జమ్నాలాల్ బజాజ్

భారతీయ ఉద్యమకారుడు

జమ్నాలాల్‌ బజాజ్‌ (నవంబర్ 4, 1889 - ఫిబ్రవరి 11, 1942) ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

జమ్నాలాల్‌ బజాజ్‌
జమ్నాలాల్‌ బజాజ్‌
జననం(1889-11-04)1889 నవంబరు 4
కాశీ కా బస్, సికార్, రాజస్థాన్
మరణం1942 ఫిబ్రవరి 11(1942-02-11) (వయసు 57)
వృత్తిసంఘసేవకుడు, రాజకీయవేత్త, స్వాంతంత్ర్య సమరయోధుడు, పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు.
జీవిత భాగస్వామిజానకీదేవి బజాజ్
పిల్లలుకమలాబాయి, కమల నయన్, ఉమ, రామకృష్ణ, మదాలస
తల్లిదండ్రులుకనీరామ్‌, బిర్దిబాయి

జననం మార్చు

నేటి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నవంబర్ 4, 1889 వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్‌ కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.

మరణం మార్చు

ఫిబ్రవరి 11, 1942లో మరణించాడు.

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు