జి.ఎ.నటేశన్

భారతీయ ఉద్యమకారుడు

గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్ (1873 ఆగష్టు 25 - 1948 ఏప్రిల్ 29) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు. అతను G. A. నటేశన్ & కో అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. అది జాతీయవాద పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ప్రముఖమైనది ది ఇండియన్ రివ్యూ.

గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్
1933 లో నటేశన్
జననం(1873-08-25)1873 ఆగస్టు 25
గణపతి అగ్రహారం, తంజావూరు జిల్లా
మరణం1948 ఏప్రిల్ 29(1948-04-29) (వయసు 74)
వృత్తిస్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణ కర్త
జీవిత భాగస్వామిమంగళమ్మ

తొలి జీవితం మార్చు

నటేశన్ తంజావూరు జిల్లాలోని గణపతి అగ్రహారం గ్రామంలో 1873 ఆగష్టు 25 న జన్మించాడు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించి, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు. ప్రచురణకర్తగా వృత్తిని ప్రారంభించాడు. 1897లో తన స్వంత పబ్లిషింగ్ కంపెనీ, G. A. నటేసన్ & కోని ప్రారంభించే ముందు అతడు గ్లిన్ బార్లో క్రింద శిక్షణ పొందాడు.[1][2]

స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర మార్చు

నటేశన్ 1900 తొలి రోజుల నుండి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఆంగ్లంలో ది ఇండియన్ రివ్యూ మాసపత్రికను ప్రారంభించాడు.[3] ఎక్కువగా జాతీయవాద ఇతివృత్తాలపై రచనలు చేసే ది ఇండియన్ రివ్యూలో సాహిత్య సమీక్షలు, దృష్టాంతాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయంపై కూడా రచనలు వేసేవారు. ఈ పత్రిక "ఆసక్తికరమైన అన్ని అంశాలపై చర్చకు అంకితం చేయబడింది" అని నటేశన్ మొదటి పేజీలో ప్రచారం చేశాడు.[3]

మహాత్మా గాంధీ 1915లో భారతదేశానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా మద్రాసు సందర్శించినప్పుడు, అతను జార్జ్‌టౌన్‌లోని తంబు చెట్టి వీధిలో నటేశన్ ఇంట్లోనే బస చేశాడు.[4][5] అతని బస 1915 ఏప్రిల్ 17 నుండి 1915 మే 8 వరకు కొనసాగింది.[5]

మలి జీవితం మార్చు

తన తరువాతి జీవితంలో, నటేశన్ భావజాలంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో అతడు ఇండియన్ లిబరల్ పార్టీలో చేరాడు. 1922లో లిబరల్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు.[6] 1923లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌కు నాన్-అఫీషియల్ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1931లో రెండవసారి అతను కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యునిగా ఉన్న సమయంలో, నటేశన్ కెనడాలోని ఎంపైర్ పార్లమెంటరీ అసోసియేషన్‌కు భారతీయ దళ సభ్యుడిగా పనిచేశాడు.[7][7] 1933-34లో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ టారిఫ్ బోర్డు సభ్యునిగా కూడా నటేశన్ పనిచేశాడు.[6][8] 1938లో మద్రాసు షరీఫ్‌గా నియమితులయ్యాడు. నటేసన్ 1948 ఏప్రిల్ 29 న తన 74వ ఏట మరణించాడు. ఆయన మరణించే వరకు చురుకుగానే ఉన్నాడు.[6]

మూలాలు మార్చు

  1. World biography. Institute for Research in Biography. 1948.
  2. Diamond jublee: sixty years of publishing, 1897-1957. G. A. Natesan & Co. 1957. p. 39.
  3. 3.0 3.1 Somerset Playne; J. W. Bond; Arnold Wright (1914). Southern India: its history, people, commerce, and industrial resources. pp. 733.
  4. "The Mahatma: Gandhi and Kasturba". Gandhi Ahsram at Sabarmati. Archived from the original on 6 February 2009.
  5. 5.0 5.1 "When Gandhi visited Madras". The Hindu. 26 January 2003. Archived from the original on 20 June 2003.
  6. 6.0 6.1 6.2 Clarence Lewis Barnhart; William Darrach Halsey (1980). New Century Cyclopedia of Names. Simon & Schuster. p. 2892. ISBN 0136119476, ISBN 978-0-13-611947-0.
  7. 7.0 7.1 B. Natesan (1933). Souvenir of the sashtiabdha-poorthi of the Hon. Mr. G. A. Natesan. G. A. Natesan & Co. p. 55.
  8. Great Britain. Commercial Relations and Exports Dept (1935). India: economic and commercial conditions in India. H.M. Stationery Off. p. 76.

వెలుపలి లంకెలు మార్చు