" చేది " ఒక పురాతన భారతీయ యాదవ రాజ్యం. ఇది మధ్యప్రదేశు ప్రాంతాలలోని బుందేలుఖండు విభాగంలో యమునా నదికి దక్షిణాన కెను నదీ తీరంలో ఉండేది. దీని రాజధాని నగరాన్ని సంస్కృతంలో శక్తిమతి, పాలిలో సోత్తివతి-నగరా అని పిలిచేవారు.[1] పాలి భాషా బౌద్ధ గ్రంధాలలో ఇది పదహారు మహాజనపదాలలో ఒకటిగా (ఉత్తర, మధ్య భారతదేశం "గొప్ప రాజ్యాలు") జాబితా చేయబడింది.[2]

Chedi Kingdom

600 BCE–300 BCE
Chedi Kingdom and other Mahajanapadas in the Post Vedic period.
Chedi Kingdom and other Mahajanapadas in the Post Vedic period.
రాజధానిSuktimati
ప్రభుత్వంMonarchy
చారిత్రిక కాలంAncient India
• స్థాపన
600 BCE
• పతనం
300 BCE
Today part ofIndia

మహాభారతం ఆధారంగా చేది రాజ్యాన్ని మగధకు చెందిన జరాసంధుడు, కురుచక్రవర్తి దుర్యోధనులకు మిత్రుడైన శిశుపాలుడు పాలించాడు. ఆయన తన మామ కొడుకు అయిన వాసుదేవ కృష్ణూడికి ప్రత్యర్థి. పాండవ చక్రవర్తి యుధిష్ఠరుడు రాజసూయ యాగం సమయంలో వాసుదేవ కృష్ణుడు ఆయనను చంపాడు. భీముడి భార్య చేదికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ చేదిరాజులలో దమఘోషుడు, శిశుపాలుడు, ధృష్టకేతు, సుకేతు, సారాభా, భీముడి భార్య, నకుల భార్య కరేనుమతి, ధృష్టకేతు కుమారులు ఉన్నారు. ఇతర చేదిరాజులలో ఉపరిచర వసువు, ఆయన పిల్లలైన రాజు సుబాహు, రాజా సహజా ఉన్నారు. దీనిని ప్రారంభ కాలంలో పౌరవ రాజులు, తరువాత దేశ మధ్య భాగంలో యాదవ రాజులు పాలించారు.

భౌగోళికం మార్చు

రాజధాని నగరం సుక్తిమతి స్థానం ఖచ్చితంగా నిర్ణయించబడలేదు. చరిత్రకారుడు హేమ చంద్ర రాయచౌదరి. ఎఫ్. ఇ. పార్గిటరు ఇది ఉత్తర ప్రదేశు లోని బండా సమీపంలో ఉందని విశ్వసిస్తున్నారు.[3] పురావస్తు శాస్త్రవేత్త దిలీపు కుమారు చక్రవర్తి, మధ్యప్రదేశు లోని రేవా శివార్లలో ఆధునిక ఇటాహా ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద ప్రారంభ చారిత్రక నగరం సుక్తిమతిని శిధిలాలను గుర్తించవచ్చని ప్రతిపాదించారు.[4]

పౌరాణిక చరిత్ర మార్చు

విదర్భ కుమారుడు చేది పేరుతో చేది రాజ్యం స్థాపించబడింది. ఇది యాదవ రాజవంశానికి చెందినది. రాజు ఉపరిచర వసువు ఇంద్రుని ఆదేశంతో దీనిని జయించి పాలించాడు. ఉపరిచర వసువు సంతతికి చెందిన వారసుడు శిశుపాల.

పురాతన భారతదేశంలో సూచించిన చేది రాజ్యం(భరతవర్ష) మార్చు

కురు-పంచాల, సాల్వాలు, మాద్రేయలు, జంగళాలు, సురసేనలు, కళింగాలు, వోధలు, మల్లాలు, మత్స్యదేశ ప్రజలు, సౌవాల్యాలు, కుంతలాలు, కాశీ-కోసలు, చేదిప్రజలు, కరుషాలు, భోజులు .. . (6,9)

పాండవులు 13 వ సంవత్సరం ప్రవాసం గడపడానికి ఎంపిక చేసిన రాజ్యాలలో చేది ఒకటి.

