చాళుక్యులు

ప్రాచీన భారత దేశానికీ సంబందించిన ఒక రాజ్యవంశము

చాళుక్యులు సా.శ. 6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6 వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12 వ శతాబ్దం దాకా పరిపాలించారు.


గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల పరిపాలన ఒక మైలురాయి వంటిది. కర్ణాటక చరిత్రలో స్వర్ణయుగం వంటిది. దక్షిణ భారతదేశంలో రాజకీయ వాతావరణం చిన్న చిన్న రాజ్యాల నుంచి పెద్ద సామ్రాజ్యాల స్థాపనకు బాదామి చాళుక్యుల ప్రాబల్యంతోనే ప్రారంభమైంది. దక్షిణ భారతదేశం కేంద్రంగా ఏర్పడ్డ రాజ్యం కావేరి, నర్మద నదుల మధ్య ప్రాంతాన్నంతటినీ ఏకీకృతం చేసి తన పాలనలోకి తెచ్చుకుంది. ఈ సామ్రాజ్యం ప్రాబల్యంతో మెరుగైన పరిపాలన, విదేశీ వాణిజ్యం, చాళుక్యుల వాస్తు నిర్మాణశైలి లాంటివి పురుడు పోసుకున్నాయి. 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు కన్నడ సాహిత్యాన్ని ప్రోత్సహించగా, పశ్చిమ చాళుక్యులు కూడా జైన, వీర శైవసాంప్రదాయాలలో అదే ప్రోత్సాహాన్ని కొనసాగించారు. 11వ శతాబ్దంలో తూర్పు చాళ్యుకులు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించారు.

వంశ మూలాలు మార్చు

కర్ణాటక స్థానికులు మార్చు

 
సా.శ 578 సంవత్సరంలో మూడవ బాదామి గుహాలయంలో చాళుక్య రాజు మంగలేశుడు వేయించిన పురాతన కన్నడ శాసనం
 
పట్టదకల్, విరూపాక్ష ఆలయంలో విజయ స్తంభంమీద చెక్కిన పురాతన కన్నడ శాసనం, సా.శ. 733–745

తొలి చాళుక్యులు ఎక్కడి వారు అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా ప్రసిద్ధ చరిత్రకారులైన జాన్ కే, డి. సి. సర్కార్, హంస రాజ్, ఎస్. సేన్, కామత్, కె. వి. రమేష్, కర్మాకర్ మొదలైన చరిత్ర కారులందరూ కలిసి బాదామి చాళుక్య సామ్రాజ్య స్థాపకులు కర్ణాటక స్థానికులే అని ఏకాభిప్రాయానికి వచ్చారు.[1][2][3][4][5][6][7][8][9][10][11] సా.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. చాళుక్యులు ఆంధ్ర ఇక్ష్వాకుల వారసులు అని దుర్గాప్రసాద్, అడ్లూరి ఒక వాదన తీసుకువచ్చారు.[12][13] అయితే కామత్ ప్రకారం ఈ వాదన రెండు వంశాల మధ్య తేడాలను వివరలించలేకపోయింది. కండచిలికి భూస్వాములు తమను హిరణ్యకగోత్రానికి చెందిన వశిష్టిపుత్రులు అని చెప్పుకున్నారు. చాళుక్యులు మాత్రం తమ శాసనాలలో తాము మానవ్యస గోత్రానికి చెందిన హరితిపుత్రులము అని చెప్పుకున్నారు. ఇది వారి పూర్వ ప్రభువులు, బనవాసి ప్రాంతాన్ని పరిపాలించిన కదంబ రాజవంశంతో సరిపోయింది. అలా వీరు కదంబ వంశానికి వారసులు అవుతారు. కదంబులనుంచే రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.[14]

తూర్పు చాళుక్యుల తర్వాతి శాసనాలు ఉత్తరదేశ వలస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి. అందులో అయోధ్య నుంచి ఒక పాలకుడు దక్షిణం వైపు వచ్చి పల్లవులను ఓడించి పల్లవ యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు కలిగిన విజయాదిత్య అనే సంతానం ఒకటవ పులకేశి తండ్రి అని పేర్కొన్నారు. అయితే, చరిత్రకారులు K. V. రమేష్, చోప్రా, శాస్త్రి ప్రకారం, జయసింహ మొదటి పులకేశి తాత, ఇంకా రణరాగ అతని తండ్రి అని నిర్ధారించే బాదామి చాళుక్య శాసనాలు ఉన్నాయని పేర్కొన్నారు.[15][16][17][18] కామత్, మోరేస్ 11వ శతాబ్దంలో దక్షిణ భారత రాజకుటుంబ వంశాన్ని ఉత్తర రాజ్యానికి అనుసంధానించడం ఒక ప్రసిద్ధ పద్ధతి అని పేర్కొన్నారు. బాదామి చాళుక్యుల రికార్డులు అయోధ్య మూలానికి సంబంధించిన మూలాలేమీ లేవు.[19][20]

చాలామంది చరిత్రకారులు ఉత్తర భారత వలస సిద్ధాంతాన్ని కొట్టివేసినప్పటికీ శాసనాల నిపుణుడైన కె. వి. రమేష్ అంతకు పూర్వం దక్షిణ భారత వలసకు అవకాశం ఉందనీ, దాన్ని నిశితంగా పరిశీలించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.[21] అతని ప్రకారం, అయోధ్యతో వారి కుటుంబ సంబంధాల గురించి ఎటువంటి శాసనపరమైన ప్రస్తావన పూర్తిగా లేకపోవడం, ఇంకా కన్నడిగులుగా గుర్తింపు పొందడం, వారు పూర్వం ప్రస్తుత కర్ణాటక ప్రాంతానికి వలస వచ్చి అధిపతులుగా, రాజులుగా విజయం సాధించడం వల్ల కావచ్చు. అందువల్ల, కన్నడ మాట్లాడే ప్రాంతానికి చెందిన తమను తాము స్థానికులుగా భావించే సామ్రాజ్య రాజులకు వారి పూర్వీకుల మూలానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు.[11]

చరిత్రకారులు జాన్ హౌబెన్, కామత్, శాసనాల అధ్యయ నిపుణుడైన డి.సి. సిర్కార్ బాదామి చాళుక్య శాసనాలు కన్నడ, సంస్కృతంలో ఉన్నాయని గమనించారు.[22][23][24] చరిత్రకారుడు N. L. రావు ప్రకారం, వారి శాసనాలు వారిని కర్ణాటులు అని పేర్కొన్నాయి. వారి పేర్లు ప్రియగాల్లం మరియు నోడుత్తగెల్వోం వంటి దేశీయ కన్నడ బిరుదులను కలిగి ఉన్నాయి. కొంతమంది చాళుక్య రాకుమారుల పేర్లు అరస (అంటే రాజు అని అర్థం) స్వచ్ఛమైన కన్నడ పదంతో ముగుస్తాయి.[25][26] రాష్ట్రకూట శాసనాలు బాదామి చాళుక్యులను కర్ణాటకబల అని పిలిచాయి.[27] చరిత్రకారుడు S. C. నందినాథ్ చే "చాళుక్య" అనే పదం సల్కీ లేదా చాల్కీ నుండి ఉద్భవించిందని ప్రతిపాదించారు. ఇది కన్నడంలో ఒక వ్యవసాయ పనిముట్టు పేరు.[28][29][30] కొంతమంది చరిత్రకారుల ప్రకారం, చాళుక్యులు వ్యవసాయదారుల నుండి ఉద్భవించారు.[30][28]

చారిత్రక ఆధారాలు మార్చు

సంస్కృత, కన్నడ భాషలలోని శాసనాలు బాదామి చాళుక్యుల చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు. మంగళేశ (578) బాదామి గుహ శాసనాలు, కప్పే ఆరభట్ట శాసనాలు(700), రెండవ పులకేశి వేయించిన పెద్దవడుగూరు శాసనం, కంచి కైలాసనాథ ఆలయ శాసనం, రెండవ విక్రమాదిత్యుడికి చెందిన పట్టదకల్ విరూపాక్ష దేవాలయ శాసనం (అన్నీ కన్నడ భాషలో) చాళుక్యుల మరిన్ని ఆధారాలను అందిస్తున్నాయి.[31][32] ఒకటో పులకేశి (543) బాదామి కొండ శాసనం, మంగళేశ మహాకూట స్తంభ శాసనం (595), రెండవ పులకేశి (634) యొక్క ఐహోళే శాసనం పాత కన్నడ లిపిలో వ్రాయబడిన ముఖ్యమైన సంస్కృత శాసనాలకు ఉదాహరణలు.[33][34][35] చాళుక్యుల పాలనలో తమిళకం (తమిళ దేశం) అని పిలవబడే భారతీయ ద్వీపకల్పంలోని ప్రాంతాలలో సంస్కృతంతో పాటు శాసనాల యొక్క ప్రధాన భాషగా కన్నడ రాకను చూసింది.[36] కన్నడ ఇతిహాసాలతో కూడిన బాదామి చాళుక్యుల అనేక నాణేలు కనుగొన్నారు. ఈ కాలంలో కన్నడ భాష అభివృద్ధి చెందిందని ఇవన్నీ సూచిస్తున్నాయి.[37]

