చూసొద్దాం రండి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో 2000లో విడుదలైన చిత్రం. ఇందులో జగపతి బాబు, శ్రీకాంత్, రంభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి మెలోడీ మల్టీమీడియా పతాకంపై నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. ఎల్. ఆర్. ఈశ్వరి ఈ సినిమాలో చివరి సారిగా పాడింది.

చూసొద్దాం రండి
దర్శకత్వంరాజా వన్నెంరెడ్డి
నిర్మాతసుంకర మధుమురళి
తారాగణంజగపతి బాబు, శ్రీకాంత్, రంభ
ఛాయాగ్రహణంకె. ప్రసాద్
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
మెలోడీ మల్టీమీడియా
విడుదల తేదీ
2000 ఆగస్టు 18 (2000-08-18)
సినిమా నిడివి
152 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

భీమవరపు బుచ్చిబాబు అలియాస్ బాబు, అంజి ఇళ్ళ బ్రోకర్లు. ఒకసారి గీత అనే అందమైన అమ్మాయి వీళ్ళ దగ్గరికి వస్తే బాబు తెలివిగా తాము ఉంటున్న అద్దె ఇంటిలోకే ఒక భాగం ఆమెకు అద్దెకిస్తారు. ఆ ఇల్లు టైగర్ ధర్మకు సంబంధించినది. గీత అక్కడికి రావడానికి కారణం తాను ప్రేమించిన అరవింద్ ను వెతకడం. అతన్ని కనుగొన్న తర్వాత అరవింద్ తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కొంచెం సమయం అడుగుతాడు.

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సంగీతం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.

  • చిన్ననాటి రెండు జళ్ళ ఆ పెళ్ళి కూతురు

మూలాలు మార్చు