్థం చేసుకోలేకపోయింది.

ఈర్ష్య, అహంకారం మార్చు

ఆమె భర్త పేష్వా అయ్యాక గోపికాబాయి పేష్వా ఇంటిలోని ఇతర మహిళలతో కలిసి ఉండలేకపోయింది. పేష్వా సోదరుడు రఘునాథరావును వివాహం చేసుకున్న ఆమె బంధువు ఆనందీబాయితో శత్రుత్వం పెంచుకున్నది. పేష్వా బంధువు సదాశివరావు భావు భార్య పార్వతిబాయి, గోపికాబాయి మధ్య కూడా వివాదం ఏర్పడింది. షాహు, నానాసాహెబు పేష్వా తన పెద్ద కుమారుడు విశ్వసరావును వివాహం చేసుకోవడానికి పార్వతిబాయి మేనకోడలు రాధికాబాయిని ఎన్నుకోవడం సంభవించింది. అబ్దులిని ఓడించిన తరువాత భూసాహెబు అన్ని ప్రశంసలు పొందడం ఆమె సహించలేదు. విశ్వసరావు పెద్ద పాత్ర పోషించాలని కోరుకుంటున్నందున అబ్దాలీ మీద యుద్ధానికి సదాశివరావు భావు (భూసాహెబు) తో పాటు విశ్వసరావును పంపాలని గోపికాబాయి పట్టుబట్టింది. నానాసాహెబు తరువాత విశ్వసరావు తదుపరి పేష్వా అవుతాడని భావించి ఆమె ఇలా చేసింది. నౌసాహెబు భూసాహెబును తదుపరి పేష్వాగా మార్చాలని యోచిస్తున్నట్లు ఆమె అనుమానించింది.[1]

నానాసాహెబు మరణం మార్చు

మూడవ పానిపట్టు యుద్ధంలో రాధికాబాయి చెడ్డ శకునం కారణంగా ఆమె కుమారుడు విశ్వసరావు మరణించాడని ఆరోపించింది. భావోద్వేగ మద్దతు ఇవ్వడానికి బదులుగా, గోపికాబాయి తన కొడుకు మరణానికి నానాసాహెబు పేష్వాను నిరంతరం దూషించింది. ఇది నానాసహెబు (పూనా సమీపంలోని పార్వతి కొండ వద్ద) మానసిక వత్తిడితో మరణించడానికి కారణం అయింది.

మధవరావు సింహాసనాధిరోహణ, పాలన మార్చు

నానాసాహెబు పేష్వా మరణం తరువాత, పేష్వా నియామకాల గురించి వివాదం తలెత్తింది. ఛత్రపతి షాహు వారసుడు లేకుండా మరణించాడు. ఈ సమయానికి పేష్వా పదవి వంశపారంపర్యంగా మారింది. ఆమె సోదరుడు సలహాతో గోపికాబాయి పరిపాలనా విషయాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది. నానాసాహెబు మొదటి కుమారుడు, చట్టపరమైన వారసుడు విశ్వసరావు అప్పటికే మరణించినందున, నానాసాహెబు రెండవ కుమారుడు మాధవరావు, నానాసాహెబ్ తమ్ముడు రఘునాథరావు ఈ పదవిని అధిరోహించడంలో వివాదం తలెత్తింది. రఘునాథరావు భార్య ఆనందీబాయితో గోపికాబాయికి ఉన్న సంబంధాలు స్నేహపూర్వకంగా లేకపోవడం దీనికి ఆజ్యం పోసింది.

చివరగా రఘునాథరావు మార్గదర్శకత్వంలో మాధవరావు పేష్వా పదవిని అధిరోహించాలని నిర్ణయించారు. పేష్వా కావడంతో తన కొడుకు మీద నియంత్రణ ప్రభావం చూపాలని భావించిన గోపికాబాయికి ఈ నిర్ణయం ఎదురుదెబ్బ తగిలింది. కాని ఇప్పుడు రఘునాథరావు నుండి కార్యాలు సాధించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన తన భార్య ఆనందైబాయి బలమైన ప్రభావంతో ఉన్నాడు. అంతేకాకుండా రాజసభా పరిపాలనకు గోపికాబాయికి సరైన శిక్షణ లేకపోవటం, ఆమె సభికుల సలహాల కారణంగా తన కొడుకుతో ఉన్న సంబంధాన్ని చెడిపోవడానికి కారణంగా పరిణమించింది. ప్రభావవంతమైన వడ్డీవ్యాపారిగా మారిన ఆమె సోదరుడు సర్దార్ రాస్టే సహాయంతో ఆమె తన కుమారుడు మాధవరావు పేష్వాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది.

మాధవరావు పేష్వా పరిపాలనా విషయాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు. తెలివైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. తన పరిపాలన మీద రఘునాథరావు నియంత్రణను తొలగించాలని గోపికాబాయి కోరింది. రఘునాథరావు కొన్ని తప్పుడు నిర్ణయాలు పరిపాలనలో విస్తృత చీలికకు కారణమయ్యాయి. రఘునాథరావు పరిపాలనకు వ్యతిరేకంగా పూనా మీద దాడి చేసిన సమయంలో సర్దారు రాస్టే హైదరాబాదు నిజాం, నాగ్పూరుకు చెందిన భోన్సాలేతో కలిసి పనిచేశారు.