ఆ కాలంలో విదేశీ యాత్రికుల ప్రయాణ కథనాలు చాళుక్యుల సామ్రాజ్యం గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాయి. చైనా యాత్రికుడు హువాన్ జాంగ్ రెండవ పులకేశి ఆస్థానాన్ని సందర్శించాడు. ఈ సందర్శన సమయంలో, ఐహోళె శాసనంలో పేర్కొన్నట్లుగా, రెండవ పులకేశి తన సామ్రాజ్యాన్ని మూడు మహారాష్ట్రకాలుగా లేదా 99,000 గ్రామాలతో కూడిన గొప్ప ప్రావిన్సులుగా విభజించాడు. ఈ సామ్రాజ్యం బహుశా ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్ర, కొంకణి తీరాలలో విస్తరించి ఉండవచ్చు.[38][39] హువాన్‌జాంగ్, ఈ సామ్రాజ్యం పరిపాలన ఆకర్షించింది. రాజు సమర్థవంతమైన పరిపాలన, ప్రయోజనాలు చాలా దూరం విస్తరించి ఉన్నాయని గమనించాడు. తరువాత, పర్షియన్ చక్రవర్తి ఖుస్రో రెండవ పులకేశి రాయబారులను మార్చుకున్నాడు.

పురాణ గాథలు మార్చు

పశ్చిమ చాళుక్యుల ఆస్థాన కవులు ఈ విధంగా రాశారు.

ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ సంధ్యావందనం చేస్తుండగా దేవతల రాజు ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చి భూమి మీద పెరిగిపోతున్న ఆగడాలను అరికట్టడానికి వెంటనే ఒక పరాక్రమశాలిని పుట్టించమని అడిగాడు. బ్రహ్మ ఆ అభ్యర్థనను మన్నించి తన చేతుల్లో ఉన్న చుళుక జలం వైపు తదేకంగా చూడగా అందులోనుంచి చాళుక్యులకు మూల పురుషుడైన ఒక మహావీరుడు ఉద్భవించాడు.[40] ఈయనను సప్తమాతృకలు పెంచి పెద్దచేశారు. చాళుక్యులు శివుడు, విష్ణువు, చాముండి, సూర్యుడు, కుబేరుడు, వినాయకుడు, కుమార స్వామి లాంటి పలువు దేవతలను ఆరాధించారు.

కొంతమంది పండితులు వీరిని గుజరాత్ ప్రాంతానికి చెందిన చౌళుక్యులతో (సోలంకి) అనుసంధానించారు. పృథ్వీరాజ్ రాసో గ్రంథంలోని పురాణ గాథలలో ఈ చౌళుక్యులు అబు పర్వతం మీద ఉన్న అగ్నికుండం నుంచి జన్మించారు. కానీ తర్వాత బికనీర్ కోటలో దొరికిన పృథ్వీరాజ్ అసలైన గ్రంథాలలో ఈ అగ్నికులం గురించి ప్రస్తావన లేదు.[41]

నాలుగవ విక్రమాదిత్యుడికి చెందిన నీలగుండ శాసనం (11వ శతాబ్దం లేదా దాని తర్వాత) ప్రకారం చాళుక్యులు అయోధ్య నుంచి వలస వచ్చారు. అయోధ్యను 59 మంది రాజులు పరిపాలించారు. తర్వాత ఈ వంశానికి చెందిన 16 మంది రాజులు దక్షిణాపథానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఇదే విషయాన్ని విక్రమాదిత్యుని ఆస్థాన కవి బిల్హహణుడు కూడా తన రచనల్లో ప్రస్తావించాడు. ఇతను ఈ వంశానికి మూలపురుషుడైన చాళుక్యుడు బ్రహ్మ చేతుల మధ్య ఖాళీ ప్రదేశం నుంచి ఉద్భవించాడని పేర్కొన్నాడు.[42][43] కొన్ని వంశవృక్షాల ప్రకారం వీరి మూలాలు అయోధ్యలో ఉన్నాయి. వీరు సూర్యవంశానికి చెందిన వారు.[44][45][46] లూయిస్ వాదన ప్రకారం చాళుక్యులు ఇరాక్ కి చెందిన సెల్యూకియా తెగకు చెందినవారు. పల్లవులతో వీరి యుద్ధాలు పల్లవుల పూర్వీకులైన పార్థియన్లకు, సెల్యూకియన్ల పూర్వీకులకు మధ్య జరిగిన పూర్వపు యుద్ధాలకు కొనసాగింపు అని పేర్కొన్నాడు. కానీ కామత్ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఎందుకంటే ఇది కేవలం ఒకే రకంగా ధ్వనించే పేర్లను కలగలిపి వంశవృక్షాలను తయారు చేసిందని అభిప్రాయపడ్డాడు.[47]

చాళుక్యుల చారిత్రక యుగాలు మార్చు

చాళుక్యులు సుమారు 600 సంవత్సరాలపాటు దక్కను పీఠభూమి ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ కాలంలో వీరు సన్నిహిత సంబంధాలు కలిగిన మూడు రాజవంశాలుగా పరిపాలన చేశారు. అవి బాదామి చాళుక్యులు లేదా పూర్వ చాళుక్యులు. వీరు సా.శ 6 నుంచి 8వ శతాబ్దం మధ్యలో పరిపాలించారు. తర్వాత పాలించిన రెండు సోదర రాజవంశాలు. ఒకటి కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు లేదా తర్వాతి చాళుక్యులు. రెండవ వంశం వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు.[48]

బాదామి చాళుక్యులు మార్చు

6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశానికి చెందిన గుప్త వంశం, వారి వారసులు క్షీణించిన తర్వాత వింధ్య పర్వతాలకు దక్షిణంగా దక్కన్ ప్రాంతంలోనూ, ప్రాచీన తమిళ రాజ్యంలో (తమిళకం) కొన్ని మార్పులు సంభవించాయి. చిన్న చిన్న రాజ్యాల నుంచి పెద్ద సామ్రాజ్యాల ఏర్పాటుకు బాటలు ఏర్పడ్డాయి.[49] సా.శ 543 లో ఒకటవ పులకేశి ఈ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[50][51][52] ఇతను వాతాపిని (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం, భాగల్ కోట జిల్లాకు చెందిన బాదామి) తన స్వాధీనంలోని తీసుకుని రాజధానిగా చేసుకున్నాడు. అలా ఒకటవ పులకేశి అతని వారసులు బాదామి చాళుక్యులు అని పిలవబడ్డారు. వీరి సామ్రాజ్యంలో కర్ణాటక రాష్ట్రం, దక్కన్ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ లో చాలా భాగం ఉన్నాయి.

ఎరేయా అనే పూర్వ నామం కలిగిన[53] రెండవ పులకేశి దక్కన్ ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. బాదామి చాళుక్యుల వంశంలో అందరికన్నా ఎక్కువ ప్రఖ్యాతి గాంచిన పాలకుడు ఇతనే.[54][55] భారతదేశ చరిత్రలో కూడా పేరు గాంచిన రాజు ఇతను.[56][57][58] ఆయన అలుపా రాజవంశం (దక్షిణ కెనరా), తలకాడుకు చెందిన పశ్చిమ గంగా రాజవంశం యువరాణులను వివాహం చేసుకుని వారితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించాడు.[59][60] రెండవ పులకేశి చాళుక్య సామ్రాజ్యాన్ని పల్లవ రాజ్యం ఉత్తర భాగాల వరకు విస్తరించాడు. హర్షవర్ధనుడు దక్షిణ దిశగా సాగిస్తున్న జైత్రయాత్రను నర్మదా నది ఒడ్డున అడ్డుకున్నాడు. ఆ తరువాత ఆగ్నేయ దక్కనులో విష్ణుకుండినులను ఓడించాడు.[61][62][63][64] పల్లవ నరసింహవర్మన 642 లో బాదామి మీద దాడి చేసి తాత్కాలికంగా ఆక్రమించి ఈ విజయాన్ని తిప్పికొట్టారు. ఈ పోరాటంలో రెండవ పులకేశి మరణించాడని భావిస్తున్నారు.[65][66]

రెండవ పులకేశి మరణించిన తరువాత పదమూడు సంవత్సరాల కాలానికి బాదామిని పల్లవులు ఆక్రమించిన సమయంలో అంతర్గత వైరుధ్యాల కారణంగా బాదామి చాళుక్య రాజవంశం పదమూడు సంవత్సరాల పాటు క్షీణదశను అనుభవించింది.[67][68] తర్వాత వచ్చిన ఒకటో విక్రమాదిత్యుడు పల్లవులను బాదామి నుండి తరిమివేసి, సామ్రాజ్యక్రమాన్ని పునరుద్ధరించాడు. ఈ విజయానికి చిహ్నంగా అతనికి "రాజమల్ల" ​​అనే బిరుదును అందుకున్నాడు.[69] విక్రమాదిత్యుని మనవడమైన విజయాదిత్యుడు (696–733) 37 సంవత్సరాల సుసంపన్నమైనది పాలన చేసాడు. ఆయన పాలనలో ప్రసిద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి.[70][71]

విజయాదిత్యుని కొడుకు రెండవ విక్రమాదిత్యుడి (733–744) పాలనలో ఈ సామ్రాజ్యం తిరిగి శిఖరాగ్రం చేరుకుంది. ఆయన తొండైమండలం భూభాగం మీద పదేపదే దండయాత్రలు చేసి పల్లవ రెండవ నందివర్మ మీద సాధించిన విజయాలకు, ప్రజల పట్ల ఆయన చూపిన దయాదాక్షిణ్యాలకు, పల్లవ రాజధాని కాంచిపురం స్మారక చిహ్నాలు నిర్మించినందుకు కూడా పేరుగాంచాడు.[70][72][73] ఈ విధంగా ఆయన పల్లవులు గతంలో చాళుక్యులను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. కైలాసనాథ ఆలయంలో విజయ స్తంభం మీద కన్నడ శాసనాన్ని చెక్కాడు.[72][74][75] ఆయన పాలనలో దక్షిణ గుజరాతు మీద అరబు చొరబాటుదారుడు ఉమయ్యదు కాలిఫేటు దాడి చేశాడు. చాళుక్య పాలనలో ఉన్న నవ్సరీ చాళుక్య గవర్నరు పులకేసి అరబ్బులను ఓడించి తరిమికొట్టాడు.[76] తరువాత ఆయన కలాభ్రా పాలకుడిని లొంగదీసుకోవడంతో పాటు తమిళ దేశంలోని ఇతర సాంప్రదాయ రాజ్యాలైన, పాండ్యులు, చోళులు, చేరులను అధిగమించాడు.[77] చివరి చాళుక్య రాజు రెండవ కీర్తివర్మను 753 లో రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు పడగొట్టాడు.[78] వారి శిఖరాగ్రస్థాయిలో చాళుక్యులు దక్షిణాన కావేరి నుండి ఉత్తరాన నర్మదా వరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు.

కల్యాణి చాళుక్యులు మార్చు

దక్కను ప్రాంతం చాలావరకు రాష్ట్రకూటుల పాలనలో 200 సంవత్సరాల నిద్రాణస్థితిలో ఉన్న తరువాత 973 లో చాళుక్యులు తమ అధికారాన్ని పునరుద్ధరించారు. ఈ చాళుక్యుల వంశవృక్షం ఇప్పటికీ చర్చనీయాంశమైంది. ఒక సిద్ధాంతం ప్రకారం పశ్చిమ చాళుక్యుల కాలానికి సంబంధించిన సాహిత్య, శాసనాత్మక ఆధారాలు, బాదామి చాళుక్యులు సాధారణంగా ఉపయోగించే బిరుదునామాలను వీరు కూడా ఉపయోగించడాన్ని బట్టి వీరు 6వ శతాబ్దపు ప్రసిద్ధ బాదామి చాళుక్య రాజవంశానికి చెందినవారేనని తెలుస్తున్నది.[79][80] మరోవైపు ఇతర పశ్చిమ చాళుక్య శిలాశాసనాలు, వీరు పూర్వ చాళుక్యులతో సంబంధం లేని ఒక ప్రత్యేకమైన వంశావళి అని సూచిస్తున్నాయి.[81]

తార్దావడికి (బీజాపూరు జిల్లా) చెందిన, రాష్ట్రకూటుల పరిపాలనలో భూస్వామి అయిన రెండవ తైలపుడు (సా.శ 1000), రాష్ట్రకూట చక్రవర్తి అయిన రెండవ కర్కుడిని ఓడించి పశ్చిమ దక్కనులో చాళుక్య పాలనను తిరిగి స్థాపించాడు.[82][83] పశ్చిమ చాళుక్యులు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. వీరు చోళులు, ఇంకా వారి బంధువులైన వేంగి చాళుక్యులతో నిరంతరం సంఘర్షణలు కొనసాగించారు. ఈ రాజవంశంలో ఆరవ విక్రమాదిత్యుడు అత్యంత ప్రసిద్ధ పాలకుడిగా పరిగణించబడ్డాడు.[84][85] 50 సంవత్సరాల పాటు కొనసాగిన తన పాలన ప్రారంభంలోనే శక యుగాన్ని రద్దు చేసి విక్రమయుగాన్ని స్థాపించాడు. ఈ కొత్త యుగంలో అనేక చాళుక్య శాసనాలు ఉన్నాయి.[86][87] ఆరవ విక్రమాదిత్యడు ఉన్నతాశయాలు, నైపుణ్యం కలిగిన సైనిక నాయకుడు. ఆయన నాయకత్వంలో పాశ్చాత్య చాళుక్యులు వేంగి (ఆంధ్ర తీర ప్రాంతం) మీద చోళుల ప్రభావాన్ని అంతం చేసి దక్కనులో ఆధిపత్య శక్తిగా మారారు.[88][89] కన్నడ సాహిత్యం, సంస్కృత సాహిత్యం అభివృద్ధిలో పాశ్చాత్య చాళుక్య కాలం ఒక ముఖ్యమైన యుగంగా గుర్తించబడింది.[90][91] 12 వ శతాబ్దం చివరలో హొయసల సామ్రాజ్యం, పాండ్యులు, కాకతీయ, దేవగిరి సీనా యాదవుల రాకతో వారు తమ క్షీణదశకు చేరుకున్నారు.[92]

వేంగీ చాళుక్యులు మార్చు

సా.శ. 616 లో రెండవ పులకేశి ఆధునిక ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో అక్కడక్కడా ఉనికిలో ఉన్న విష్ణుకుండినుల అధికారాన్ని అణిచివేసి, తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని సా.శ 621 లో రాజప్రతినిధిగా నియమించాడు.[93][94] అందువలన తూర్పు చాళుక్యులు కన్నడ రాజవంశానికి చెందినవారు.[95] రెండవ పులకేశి మరణం తరువాత, వేంగి ప్రతినిధిత్వ స్థాయి నుండి స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెంది తన రాజ్యపరిధిలో నెల్లూరు, విశాఖపట్నం మధ్య ప్రాంతాన్ని విలీనం చేసుకుంది.[94][96]

8 వ శతాబ్దం మధ్యలో బాదామి చాళుక్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత, పశ్చిమ దక్కను కొత్త పాలకులైన రాష్ట్రకూటాలు, తూర్పు చాళుక్యుల మధ్య ప్రాదేశిక వివాదాలు చెలరేగాయి. తరువాతి రెండు శతాబ్దాలలో తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులై ఉన్నారు.[97] రెండవ విజయాదిత్యుడు (c.808–847) సాధించిన అరుదైన సైనిక విజయం కాకుండా, మొదటి భీముడు (c.892–921) పాలనలో మాత్రమే ఈ చాళుక్యులు స్వతంత్ర్య రాజ్యంగా ఆధిపత్యం నిలుపుకున్నారు. మొదటి బీమా మరణం తరువాత రాష్ట్రకూటులు ఆంధ్ర ప్రాంతంలో వేంగి వ్యవహారాలలో వరుస వివాదాలు, జోక్యం చేసుకున్నారు.[97]

1000 లో తూర్పు చాళుక్యుల అదృష్టం మలుపు తిరిగింది. వారి రాజు అయిన దనార్ణవుడుని సా.శ 973 లో తెలుగు చోడ రాజైన భీముడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత చోడ భీముడు 27 సంవత్సరాలు ఈ ప్రాంతంలో తన పాలన సాగించాడు. ఈ సమయంలో దనార్ణవుని ఇద్దరు కుమారులు చోళ రాజ్యంలో ఆశ్రయం పొందారు. చోడ భీముడు చోళ భూభాగమైన తొండైమండలం మీద దాడి చేయడం, యుద్ధరంగంలో మరణించడం చోళ-చాళుక్య సంబంధాలలో కొత్త శకానికి తెరతీసింది. దనార్ణవుని పెద్ద కుమారుడు మొదటి శక్తివర్మను చోళరాజైన మొదటి రాజరాజ చోళుడి నియంత్రణలో వేంగిరాజ్యానికి రాజుగా నియమించారు.[98] చోళులు, తీరప్రాంత ఆంధ్ర రాజ్యం మధ్య ఈ కొత్త సంబంధం పశ్చిమ చాళుక్యులకు ఆమోదయోగ్యం కాలేదు. వారు అప్పటికే పశ్చిమ దక్కనులో రాష్ట్రకూటులను ఓడించి ప్రధాన శక్తిగా ఎదిగారు. వారు వేంగి ప్రాంతంలో పెరుగుతున్న చోళ ప్రభావాన్ని తగ్గించడానికి విఫల ప్రయత్నం చేసారు.[97][99] ప్రారంభంలో తూర్పు చాళుక్యులు కన్నడ భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించారు. అయినప్పటికీ కొంతకాలం తర్వాత స్థానిక అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తరువాత వారు తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇచ్చాయి.[100][101] తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించారు.[102]

ముదిగొండ చాళుక్యులు మార్చు

పూర్వ మధ్య యుగమున తెలుగు దేశములో వేంగీ చాళుక్యుల పక్షము వహించి, రాష్ట్రకూటులనెదిర్చి, కాకతీయులను కూడా ప్రతిఘటించిన రాజవంశము ముదిగొండ చాళుక్యులు. ఖమ్మం ప్రాంతములోని ముదిగొండ వీరి రాజధాని. కొరివి, బొట్టు కూడా అప్పుడప్పుడు రాజధానులు. ఈ రాజ్యము ఎనిమిదవ శతాబ్దిలో ప్రారంభమై పన్నెండవ శతాబ్దిలో అంతమయినది. వీరు మానవ్యస గోత్రులు, హారితీ పుత్రులు, వరాహ లాంఛనధారులు. వీరు శాసనములలో అయోధ్య నుండి వచ్చినవారుగా చెప్పుకున్నారు. వీరిలో ముఖ్యులు మూడవ కుసుమాయుధుడు, బొట్టు బేతరాజు, కుసుమాదిత్యుడు.

వేములవాడ చాళుక్యులు మార్చు

ఇప్పటి కరీంనగరు జిల్లాలోని వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్య రాజవంశమును వేములవాడ చాళుక్యులందురు. తొలుత వీరు ఇందూరు (నిజామాబాద్) ప్రాంతములోని పోదనపురము (బోధన్) నుండి పాలించెడివారు. సాతవాహన సామ్రాజ్యములో అశ్మక రాష్ట్రమునకు ఇది రాజధాని. ఈ ప్రాంతమును సపాదలక్ష, సబ్బినాడు, పోదననాడు అని కూడా అంటారు. సాతవాహనుల తరువాత నాలుగు శతాబ్దముల చరిత్ర తెలియడం లేదు.

రాష్ట్రకూట రాజగు దంతిదుర్గ పోదననాడులో సామంతునిగా వినయాదిత్య యుద్ధమల్లుని (క్రీ. శ. 750-780) నియమించాడు. ఈతడు దంతిదుర్గ దండయాత్రలలో విజయములు సాధించి రాజు మన్ననలు పొందాడు. బాదామి చాళుక్యుల అధికారము కూలద్రోయుటలో యుద్ధమల్లుడు మిక్కిలి తోడ్పడ్డాడు. యుద్ధమల్లుని కుమారుడు మొదటి అరికేసరి (క్రీ. శ. 780-800). ఈతడు గొప్ప విద్వాంసుడు, గజతంత్రము, ధనుర్విద్య, ఆయుర్వేదము మున్నగు విద్యలు నేర్చినవాడు. సమస్తలోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరామాది బిరుదులు గలవాడు. ఇతని కొడుకు రెండవ యుద్ధమల్లుడు. ఇతని గురించి విశేషములు తెలియరాలేదు. రెండవ యుద్ధమల్లుని కుమారుడు బద్దెగ మహావీరుడు. రాష్ట్రకూటులకు సాయముగా బద్దెగ, కాకర్త్య గుండన వేంగి పై దాడి చేశారు. బద్దెగ మనుమడు ఇమ్మడి అరికేసరి ఈ వంశములో అందరికంటే గొప్పవాడు. రాష్టకూటులతొ సంబంధములు నెరపి వేంగి, మాన్యఖేటము, కొరవి లలో తన ప్రాబల్యము పెంపు చేశాడు. పసిద్ధ కన్నడ కవి పంప అరికేసరి ఆస్థానములో ఉండి విక్రమార్జునవిజయము అనబడు తొలి కన్నడ కావ్యము రచించాడు. ఇతడు కమ్మనాడుకు చెందిన వాడు.

వాస్తుకళ మార్చు

 
సా.శ 740 సంవత్సరంలో పట్టదకల్ లో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన విరూపాక్ష దేవాలయం

దక్షిణ భారత శిల్పకళా అభివృద్ధి చెందడంలో బాదామి చాళుక్యులది చాలా ముఖ్యమైన పాత్ర. ఉమాపతి వరలబ్ధులు అని పిలవబడే ఈ వంశ రాజులు అనేక శివాలయాలు నిర్మించారు.[103] వీళ్ళు తమ నిర్మాణ శైలిని చాళుక్య వాస్తుశైలి, కర్ణాట ద్రవిడ శైలి అని పిలిచారు. వీరు ప్రస్తుతం ఉత్తర కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా లో సుమారు వందకి పైగా నిర్మాణాలు, గుహాలయాలు నిర్మించారు. ప్రాంతీయంగా దొరికే ఎర్రటి ఇసుకరాయిని (శాండ్ స్టోన్) ఈ నిర్మాణాలలో వాడారు. ఈ గుహాలయాలు ప్రాథమికంగా పెద్ద పెద్ద రాళ్ళను మలచి ఏర్పాటు చేసినవి. వాటిని మామూలు ఆలయాల వలే నిర్మాణం చేయలేదు. దానికి బదులుగా కొండలో కొంతభాగాన్ని తొలగించడమనే ప్రత్యేక సాంకేతికత ద్వారా సృష్టించబడ్డాయి. ఇవి ప్రాథమికంగా శిల్పకళాపరమైనవి.[104] చాళ్యుకులు విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ, చాళుక్యుల నిర్మాణకేంద్రాలు, ఆలయ నిర్మాణ కార్యకలాపాలను చాలావరకు చాళుక్యుల హృదయ భూభాగంలోని చిన్న ప్రాంతంలో - ఆధునిక కర్ణాటక రాష్ట్రంలోని ఐహోళె, బాదామి, పట్టదకల్, ఇంకా మహాకూటలో కేంద్రీకరించాయి.[105]

వారి ఆలయ నిర్మాణ కార్యకలాపాలను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ప్రారంభ దశ 6వ శతాబ్దం చివరి త్రైమాసికంలో ప్రారంభమైంది. ఈ దశలో అనేక గుహాలయాలు ఏర్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ఐహోళెలోని మూడు ప్రాథమిక గుహాలయాలు (ఒక వైదిక, ఒక జైన మరియు ఒక అసంపూర్ణ బౌద్ధ ఆలయాలు). తరువాతవి బాదామిలోని నాలుగు అభివృద్ధి చెందిన గుహాలయాలు (వీటిలో మూడవ గుహలోని వైష్ణవ దేవాలయం, 578 CE నాటిది).[106] బాదామిలోని ఈ గుహాలయాలు ఒకే విధంగా ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కటి వెలుపలి భాగం సాదాగా ఉంటుంది. కానీ అనూహ్యంగా పూర్తి చేసిన లోపలి భాగంలో స్తంభాల వరండా, మంటపం, రాతిలోకి లోతుగా చెక్కిన, పూజలు అందుకునే దైవం వెలసిన గర్భగుడి ఉన్నాయి.[107] బాదామిలో మూడు గుహల దేవాలయాలు వైదికమైనవి, ఒకటి జైన దేవాలయం. వేద దేవాలయాలలో హరిహర, మహిషాసురమర్ధిని, వరాహ, నరసింహ, త్రివిక్రమ, అనంత శయనుడైన విష్ణువు మరియు నటరాజు చిత్రాలను బాగా చెక్కారు.[108]

