జెమినీ గణేశన్

నటుడు

జెమినీ గణేషన్ (నవంబర్ 17, 1920 - మార్చి 22, 2005) తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి సావిత్రి భర్త. ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు. ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌ అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు[1]. మొదటిభార్య అలిమేలు. రెండో భార్య నటీమణి పుష్పవల్లి నటి రేఖ తల్లి. మూడో భార్య నటి సావిత్రి. తన 79వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు.

జెమినీ గణేశన్
జెమినీ గణేశన్
జననం
గణేశన్

(1920-11-17)1920 నవంబరు 17
మరణం2005 మార్చి 22(2005-03-22) (వయసు 84)
India పుదుక్కొట్టై, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుకదళ్ మన్నాన్, సాంబార్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1947 - 2005
జీవిత భాగస్వామిఅలమేలు, సావిత్రి, పుష్పవల్లి

నటించిన తెలుగుసినిమాలు మార్చు

మూలాలు మార్చు