నాసికులో గృహనిర్బంధం మార్చు

రఘునాథరావును పక్కన పెట్టడం ద్వారా మాధవరావు పేష్వా పరిపాలన మీద నియంత్రణ సాధించాడు. ఆయన మొదటి చర్యలలో నిజాంకు సహాయం చేసిన వారిని శిక్షించడం ప్రధానమైనది. వారిలో ప్రముఖమైన సర్దారు రాస్టే ఉన్నాడు. తన సోదరుడి మీద దయ చూపమని విజ్ఞప్తి చేసిన గోపికాబాయి అలాంటి చర్య పరిణామాల గురించి కఠినంగా హెచ్చరించబడింది. పరిపాలనా విషయాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పబడింది. ఆమె పట్టుదలతో ప్రవర్తించగా ఆమె నాసికువరకు పరిమితం చేయబడింది. 1773 లో క్షయవ్యాధి కారణంగా మాధవరావు మరణించే వరకు గోపికాబాయి నాసికు వద్ద ఉండి, సనాతన హిందూ ఆచారాలు ఆచరించింది. మాధవరావు వారసుడు లేకుండా మరణించడంతో రఘునాథరావు ఆనందీబాయి పట్టుబట్టడంతో పేష్వా పరిపాలన మీద నియంత్రణ కావాలని మరలా ప్రతిపాదించాడు.

పునాకు తిరిగి చేరుకోవడం మార్చు

గోపికాబాయి మూడవ కుమారుడు నారాయణరావు పేష్వాగా నియమితుడయ్యాడు. నారాయణరావు నియామకం తరువాత గోపికాబాయి పూణేకు తిరిగి వచ్చి పరిపాలనలో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో గోపికాబాయి మతపరమైన ఆచారాలలో ఎక్కువగా పాల్గొన్నది. బ్రాహ్మణ జీవన విధానం దాని అత్యున్నత దశలో ఉన్న యుగంలో ఇది జరిగింది. మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి భారీ ద్రవ్య నిధులు ఇవ్వబడ్డాయి. అర్చక తరగతి ఒక ముఖ్యమైన పరిపాలనా పదవిని ఆక్రమించింది.

నారాయణరావు పరిపాలన అప్పులతో స్తంభించిపోయింది. ముఖ్యంగా రఘునాథరావు, ఆనందీబాయి నుండి అతని మీద వ్యతిరేకత పెరిగింది. ఈ సంఘటన గోపికాబాయికి మరో ఎదురుదెబ్బ, ఆమె మళ్ళీ ఏడాదిన్నర ముందు సంపాదించిన నియంత్రణను కోల్పోయింది. నాసికుకు తిరిగి రావలసి వచ్చింది.

సన్యాసిగా జీవితం మార్చు

ఆమె సనాతన పెంపకం కారణంగా గోపికాబాయి తన జీవితాంతం పవిత్ర బిచ్చగత్తెగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఆమె పొడి కొబ్బరి చిప్పను యాచించే గిన్నెగా తీసుకువెళ్ళి, పవిత్ర నగరమైన నాసికుకు పదవీ విరమణ చేసిన సర్దార్ల వాడల వెలుపల వేడుకుంటుంది. ఆమె సేవకుల నుండి భిక్ష సేకరించదు. కానీ తల్లులు, భార్యలు లేదా ఉన్నత స్థాయి సర్దార్ల కుమార్తెల నుండి మాత్రమే నైవేద్యాలను సేకరిస్తుంది.

గోపికాబాయి మొదటి కుమారుడు విశ్వసరావు ప్రేమికురాలు రాధికాబాయి కుంభమేళా సందర్భంగా నాసికు వద్దకు తీర్థయాత్రకు వచ్చింది. ఆమె తండ్రి సర్దారు గుప్తేతో కలిసి ఉన్నది. ఒకసారి గోపికబాయి తెలియకుండానే వారి నివాసం వెలుపల భిక్షం చేయమని వేడుకున్నది. అక్కడ ఆమె సమర్పణతో బయటకు వచ్చిన రాధికాబాయిని కలుసుకుంది. ఆమె చెడ్డ శకునమని, గోపికాబాయి అనారోగ్యానికి ప్రధాన కారణం అని గోపికాబాయి ఆరోపించింది.

మరణం మార్చు

గోపికాబాయి మిగిలిన నెలలో ఉపవాసం ఉన్నది. ఆమె రాధికాబాయిని కలిసింది. 1778 ఆగస్టు 11 న నిర్జలీకరణానికి గురైంది. రాధికాబాయి తన చివరి కర్మలు చేసి నాసికు లోని గోదావరి నది ఒడ్డున డీప్మాలా (లైట్ టవర్) ను నిర్మించారు. 1961 నాటి వరద సమయంలో ఈ డీప్మాలా కొట్టుకుపోయింది. ప్రజలు తమ బంధువుల కోసం చివరి కర్మలు చేసేటప్పుడు చమురు దీపం ఉంచే పునాది మాత్రమే మిగిలిపోయింది.

మూలాలు మార్చు

  1. Patil, Vishwas. Sambhaji.