వీరి రెండవ దశలో ఐహోళె, బాదామిలో నిర్మించారు. ఐహోళెలో దాదాపు డెబ్బై నిర్మాణాలు ఉన్నాయి. దీనిని "భారతీయ ఆలయ నిర్మాణాల పుట్టినిల్లు"[109] అని పిలుస్తారు. ఈ దేవాలయాల యొక్క ఖచ్చితమైన కాలం చర్చనీయాంశమైనప్పటికీ, ఈ నిర్మాణాలు సా.శ 600 సంవత్సరంలో ప్రారంభమైనట్లు ఏకాభిప్రాయం ఉంది.[110][111][112] ఇవి లాడ్ ఖాన్ దేవాలయం (కొందరు సి. 450 నాటిది అన్నారు కానీ ఎక్కువ మంది 620 నాటిది అన్నారు), ఇందులో గాలి ఆడేందుకు వీలుగా చిల్లులుగల రాతి కిటికీలు, నదీ దేవతల శిల్పాలు ఉన్నాయి; మరొకటి మెగుటి జైన దేవాలయం (634), దీని నిర్మాణ రూపకల్పనలో పురోగతిని చూపుతుంది; దుర్గా దేవాలయం గోపురం ఉత్తర భారత శైలి (8వ శతాబ్దం)లో ఉంది, ఇంకా బౌద్ధ చైత్య రూపకల్పనను బ్రాహ్మణశైలిలో మార్చే ప్రయోగాలు చేశారు. మొత్తంగా ఈ ఆలయ శైలి, ఉత్తర దక్షిణ భారత వాస్తురీతుల సంకలనం.[103] హుచ్చిమల్లి గుడిలో ఒక కొత్త ప్రవేశద్వారం, గర్భగుడిని హాలుకు కలుపుతుంది.[113] ఈ కాలానికి చెందిన ఇతర ద్రవిడ శైలి ఆలయాలు నాగరాల్‌లోని నాగనాథ ఆలయం; బానంటిగుడి ఆలయం, మహాకూటేశ్వర ఆలయం, మహాకూటలోని మల్లికార్జున ఆలయం; దిగువ శివాలయ ఆలయం, మాలెగిట్టి శివాలయ ఆలయం (ఎగువ), బాదామిలోని జంబులింగేశ్వర ఆలయం.[111] చాళుక్యుల నిర్మాణ కేంద్రానికి వెలుపల, బాదామికి ఆగ్నేయంగా 140 కి.మీ దూరంలో, ప్రారంభ చాళుక్యుల శైలికి సంబంధించిన నిర్మాణంతో 7వ శతాబ్దపు చివరి నాటి సండూరులోని అసాధారణమైన పార్వతి ఆలయం ఉంది. ఇది 48 అడుగుల పొడవు, 37 అడుగుల వెడల్పుతో మధ్యస్థ పరిమాణం ఉంటుంది. ఇది నగర అనబడే ఉత్తరభారత శైలి గోపురం, ద్రవిడ (దక్షిణ భారత) శైలి భాగాలను కలిగి ఉంది. దీనికి మంటపం లేదు. బారెల్ వాల్ట్ తో కప్పబడిన అంతరాలయాన్ని కలిగి ఉంది. ఆలయం యొక్క "అస్థిరమైన" పునాది నిర్మాణ పథకం 11వ శతాబ్దంలో చాలా తర్వాత ప్రజాదరణ పొందింది.

ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన, 8వ శతాబ్దంలో నిర్మించబడిన పట్టదకల్‌లోని నిర్మాణాత్మక దేవాలయాలు బాదామి చాళుక్యుల వాస్తుశిల్పం యొక్క పరాకాష్ట, పరిణతి చెందిన దశను సూచిస్తుంది. బాదామిలోని భూతనాథ దేవాలయాల సమూహం కూడా ఈ కాలం నాటివే. పట్టదకల్ వద్ద పది, దక్షిణ ద్రావిడ శైలిలో ఆరు మరియు ఉత్తర నాగర శైలిలో నాలుగు ఆలయాలు ఉన్నాయి. వీటిలో సంగమేశ్వర ఆలయం (725), విరూపాక్ష దేవాలయం (740–745) మరియు మల్లికార్జున ఆలయం (740–745) దక్షిణాది శైలిలో ప్రసిద్ధి చెందినవి. పాపనాథ దేవాలయం (680) మరియు గలగనాథ దేవాలయం (740) నగర - ద్రవిడ కలయిక శైలిలో ప్రారంభ ప్రయత్నాలు.[114] విరూపాక్ష మరియు మల్లికార్జున దేవాలయాలు కాంచీపురం పల్లవులపై సైనిక విజయం సాధించిన తరువాత రాజు రెండవ విక్రమాదిత్యుడు ఇద్దరు రాణులచే నియమించబడినట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి.[111] చాళుక్యుల వాస్తుశిల్పుల ప్రసిద్ధ పేర్లు రేవడి ఓవజ్జ, నరసోబ్బ మరియు అనివారిత గుండ.[115]

పశ్చిమ చాళుక్యుల పరిపాలనా కాలం దక్కన్ వాస్తునిర్మాణ శైలి అభివృద్ధికి ముఖ్యమైన కాలం. వీరి శైలి 8 వ శతాబ్దానికి చెందిన బాదామి చాళుక్యుల శైలికి, 13వ శతాబ్దంలో ప్రాచుర్య పొందిన హొయసల శైలికి మధ్య భావనాత్మక వారధిగా పనిచేసింది.[116][117] వారి సాంస్కృతిక, ఆలయ నిర్మాణ కార్యకలాపాలకు కేంద్రం ఆధునిక కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాంతంలో ఉంది. ఇందులో ప్రస్తుత ధార్వాడ్ జిల్లా, హవేరి, గదగ్ జిల్లాలు ఉన్నాయి.[118][119] ఇక్కడ, పెద్ద మధ్యయుగ కర్మాగారాలు అనేక స్మారక చిహ్నాలను నిర్మించాయి.[120] ఈ స్మారక చిహ్నాలు, ముందుగా ఉన్న ద్రావిడ ఆలయాల ప్రాంతీయ రూపాంతరాలు. ఇవి ప్రత్యేకమైన కర్ణాట ద్రవిడ సంప్రదాయాన్ని ఏర్పరచాయి.[121]

ఈ కాలం నాటి అనేక భవనాలలో చాలా ముఖ్యమైనవి కొప్పల్ జిల్లాలోని ఇటగిలోని మహాదేవ ఆలయం,[122][123] గదగ్ జిల్లాలోని లక్కుండి వద్ద కాశీవిశ్వేశ్వర ఆలయం,[124][125] దావణగెరె జిల్లాలో కురువట్టిలోని మల్లికార్జున ఆలయం,[125] బాగలి వద్ద ఉన్న కాళేశ్వర దేవాలయం.[126][127]ఇతర ముఖ్యమైన నిర్మాణాలు డంబల్ (గడగ్ జిల్లా)లోని దొడ్డబసప్ప దేవాలయం,[128][129] హవేరి (హవేరి జిల్లా),[130][131] వద్ద సిద్ధేశ్వర ఆలయం, ఇంకా అన్నిగేరి (ధార్వాడ్ జిల్లా) వద్ద ఉన్న అమృతేశ్వర ఆలయం.[132][133] తూర్పు చాళుక్యులు ఆధునిక తూర్పు ఆంధ్రప్రదేశ్‌లోని ఆలంపూర్‌లో కొన్ని చక్కని దేవాలయాలను నిర్మించారు.[106][134]

సాహిత్యం మార్చు

రెండవ పులకేశి (634) వేయించిన ఐహోళె శాసనంలో అతని ఆస్థాన పండితుడైన రవికీర్తి సంస్కృత భాషలో, కన్నడ లిపిలో రాయబడిన కవిత్వం ఒక శ్రేష్ఠమైన కవిత్వంగా గుర్తించబడుతుంది.[33][135] శ్యామ సరస్వతి అనే బిరుదు కలిగిన విజయనక అనే కవయిత్రి రాసిన కొంత కవిత్వం భద్రపరచబడిఉన్నాయి. ఈమె రెండవ పులకేశి కొడుకులలో ఒకడైన చంద్రాదిత్యుని పట్టపురాణి అయిఉండవచ్చు.[136] పశ్చిమ చాళుక్యుల కాలానికి చెందిన విజ్ఞానేశ్వర హిందూ న్యాయంపై మితాక్షర అనే గ్రంథరచయితగా ప్రసిద్ధి గాంచాడు. అదే కాలానికి చెందిన రాజు మూడవ సోమేశ్వరుడు, పేరొందిన పండితుడు. ఈయన అన్ని కళలు, విజ్ఞానశాస్త్రాలతో కూడిన మానసోల్లాస అనే విజ్ఞానసర్వస్వాన్ని రచించాడు.[137]

బాదామి చాళుక్యుల కాలం నుంచే పూర్వపు కన్నడ సాహిత్యం ఉన్నట్లు ప్రస్తావనలు ఉన్నాయి, కానీ అవి ఏవీ అందుబాటులో లేవు. శాసనాల్లో మాత్రం కన్నడ భాషను సహజ భాషగా వర్ణించారు. సుమారు 700 కి చెందిన కప్పె ఆరభట్ట రికార్డులో త్రిపది ఛందస్సులో ఉన్న కన్నడ కవిత్వం ఉంది. జయకీర్తి ప్రస్తావించిన కర్ణాటేశ్వర కథ రెండవ పులకేశిని ప్రస్తుతిస్తూ రాసిన రచన ఈ కాలానికి చెందినదే.