కురుల రాజ్యం చుట్టూ పాంచాల, చేది, మత్స్య, సురసేన, పట్టాచర, దాసర్ణ, నవరాష్ట్ర, మల్లా, సాల్వ, యుగంధర, సౌరాష్ట్ర, అవంతి, విశాలమైన కుంతిరాష్ట్ర వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో మొక్కజొన్నలు చాలా విస్తారంగా పండించబడేవి. (4.1)

ఉపరిచర వసువు, వెదురు స్థంభం మార్చు

చేది రాజు ఉపరిచర వసువు " పురు రాజవంశం " నికి చెందిన రాజు. ఆయన ఇంద్రుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అతని పాలనలో చేది రాజ్యం మంచి ఆర్థిక వ్యవస్థతో చాలా ఖనిజ సంపదను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యాపారులను రాజ్యానికి వచ్చేలా చేసింది. ఈదేశంలో జంతువులు, మొక్కజొన్న పంట పుష్కలంగా ఉండేది. రాజ్యంలో చాలా పట్టణాలు, నగరాలు ఉన్నాయి. ఆయన చాలా ప్రత్యేకమైన రథాన్ని కలిగి ఉన్నాడు. ఇంద్రుని గౌరవార్థం తన రాజ్యంలో ఒక పండుగను ప్రవేశపెట్టాడు. ఈ పండుగలో ఇంద్రుని గౌరవార్థం ప్రతి సంవత్సరం వెదురు స్తంభం నాటడం జరిగింది. అక్కడ రాజు తన నగరాలు, రాజ్యం విస్తరణ కొరకు ప్రార్థిస్తాడు. స్థంభం నిర్మించిన తరువాత ప్రజలు దీనిని బంగారు వస్త్రం, సువాసనలు, దండలు, వివిధ ఆభరణాలతో అలంకరించారు. చేది నుండి, ఆయన ఒక పెద్ద భూభాగాన్ని పరిపాలించాడు. తన కుమారులను వివిధ ప్రావిన్సులకు ప్రతినిధులుగా ఉంచాడు. మగధలో ఆయన కుమారుడు బృహద్రత (మహారాఠం), తరువాత ఆయనకు జరసంధుడు జన్మించాడు. ఆయన ఇతర కుమారులు ప్రత్యగ్రహ, కుసంవ (మణివాహన), మావెల్ల, యదు కూడా వివిధ ప్రదేశాలలో ప్రతినిధులు అయ్యారు. ఆ విధంగా చేది రాజు చక్రవర్తి హోదాను పొందాడు. ఆయన రాజ్యం విస్తారమైన సామ్రాజ్యంగా మారింది. ఆయన తన రాజధాని-నగరానికి సాగునీరు ఇవ్వడానికి సుక్తిమతి నది జలాలను కోలహాల పర్వత బంధనం నుండి మళ్లించాడు. (1,63)

  • చెదీల ఈ అందమైన నగరాన్ని ఓస్టెరు (14,83) పేరుతో పిలిచారు.

అతని భార్య గిరిక, కోలహళ లోయకు చెందినది. గిరిక సోదరుడిని వసువు సైన్యాధ్యక్షుడుగా సిమోగా నియమించారు. తన ఐదుగురు రాజ కుమారులు కాకుండా, మత్స్యకారుల వర్గానికి చెందిన ఒక మహిళ నుండి ఒక కుమారుడు, కుమార్తె జన్మించాడు. మగ బిడ్డ మత్స్య రాజ్యాన్ని స్థాపించి. మత్స్య రాజవంశం అనే రాజ వంశాన్ని స్థాపించాడు. ఆడపిల్ల మత్స్యకారుల సంఘంలో సభ్యురాలిగా జీవించింది. కురు రాజ్యంలో యమునా నది ఒడ్డున మత్స్యకారులుగా ఆమె వంశం స్థాపించబడింది. ప్రసిద్ధ కురు రాజు శంతనుడు భార్య సత్యవతి ఈ మత్స్యకారుల సంఘానికి చెందినది. సత్యవతికి మహాభారత రచయిత, కృష్ణ ద్వైపాయణ వ్యాసుడు కురు రాజులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యులు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. పాండవులు, కౌరవులు విచిత్రావీర్యుడి మనవళ్లు. (1,63)

