టైగర్ 1979 నాటి తెలుగు యాక్షన్ చిత్రం. నవ శక్తి ఫిల్మ్స్ ఆధ్వర్యంలో పర్వతనేని నారాయణరావు నిర్మించగా, నందమూరి రమేష్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, రజనీకాంత్, రాధా సలూజా, సుభాషిణి ముఖ్యపాత్రల్లో నటించారు. సత్యం సంగీతం సమకూర్చాడు. ఇది రజనీకాంత్‌కు 50 వ చిత్రం. ఈ చిత్రం హిందీ బ్లాక్ బస్టర్ ఖూన్ పసీనా (1977) కు రీమేక్.

టైగర్
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి రమేష్
తారాగణం నందమూరి తారక రామారావు, రజనీకాంత్,
రాధా సలూజా
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ నవశక్తి పిక్చర్స్
భాష తెలుగు

కథ మార్చు

రాజా ( ఎన్.టి.రామారావు ), రషీద్ ( రజనీకాంత్ ) లు మంచి స్నేహితులు. వారి కుటుంబాలు కూడా ఎటువంటి మత భావన లేకుండా ఐక్యంగా ఉంటాయి. వారి బాల్యంలో, కోటినాగులు ( సత్యనారాయణ ) ఒక అమాయక వ్యక్తి రామదాసు ( అల్లు రామలింగయ్య ) ను చంపబోగా, రాజా తండ్రి, రషీద్ తండ్రి గ్రామస్థుల సహాయంతో రక్షిస్తారు. దానిపై పగ పెంచుకుని కోటినాగులు, తన సహచరుడు రంగా ( ప్రభాకర్ రెడ్డి ) తో కలిసి మొత్తం గ్రామానికి నిప్పంటిస్తాడు. అందులో రెండు కుటుంబాలు నాశనమౌతాయి. రాజా, రషీద్ లు విడిపోతారు. రాజాను రషీద్ తల్లి ఫాతిమా బేగం ( అంజలి దేవి ) పెంచుతుంది. కోటినాగులు దుర్మార్గాలను చూసి, అతని భార్య రుక్మిణి ( అన్నపూర్ణ ) కుమార్తె శాంతితో కలిసి ఇంటి నుండి తప్పించుకుని పాఠశాల ఉపాధ్యాయుడైన తన సోదరుడి ( గుమ్మడి ) వద్దకు వెళ్ళిపోతుంది. సంవత్సరాలు గడిచిపోతాయి, రాజా ధైర్యవంతుడుగా పెరుగుతాడు. ప్రజలు అతన్ని టైగర్ అని పిలుస్తారు. కోటినాగులుపై ప్రతీకారంతో అతడు రగిలిపోతుంటాడు. అతనిని పట్టుకోవడమే రాజా జీవితాశయం. రామదాసు సహాయంతో రాజా కోటినాగులు కోసం వెతకడం మొదలుపెడతాడు. కోటినాగులు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా జమీందార్ జగన్నాధంగా మారిపోతాడు. కాని చాటుమాటుగా అతను తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటాడు. అతనిని విడిచిపెట్టిన భార్య, బిడ్డల కోసం వెతుకుతున్నాడు. రాజా ఒక అందమైన అమ్మాయి రేఖ ( రాధా సలుజా ) ను ప్రేమిస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. రాజా తల్లి ముస్లిం అని తెలిసి రేఖ తండ్రి భూమయ్య (వంకాయల) వారి వివాహాన్ని వ్యతిరేకిస్తాడు. రాజా తల్లి మొత్తం కథను భూమయ్యకు వెల్లడిస్తుంది, అతను సంతోషంగా వారి పెళ్ళికి అంగీకరిస్తాడు.