బాదామి చాళుక్యుల దేశం మార్చు

సైన్యం మార్చు

సువ్యవస్థితమైన చాళుక్య సైన్యం రెండవ పులకేశి వింద్యపర్వతాలను దాటి జైత్రయాత్ర సాగించేందుకు దోహదపడింది.[138] వీరి సైన్యంలో కాల్బలం, అశ్విక దళం, గజ సైన్యం, ఇంకా శక్తివంతమైనా నావికా దళం ఉండేది. చైనా యాత్రికుడు హువాన్ జాంగ్ చాళుక్య సైన్యంలో వందలకొద్దీ ఏనుగులు ఉండేవనీ, వాటిని యుద్ధరంగంలోకి తీసుకెళ్ళే ముందు మద్యం సేవింపజేసేవారనీ రాశాడు.[65][139] వీరి నావికాదళం సహాయంతోనే రేవతీ ద్వీపాన్ని (ప్రస్తుతం గోవా), తూర్పు తీరాన ఉన్న పూరీని జయించారు. రాష్ట్రకూటుల శాసనాలలో చాళుక్యుల సైన్య బలాన్ని కర్ణాటకబల అని వర్ణించేవారు.[140][141]

భూపరిపాలన మార్చు

చాళుక్యుల పరిపాలనా విధానం మగధ, శాతవాహన పరిపాలనా విధానాన్ని పోలి ఉంటుంది.[65] వీరి సామ్రాజ్యం మహారాష్ట్రకాలుగానూ, అందులో రాష్ట్రకాలుగానూ, విషయం (జిల్లా), భోగము (10 గ్రామాలు, కదంబులు దశగ్రామ అనే పేరుతో పిలిచేవారు) అనే పేర్లతో విభజించబడ్డాయి. అన్నింటికన్నా తక్కువ స్థాయిలో కదంబుల పరిపాలనా విధానమే అనుసరించబడింది. ఒకటవ విక్రమాదిత్యుడికి చెందిన సంజన్ ఫలకాల మీద దశగ్రామ అనే పేరు ప్రస్తావించబడి ఉంది.[142] రాజ్య సంబంధమైన పాలనా విభాగాలతో పాటు, అలూపాలు, గాంగేయులు, బాణాలు ఇంకా సెండ్రాకాలు వంటి సామంతులు పాలించిన స్వయంప్రతిపత్తి ప్రాంతాలు ఉన్నాయి.[143] స్థానిక సమావేశాలు మరియు సంఘాలు స్థానిక సమస్యలను పరిశీలించేవి. మహాజనల సమూహాలు (బ్రాహ్మణులు) ఘటిక అనబడే అగ్రహారాలను చూసుకునే వారు. బాదామిలో 2000 మంది మహాజనులు మరియు ఐహోల్‌లో 500 మంది మహాజనులు సేవ చేశారు. సరుకులపై హెర్జుంకా అనే పన్నులు విధించేవారు. రవాణా జరిగే చిల్లర వస్తువులపై కిరుకుల పన్ను, బిల్‌కోడ్ అనే అమ్మకపు పన్ను, తమలపాకులపై పన్నయా పన్ను, భూమిపై సిద్ధాయా పన్ను, రాజులకు వద్దరావుల పన్ను వసూలు చేసేవారు.[143]

నాణేలు మార్చు

ఉత్తర భారత సామ్రాజ్యాలతో పోలిస్తే బాదామి చాళుక్యులు భిన్నమైన ప్రమాణాలతో కూడిన నాణేలు ముద్రించారు.[144] ఈ నాణేల మీద నాగరి, కన్నడ పురాణాలు ఉండేవి.[23] మంగలేశుడు వేయించిన నాణేల్లో ఒక వైపు దేవాలయం, మరో వైపు రెండు దీపాల మధ్య రాజదండం ఉన్నాయి. రెండవ పులకేశి నాణేల్లో ఒక వైపు పక్కకు తిరిగిన సింహం బొమ్మ, మరో వైపు దేవాలయం ఉన్నాయి. ఈ నాణేలు ఒక్కొక్కటి నాలుగు గ్రాముల బరువు ఉన్నాయి. వీటిని పురాతన కన్నడ భాషలో హొణ్ (హొణ్ణు) అని వ్యవహరించేవారు.

మతం మార్చు

బాదామి చాళుక్యుల కాలంలో శైవం, వైష్ణవం రెండూ ప్రాచుర్యంలో ఉండేవి. శైవానికి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని తెలుస్తున్నది.[145] పట్టదకల్, ఐహొళె, మహాకూట ప్రాంతాల్లో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఉత్తర భారతదేశం నుంచి పురోహితులను ఆహ్వానించేవారు. వైదిక క్రతువులు, వ్రతాలు, దానాలు ప్రముఖంగా జరిగేవి.[146] బాదామి పాలకులు వేదకాలం నాటి హైందవ ధర్మాన్ని అనుసరించి, ఐహోళెలో శివుడు, విష్ణువు, కార్తికేయుడు, గణపతి, శక్తి, సూర్యుడు, సప్తమాతృకలు మొదలైన హిందూ ప్రధాన దైవాలకు ఆలయాలు నిర్మించారు. బాదామి చాళుక్యులు అశ్వమేధయాగాన్ని కూడా చేశారు.[147] సంతానానికి అధిదేవత అయిన లజ్జగౌరి దేవతను ఆరాధించారు. ఈ కాలంలోనే జైనమతం కూడా ఆదరణ పొందింది.

సమాజం మార్చు

అప్పటి సమాజంలో హిందూ వర్ణవ్యవస్థ అమలులో ఉండేది. దేవదాసీలను ప్రభుత్వం గుర్తించేది. సతి అనేది ఆచరణలో లేదు ఎందుకంటే భర్తను కోల్పోయిన వినయవతి, విజయంక మొదలైన రాణుల గురించి రికార్డుల్లో పేర్కొన్నారు. భరతనాట్యానికి ఆద్యుడైన భరతముని రాసిన నాట్య శాస్త్రం ఆదరణ పొందిందని, ఆ కాలానికి చెందిన శిల్పాలలో భరతనాట్య భంగిమలను చూసి, అప్పటి శాసనాలలో ప్రస్తావించడాన్ని బట్టి చెప్పవచ్చు.[148] రాజుల కుటుంబంలోని కొంతమంది మహిళలకు పరిపాలనలో ప్రాధాన్యం ఉండేది. రాణి విజయంక సంస్కృత కవయిత్రి.[136]

ప్రాచుర్య సంస్కృతిలో మార్చు

చాళుక్యుల యుగం, ఉత్తర, దక్షిణ భారత సంస్కృతుల కలయికకు నాందిగా పరిగణించవచ్చు. ఈ యుగం రెండు ప్రాంతాల మధ్య భావాల వ్యాప్తికి వారధిగా పనిచేసింది. దీనిని వాస్తుకళలో స్పష్టంగా గమనించవచ్చు. చాళుక్యుల ఉత్తర భారతదేశపు నాగర శైలినీ, దక్షిణ భారతదేశపు ద్రవిడ శైలినీ కలిపి వేసర అనే శైలిలో నిర్మాణాలు చేశారు. ఈ కాలంలో ప్రాంతీయంగా ఆదరణలో ఉన్న భాషలకు సంస్కృతం తోడైంది. ఈ ప్రభావం ఇప్పటికీ ద్రవిడ భాషలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావం వల్ల ఆయా భాషల సాహిత్యం మరింత ఇనుమడించింది.[149] హిందూ న్యాయచట్టం పశ్చిమ చాళుక్య ప్రభువైన నాలుగో విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండిన విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర అనే గ్రంథం నుంచి ప్రభావితమైంది. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది.

ప్రతి సంవత్సరం పట్టదకల్, బాదామి, ఐహోళె లో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు సంగీతం, నృత్యంతో కూడిన చాళుక్య ఉత్సవాలు నిర్వహిస్తుంది.[150] 1960వ దశకంలో కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన ఇమ్మడి పులకేశి అనే చిత్రం రెండవ పులకేశి జీవితాన్ని, కాలాన్ని ప్రతిబింబిస్తుంది.[150]

మూలాలు మార్చు

  1. N. Laxminarayana Rao and Dr. S. C. Nandinath have claimed the Chalukyas were Kannadigas (Kannada speakers) and very much the natives of Karnataka (Kamath 2001, p. 57)
  2. The Chalukyas were Kannadigas (D.C. Sircar in Mahajan V.D., 1960, Reprint 2007, Ancient India, Chand and Company, New Delhi, p. 690, ISBN 81-219-0887-6)
  3. Natives of Karnataka (Hans Raj, 2007, Advanced history of India: From earliest times to present times, Part-1, Surgeet publications, New Delhi, p. 339)
  4. The Chalukyas hailed from Karnataka (John Keay, 2000, p. 168)
  5. Quote:"They belonged to Karnataka country and their mother tongue was Kannada" (Sen 1999, p. 360)
  6. The Chalukyas of Badami seem to be of indigenous origin (Kamath 2001, p. 58)
  7. Jayasimha and Ranaraga, the first members of the Chalukya family were possibly employees of the Kadambas in the northern part of the Kadamba Kingdom (Fleet [in Kanarese Dynasties, p. 343] in Moraes, 1931, pp. 51–52)
  8. Pulakesi I must have been an administrative official of the northern Kadamba territory centered in Badami (Moraes 1931, pp. 51–52)
  9. The Chalukya base was Badami and Aihole (Thapar 2003, p. 328)
  10. Inscriptional evidence proves the Chalukyas were native Kannadigas (Karmarkar, 1947, p. 26)
  11. 11.0 11.1 Ramesh (1984), p. 20
  12. చాళుక్యుల పూర్వ స్థానము: The History of Andhras, G. Durga Prasad, 1988, Page 86; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine
  13. తెలుగు భాష, సాహిత్యము:Telugu Language and Literature, S. M. R. Adluri, 1998, http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html Archived 2009-09-23 at the Wayback Machine
  14. Pulakesi I of Badami who was a feudatory of the Kadamba king Krishna Varman II, overpowered his overlord in c. 540 and took control of the Kadamba Kingdom (Kamath 2001, p. 35)
  15. Jayasimha (Pulakesi I's grandfather) is known from the Kaira inscription of 472–473 CE. Both Jayasimha and Ranaraga (Pulakesi I's father) are known from Mahakuta inscription of 599 CE and Aihole record of 634 CE (Ramesh 1984, pp. 26–27, p. 30)
  16. From the Badami Cliff inscription of Pulakesi I and from the Hyderabad record of Pulakesi II which states their family ancestry (Kamath 2001, pp. 56–58)
  17. Sastri (1955), p. 154
  18. Chopra (2003), p. 73, part 1
  19. Kamath (2001), p. 56
  20. Moraes (1931). pp. 10–11
  21. Ramesh (1984), p. 19
  22. Sircar D.C. (1965), p. 48, Indian Epigraphy, Motilal Banarsidass Publishers, Delhi, ISBN 81-208-1166-6
  23. 23.0 23.1 Kamath (2001), p. 57
  24. Houben (1996), p. 215
  25. Professor N.L. Rao has pointed out that some of their family records in Sanskrit have also named the princes with "arasa", such as Kattiyarasa (Kirtivarman I), Bittarasa (Kubja Vishnuvardhana) and Mangalarasa (Mangalesha, Kamath 2001, pp. 57–60)
  26. Historians Shafaat Ahmad Khan and S. Krishnasvami Aiyangar clarify that Arasa is Kannada word, equivalent to Sanskrit word Raja – Journal of Indian History p. 102, Published by Department of Modern Indian History, University of Allahabad
  27. Dikshit, Durga Prasad (1968). POLITICAL HISTORY OF THE CHALUKYAS OF BADAMI. The Rashtrakuta inscriptions also praise the heroic nature of the Chalukyan army (Karṇāṭakabala, in their records)
  28. 28.0 28.1 Dr. Hoernle suggests a non-Sanskrit origin of the dynastic name. Dr. S.C. Nandinath feels the Chalukyas were of agricultural background and of Kannada origin who later took up a martial career. He feels the word Chalki found in some of their records must have originated from salki, an agricultural implement (Kamath 2001, p. 57)
  29. The word Chalukya is derived from a Dravidian root (Kittel in Karmarkar 1947, p. 26)
  30. 30.0 30.1 Anirudh Kanisetti (2022). Lords of the Deccan: Southern India from the Chalukyas to the Cholas. India: Juggernaut. p. 35. ISBN 978-93-91165-0-55. there seems to have been some connection to the crowbar, chalke, pointing to very humble origins, likely as a leader of an agricultural group in the valley of the Malaprabha river, in the northern part of the modern state of Karnataka.
  31. Kamath (2001), p. 6, p. 10, p. 57, p. 59, p. 67
  32. Ramesh (1984), p. 76, p. 159, pp. 161–162
  33. 33.0 33.1 Kamath (2001), p. 59
  34. Azmathulla Shariff. "Badami Chalukyans' magical transformation". Deccan Herald, Spectrum, July 26, 2005. Archived from the original on 2007-02-10. Retrieved 2006-11-10.
  35. Bolon, Carol Radcliffe (1 January 1979). "The Mahākuṭa Pillar and Its Temples". Artibus Asiae. 41 (2/3): 253–268. doi:10.2307/3249519. JSTOR 3249519.
  36. Thapar, (2003), p. 326
  37. Kamath (2001), pp. 12, 57, 67
  38. Pulakesi II's Maharashtra extended from Nerbudda (Narmada river) in the north to Tungabhadra in the south (Vaidya 1924, p. 171)
  39. Kamath (2001), p. 60
  40. Ramesh (1984), p. 14
  41. S.R. Bakshi; S.G (2005). Early Aryans to Swaraj. Sarup & Sons. p. 325. ISBN 978-81-7625-537-0. It has been reported that the story of agnikula is mot mentioned at all in the original version of the Raso preserved in the Fort Library at Bikaner.
  42. Kamath 2001, pp. 56
  43. Quote:"Another unhistorical trend met with in the epigraphical records of the 11th and subsequent centuries is the attempt, on the part of the court poets, no doubt, again, with the consent of their masters, to invent mythical genealogies which seek to carry back the antiquity of the royal families not merely to the periods of the epics and the Vedas but to the very moment of their creation in the heavens. As far as the Chalukyas of Vatapi are concerned, the blame of engineering such travesties attaches, once again, to the Western Chalukyas of Kalyani and their Eastern Chalukya contemporaries. The Eastern Chalukyas, for instance, have concocted the following long list of fifty-two names commencing with no less a personage than the divine preserver"(Ramesh 1984, p. 16)
  44. Kandavalli Balendu Sekaram. The Andhras through the ages. Sri Saraswati Book Depot, 1973. p. 188.
  45. R.K. Pruthi. The Classical Age. Discovery Publishing House, 2004 – India – 288 pages. p. 106.
  46. Satyavrata Ramdas Patel. The Soul of India. Munshiram Manoharlal Publishers, 1974 – India – 220 pages. p. 177.
  47. Dr. Lewis's theory has not found acceptance because the Pallavas were in constant conflict with the Kadambas, prior to the rise of Chalukyas (Kamath 2001, p. 57)
  48. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 387
  49. Thapar (2003), p. 326
  50. Popular theories regarding the name are: Puli – "tiger" in Kannada and Kesin – "haried" in Sanskrit; Pole – "lustrous" in Kannada, from his earliest Badami cliff inscription that literally spells Polekesi; Pole – from Tamil word Punai (to tie a knot; Ramesh 1984, pp. 31–32)
  51. The name probably meant "the great lion" (Sastri 1955, p. 134)
  52. The name probably meant "One endowed with the strength of a great lion" (Chopra 2003, p. 73, part 1)
  53. Kamath (2001), pp. 58–59
  54. Ramesh (1984), p. 76
  55. Chopra 2003, p. 74, part 1
  56. Quote:"His fame spread far and wide even beyond India" (Chopra 2003, p. 75 part 1)