  • మరొక కథ పురాతన భారతదేశంలో వసువును శాఖాహార జీవనవిధానం అవలంబించినట్లు వివరిస్తుంది. మాంసాహార విధానాన్ని గౌరవించే సందేహాలతో నిండిన కొందరు ఋషులు వాటిని పరిష్కరించమని ఉపరీచర వసువును కోరారు. మాంసం తినదగినది కాదని తెలుసుకున్న వసువు అది తినతగనిదని సమాధానం ఇచ్చాడు. కాని అది తినతగినదని ఋషులు నిర్ణయించారు. ఫలితంగా ఆ క్షణం నుండి వసువు ఆకాశం నుండి భూమిమీద పడిపోయాడు. దీని తరువాత ఆయన తన అభిప్రాయాన్ని మరోసారి పునరావృతం చేశాడు. దాని ఫలితంగా ఆయన దాని కోసం భూమిలో మునిగిపోవలసి వచ్చింది. (13,115).[5]
  • ఇలాంటి కథ వసువును జంతు యాగసమస్యతో అనుసంధానిస్తుంది. ఆయన అభిప్రాయం ప్రకారం జంతువుల వధతో లేదా లేకుండా యాగాలు చేయవచ్చు (14,91)

చేది వంశరాజు శిశుపాలుడు మార్చు

శిశుపాల రాజు దమఘోష (1,189) దుష్ట కుమారుడు. అతనికి సునీతుడు అనే మరో పేరు ఉంది. ఆయన తల్లి శ్రుతకీర్తి పాండవుల తల్లి అయిన కుంతి సోదరి. కుంతి, శ్రుతకిర్తి ఇద్దరూ వాసుదేవ కృష్ణ తండ్రి వాసుదేవుడి సోదరీమణులు. అయితే శిశుపాల పాండవులలో భీముడి పట్ల అభిమానం ఉన్నప్పటికీ కృష్ణుడితో (2,44) శత్రుత్వం పెంచుకున్నాడు. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిర రాజసూయ యాగానికి నివాళి అర్పించడానికి సాగించిన తన సైనికపోరాట సమయంలో భీముడు శిశుపాలుడి రాజభవనంలో ఒక నెల పాటు అతిథిగా ఉన్నాడు. ఆయన తన రాజ్యం మీద యుధిష్ఠిరుడి ఆధిపత్యాన్ని కూడా అంగీకరించి భీమునికి నివాళి అర్పించాడు (2,28). యుధిష్ఠిర రాజసూయ వేడుక మధ్యలో, శిశుపాలుడు, వాసుదేవ కృష్ణుడికి మధ్య వివాదం తలెత్తింది. పాండవులు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. కృష్ణుడితో పాటు పాండవులను, కురు మనవడు భీష్ముడిని కూడా మందలించాడు. అప్పుడు కృష్ణుడు శిశుపాలుడిని చాలా రెచ్చగొట్టి శిశుపాలని శిరచ్ఛేదం చేశాడు. (2,44).

కృష్ణుడి మీద శిశుపాల శత్రుత్వం చాలా ఉంది. ఆయన ద్వారకా నగరాన్ని తగలబెట్టాడు. కృష్ణుడు తన సైన్యంతో ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. ఆయనను ద్వారకకు దగ్గరగా ఉన్న రైవతక కొండ వద్ద ఆడుకుంటున్న భోజా రాజు మీద దాడి చేశాడు. ఆయన తన అశ్వమేధయాగం సమయంలో కృష్ణుడి తండ్రి మధుర యువరాజు వాసుదేవుడి గుర్రాన్ని అడ్డగించాడు. ద్వారక నుండి సౌవిరా రాజ్యానికి వెళ్ళేటప్పుడు అక్రురుడి భార్యను (వబ్రు - కృష్ణుడి స్నేహితుడు) అవమానించాడు. ఆయన కరుషా రాజును వివాహం జరుగనున్న విశాలరాజ్య యువరాణి భద్రాను అపహరించాడు. (2,44)

  • యుధిష్ఠిరుడు శిశుపాలుడి కుమారుడిని చేది సింహాసనం అధిష్టింపజేసాడు. (2,44)
  • శిశుపాల సోదరి (15,25) లో శిశుపాలుడి సూచన ప్రకారం భీమాను వివాహం చేసుకుంది(15,25)

చేది రాజు దశరధుడు మార్చు

చేది రాజు (3,12) ధృష్టకేతుడు, రాజు శిశుపాలుడి (5,50) పెద్ద కుమారుడిగా వర్ణించబడింది. దృష్టకేతువు కాలంలో కూడా శక్తిమతి చేది రాజధానిగా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాంశవుల సైన్యంలో ధృష్టతుడు సైనికాధికారిగా ఉన్నాడు. ఆయన చేది, కాశీ, కరుషాల (5,199) సైన్యానికి నాయకుడుగా ఉన్నాడు. భీష్ముడు (5,172) వర్గీకరణ ఆధారంగా ఆయన మహారధుడు. ఆయన కుమారులలో ఒకరు కూడా యుద్ధంలో పాల్గొన్నారు (5,57). ఆయనను ద్రోణుడు (7,128), (11,25) చంపాడు. ధృష్టకేతుడు కూడా ద్రోణుడి చేత యుద్ధంలో చంపబడ్డాడు.