ఇంతలో, రషీద్ సిబిఐ అధికారి అవుతాడు. కోటినాగులును పట్టుకోవడం కోసం అతన్ని ప్రభుత్వం నియమిస్తుంది. అది అతనికి సంతోషాన్నిస్తుంది. ఆ విభాగం తెలిసినంతలో కోటినాగులు 10 లక్షల విలువైన వజ్రాలను దోచుకున్న ఉస్తాద్ అనే భారీ దొంగ. కోటినాగులు భార్య రుక్మిణి, కుమార్తె శాంతి ( సుభాషిని ) వారి జీవనోపాధి కోసం టీ స్టాల్ నడుపుతూంటారు. తన ప్రయాణంలో రషీద్ శాంతితో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. జమీందారు తాను దొంగిలించిన వజ్రాల కోసం రషీద్‌ను ఆకట్టుకుంటాడు. రషీద్ అతన్ని కోటినాగులుగా గుర్తిస్తాడు. జమీందారు భార్యా పిల్లల ఫోటోలను కూడా చూసి శాంతి కోటినాగులు కుమార్తె అని అర్థం చేసుకుంటాడు. రషీద్ అతడి ముఠాను ట్రాష్ చేసి తప్పించుకుంటాడు. ఇంతలో, రాజా తనను వెతుకుతున్నాడని జమీందారు తెలుసుకుంటాడు, కాబట్టి, అతను రాజాను చంపడానికి రంగాను పంపుతాడు. రామదాసు అతన్ని కాపాడతాడు. రంగాను కోటినాగులు సహచరుడిగా గుర్తిస్తాడు. రాజా రంగాను వెంబడించి, కోటినాగులు స్థావరం లోకి వెళ్తాడు. కాని అతన్ని వారు బంధించి విద్యుత్ బోనులో ఉంచుతారు. రామదాసు తన జీవితాన్ని త్యాగం చేసి, రాజాను బోను నుండి విడుదల చేస్తాడు. చివరికి, జమీందారు మహాకలి జాతరలో దేవత వజ్రాల హారాన్ని దొంగిలించాలని యోచిస్తాడు. కాని రాజా వారి ప్రయత్నాలను సాగనివ్వడు. అదే సమయంలో, జమీందారు తన బావమరిది స్కూల్ మాస్టర్‌ను చూసి, తన భార్యా బిడ్డల గురించి చెప్పమని బెదిరిస్తాడు, అతన్ని చంపేస్తాడు. చనిపోయే ముందు, మాస్టరు తన సోదరిని, శాంతినీ కాపాడమని రాజాను అడుగుతాడు. ఇంతలో, జమీందారు ఫాతిమా, రేఖలను కిడ్నాప్ చేసి రుక్మిణి, శాంతిని తీసుకురావడానికి రంగాను పంపుతాడు. రాజా రంగాను అడ్డుకుంటాడు. కోటినాగులే స్వయంగా వచ్చి వారిని తీసుకెళ్లాలని చెప్తాడు. శాంతి రాజా అదుపులో ఉందని తెలిసి, కోపంగా ఉన్న రషీద్ అతనిపై దాడి చేయడానికి వెళ్తాడు. వారి మధ్య తీవ్రమైన ఘర్షణ తలెత్తుతుంది. ఆ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు గుర్తిస్తారు. ఇప్పుడు వారు చేతులు కలిపి కోటినాగులు, అతని ముఠా అంతు చూస్తారు. చివరగా, కుటుంబం తిరిగి కలుసుకోవడం, రాజా & రేఖ, రషీద్ & శాంతి వివాహాలతో ఈ చిత్రం సంతోషకరంగా ముగుస్తుంది.

నటవర్గం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • నృత్యాలు: సలీం
  • స్టిల్స్: పిఎల్ మూర్తి, సంగేష్
  • పోరాటాలు: సంభశివరావు
  • సంభాషణలు: విద్యా కన్నవ శ్రీ, డి.ప్రభాకర్
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: సత్యం
  • కథ: ఆర్‌కే ధర్మ రాజ్
  • చిత్రానువాదం: పి.గంగధర రావు
  • కూర్పు: ఎస్పీఎస్ వీరప్ప
  • ఛాయాగ్రహణం: ఎస్ఎస్ లాల్
  • నిర్మాత: పార్వతేనేని నారాయణరావు
  • స్క్రీన్ప్లే   - దర్శకుడు: నందమూరి రమేష్
  • బ్యానర్: నవ శక్తి ఫిల్మ్స్
  • విడుదల తేదీ: 1979 సెప్టెంబరు 5

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఆహా అంతా చూసాను"  ఎస్ పి బాలు, పి.సుశీల 3:25
2. "చూసుకున్నవాళ్ళకు"  ఎస్ పి బాలు 3:22
3. "ఏం దెబ్బ తీసావు"  ఎస్ పి బాలు, పి.సుశీల 3:23
4. "క్షణం క్షణం"  ఎస్ పి బాలు, ఎస్.జానకి 4:56
5. "మారింది కాలం"  ఎస్ పి బాలు, పి.సుశీల 3:21
6. "ఒకటి రెండు మూడు"  ఎస్ పి బాలు, పి.సుశీల 3:25
7. "ఏ తల్లి కన్నదిరా"  పి.సుశీల 3:26

మూలాలు మార్చు