  57. Quote:"One of the great kings of India". He successfully defied the expansion of king Harshavardhana of Northern India into the deccan. The Aihole inscription by Ravikirti describes how King Harsha lost his Harsha or cheerful disposition after his defeat. The Chinese traveller Hiuen Tsiang also confirms Pulakesi II's victory over King Harsha in his travelogue. Pulakesi II took titles such as Prithvivallabha and Dakshinapatha Prithviswamy (Kamath 2001, pp. 58–60)
  58. Quote:"Thus began one of the most colourful careers in Indian History" (Ramesh 1984, p. 76)
  59. Vikramaditya I, who later revived the Chalukya fortunes was born to Pulakesi II and the daughter of Western Ganga monarch Durvinita (Chopra 2003, p. 74, part 1)
  60. His other queen, an Alupa princess called Kadamba was the daughter of Aluka Maharaja (G.S. Gai in Kamath 2001, p. 94)
  61. Quote:"The Aihole record gives an impressive list of his military conquests and other achievements. According to the record, he conquered the Kadambas, the Western Gangas, the north Konkan by naval victory, Harsha of Thanesar, the Latas, the Malwas, the Gurjaras (thereby obtaining sovereignty over the Maharashtras), Berar, Maharashtra and Kuntala (with their nine and ninety thousand villages), the Kalingas and the Kosalas, Pishtapura (Pishtapuram in eastern Andhra) and Kanchipuram, whose king had opposed the rise of his power" (Chopra 2003, p. 74 part 1)
  62. Ramesh (1984), pp. 79–80, pp. 86–87
  63. According to Dr. R. C. Majumdar, some principalities may have submitted to Pulakesi II out of fear of Harsha of Kanauj (Kamath 2001, p. 59)
  64. Sastri (1955), pp. 135–136
  65. 65.0 65.1 65.2 Chopra (2003), p. 75, part 1
  66. Sastri (1955), p. 136
  67. This is attested to by an inscription behind the Mallikarjuna temple in Badami (Sastri 1955, p. 136)
  68. Chopra (2003), pp. 75–76, part 1
  69. From the Gadval plates dated c. 674 of Vikramaditya I (Chopra 2003, p. 76, part 1)
  70. 70.0 70.1 Chopra (2003), p. 76, part 1
  71. Sastri (1955), p. 138
  72. 72.0 72.1 From the Kannada inscription at the Kailasanatha temple in Kanchipuram (Sastri 1955, p. 140)
  73. Kamath (2001), p. 63
  74. Thapar (2003), p. 331
  75. Ramesh (1984), pp. 159–160
  76. Dikshit, Durga Prasad (1980), p. 166–167, Political History of the Chālukyas of Badami, Abhinav Publications, New Delhi, OCLC 831387906
  77. Ramesh (1984), p. 159
  78. Ramesh (1984), pp. 173–174
  79. Kings of the Chalukya line of Vemulavada, who were certainly from the Badami Chalukya family line used the title "Malla" which is often used by the Western Chalukyas. Names such as "Satyashraya" which were used by the Badami Chalukya are also names of a Western Chalukya king, (Gopal B.R. in Kamath 2001, p. 100)
  80. Unlike the Badami Chalukyas, the Kalyani Chalukyas did not claim to be Harithiputhras of Manavysya gotra in lineage. The use of titles like Tribhuvanamalla marked them as of a distinct line (Fleet, Bhandarkar and Altekar in Kamath 2001, p. 100)
  81. Later legends and tradition hailed Tailapa as an incarnation of the God Krishna who fought 108 battles against the race of Ratta (Rashtrakuta) and captured 88 fortresses from them (Sastri 1955, p. 162)
  82. From his c. 957 and c.965 records (Kamath 2001, p. 101
  83. Vijnyaneshavara, the Sanskrit scholar in his court, eulogised him as "a king like none other" (Kamath 2001, p. 106)
  84. The writing Vikramankadevacharita by Bilhana is a eulogy of the achievements of the king in 18 cantos (Sastri, 1955 p. 315)
  85. Cousens 1926, p. 11
  86. Vikrama–Chalukya era of 1075 CE (Thapar 2003, p. 469)
  87. Chopra (2003), p. 139, part 1
  88. Sastri (1955), p. 175
  89. Kamath (2001), pp. 114–115
  90. Narasimhacharya (1988), pp. 18–20
  91. Sastri (1955), p. 192
  92. Pulakesi II made Vishnuvardhana the Yuvaraja or crown prince. Later Vishnuvardhana become the founder of the Eastern Chalukya empire (Sastri 1955, pp. 134–136, p. 312)
  93. 94.0 94.1 Chopra (2003), p. 132, part 1
  94. Kamath (2001), p. 8
  95. Kamath 2001, p. 60
  96. 97.0 97.1 97.2 Chopra (2003), p. 133
  97. Sastri (1955), pp. 164–165
  98. Sastri (1955), p. 165
  99. Narasimhacharya (1988), p. 68
  100. The Eastern Chalukya inscriptions show a gradual shift towards Telugu with the appearance of Telugu stanzas from the time of king Gunaga Vijayaditya (Vijayaditya III) in the middle of the 9th century, Dr. K.S.S. Seshan, University of Hyderabad. "APOnline-History of Andhra Pradesh-ancient period-Eastern Chalukyas". Revenue Department (Gazetteers), Government of Andhra Pradesh. Tata Consultancy Services. Archived from the original on 6 డిసెంబరు 2006. Retrieved 20 అక్టోబరు 2019.
  101. The first work of Telugu literature is a translation of Mahabharata by Nannaya during the rule of Eastern Chalukya king Rajaraja Narendra (1019–1061; Sastri 1955, p. 367)
  102. 103.0 103.1 by Tartakov, Gary Michael (1997), The Durga Temple at Aihole: A Historiographical Study, Oxford University Press, ISBN 978-0-19-563372-6
  103. Tarr, Gary (1970), p.156, Chronology and Development of the Chāḷukya Cave Temples, Ars Orientalis, Vol. 8, pp. 155–184
  104. Hardy (1995), p. 65
  105. 106.0 106.1 Hardy (1995), p. 66
  106. Sastri (1955), p. 406
  107. Quote:"The Chalukyas cut rock like titans but finished like jewellers"(Sheshadri in Kamath 2001, pp. 68–69)
  108. Percy Brown in Kamath (2001), p. 68
  109. Sastri (1955), p. 407
  110. 111.0 111.1 111.2 Hardy (1995), p. 67
  111. Foekema (2003), p. 11
  112. Sastri (1955), pp. 407–408
  113. Sastri (1955), p. 408
  114. Kamath (2001), p. 69
  115. Quote:"Their creations have the pride of place in Indian art tradition" (Kamath 2001, p. 115)
  116. Sastri (1955), p. 427
  117. Cousens (1926, p 17
  118. Foekema (1996), p. 14
  119. Hardy (1995), p. 156
  120. Hardy (1995), pp. 6–7
  121. Cousens (1926), pp. 100–102
  122. Hardy (1995), p. 333
  123. Cousens (1926), pp. 79–82
  124. 125.0 125.1 Hardy (1995), p. 336
  125. Hardy (1995), p. 323
  126. The Mahadeva Temple at Itagi has been called the finest in Kannada country after the Hoysaleswara temple at Halebidu (Cousens in Kamath 2001, p 117)
  127. Cousens (1926), pp. 114–115
  128. Hardy (1995), p. 326
  129. Cousens (1926), pp. 85–87
  130. Hardy (1995), p. 330
  131. Foekema (2003), p. 52
  132. Hardy (1995), p. 321
  133. The Badami Chalukyas influenced the art of the rulers of Vengi and those of Gujarat (Kamath 2001, pp. 68, 69)
  134. Quote:"He deemed himself the peer of Bharavi and Kalidasa". An earlier inscription in Mahakuta, in prose is comparable to the works of Bana (Sastri, 1955, p. 312)
  135. 136.0 136.1 Sastri, 1955, p. 312
  136. The writing is on various topics including traditional medicine, music, precious stones, dance etc. (Kamath 2001, p. 106)
  137. Chopra (2003), p. 77, part1
  138. Kamath (2001), p. 64
  139. Kamath 2001, pp. 57, 65
  140. Dikshit, Durga Prasad (1968). POLITICAL HISTORY OF THE CHALUKYAS OF BADAMI. The Rashtrakuta inscriptions also praise the heroic nature of the Chalukyan army (Karṇāṭakabala, in their records)
  141. The breakup of land into mandalas, vishaya existed in the Kadamba administrative machinery (Kamath 2001, pp. 36, 65, 66)
  142. 143.0 143.1 Kamath (2001), p. 65
  143. However, they issued gold coins that weighed 120 grams, in imitation of the Gupta dynasty (A.V. Narasimha Murthy in Kamath 2001, p. 65)
  144. Sastri (1955), p. 391
  145. Kamath 2001, p. 66
  146. One record mentions an artist called Achala who was well versed in Natyashastra (Kamath 2001, p. 67)
  147. Sastri (1955), p. 309
  148. 150.0 150.1 Staff correspondent. "Chalukya Utsava: Depiction of grandeur and glory". NewIndia Press, Sunday February 26, 2006. NewIndia Press. Archived from the original on 29 సెప్టెంబరు 2007. Retrieved 12 నవంబరు 2006.

ఆధార గ్రంథాలు మార్చు

Web