  • చేది యువరాణి కరేనుమతి పాండవసోదరులలోని నకులుడితో వివాహం జరిగింది. వారికి యువరాజు నరిమిత్ర కుమారుడుగా జన్మించాడు. (1,95). ఆమె ధృష్టకేతు సోదరి ఔనా కాదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఆయన సోదరి పాండవులలో ఒకరికి (3,22) (15,1) భార్య అని ప్రస్తావించబడింది.
  • ధృష్ఠకేతువు మరణం తరువాత శిశుపాలుడి చిన్న కుమారుడు శరభా చేది రాజు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత అర్జునుడు సైనిక పోరాటంలో ఓడిపోయాడు. (14,83)

ఇతర చేది రాజులు మార్చు

  • నిషాధ రాజు నాల, రాముడి కాలంలో సుబాహు రాజును చేది రాజుగా అభివర్ణించారు. ఆయన విదర్భ యువరాణిని వివాహం చేసుకున్నాడు. అడవిలో ఒంటరిగా ఉండి, చేది వైపు వెళ్లే వ్యాపారుల సమూహాలను కలుసుకుని వారితో పాటు ఆమె చేది రాజధానికి చేరుకుని, చేది రాజభవనంలో రాణి సేవకురాలిగా నివసించింది. (3-64,65)
  • చేది మత్స్యాలలో రాజు సహజా, తన స్వంత జాతి (5,74) వినాశకుడుగా వర్ణించబడింది. ఆయన రాముడి మిత్రుడు

కురుక్షేత్ర యుద్ధంలో చేదిరాజులు మార్చు

చేదిరాజు దృష్టకేతు, ఆయన కుమారులు మార్చు

  • చేదిల శక్తివంతమైన సైన్యాధిపతి ధృష్టకేతుడు అక్షౌహిని సైన్యంతో కలిసి, పాండు కుమారుల వద్దకు వచ్చాడు. (5-19,57)
  • చేది, కరుషా తెగల సమావేశమైన రాజులు అందరూ తమ వనరులతో పాండవులలో కొంత భాగాన్ని తీసుకున్నారు. (5,22)
  • చేది రాజు ధృష్టకేతుడు యుద్ధంలో రంగురంగుల రంగు కాంభోజ జాతి అశ్వాలను ఉపయోగించాడు (7,23)
  • ధృష్టకేతువును, ఆయన కొడుకును ద్రోణుడు చంపాడు (7,122)
  • మరో చేది యువరాజును ద్రోణ కుమారుడు అశ్వస్థామ చంపాడు (7,198)
  • ధృష్టకేతు సోదరుడు శిశుపాల కుమారుడు అయిన సుకేతు అనే వ్యక్తిని కూడా ద్రోణుడు చంపాడు (8,6)

చేదితో శ్రీ కృష్ణిని బాంధవ్య సంభందాల కథనాలు మార్చు

2012 ఆంత్రోపోలాజికలు థ్రిల్లరు " ది కృష్ణ కీ " లో చేది వంశం మూలం యాదవులతో ముడిపడి ఉంది. జన్యు నిపుణుడు అయిన నవల ప్రధాన పాత్రలలో డాక్టరు దేవేంద్ర చేది ఒకరు.[6]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Raychaudhuri, Hem Chandra (1923), Political history of ancient India, from the accession of Parikshit to the extinction of the Gupta dynasty, Calcutta, Univ. of Calcutta, p. 66
  2. Raychaudhuri, Hem Chandra (1923), Political history of ancient India, from the accession of Parikshit to the extinction of the Gupta dynasty, Calcutta, Univ. of Calcutta, p. 67
  3. Raychaudhuri, Hem Chandra (1923), Political history of ancient India, from the accession of Parikshit to the extinction of the Gupta dynasty, Calcutta, Univ. of Calcutta, p. 66
  4. Chakrabarti, Dilip Kumar (2000), "Mahajanapada States of Early Historic India", in Hansen, Mogens Herman (ed.), A Comparative Study of Thirty City-state Cultures: An Investigation, p. 387, ISBN 9788778761774
  5. "The Mahabharata". sacred-texts.com.
  6. The Krishna Key, Chapter, 46,The Krishna Key , Sanghi, Ashwin, Westland Publishers 2012