డి.సి. కిజకేమూరి

భారతీయ ప్రచురణకర్త

డొమినిక్ చాకో కిజకేమూరి (1914 జనవరి 12 - 1999 జనవరి 26) కేరళకు చెందిన రచయిత, కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. అతను DC బుక్స్ అనే పుస్తక ప్రచురణ సంస్థను స్థాపించిన పుస్తక ప్రచురణకర్త కూడా.

పూర్వపు ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో పుస్తకాలపై అమ్మకపు పన్నును రద్దు చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఈ చర్య, ఆ తరువాతి కాలంలో దేశమంతటా పుస్తకాలపై అమ్మకపు పన్ను నిషేధించడంలో ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూని ప్రేరేపించింది. 1999 లో భారత ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చింది.[1] అతను తన రచనల ద్వారా, ముద్రణ, ప్రచురణ కంపెనీ, DC బుక్స్ ద్వారా, రిటైల్ ఆందోళన కరంట్ బుక్స్ అనే రిటెయిల్ దుకాణం ద్వారా మలయాళం సాహిత్య అభ్యున్నతికి కృషి చేసాడు.

జీవితం తొలి దశలో మార్చు

డొమినిక్ చాకో కిజకేమూరి 1914 జనవరి 12 న చాకో, ముమ్నాయత్ ఎలియమ్మ లకు పూర్వపు ట్రావన్కోర్ రాజ్యంలోని కంజిరప్పల్లిలో జన్మించాడు.

అతను 16 సంవత్సరాల వయస్సులో కంజిరపల్లిలో ఉపాధ్యాయునిగా వృత్తి జీవితం ప్రారంభించాడు. ఆయనను అప్పుడు 'కొచ్చుసార్' అంటే 'చిన్న గురువు' అని పిలిచేవారు. తరువాత అతను చంగనస్సేరి నుండి ఉపాద్యాయ శిక్షణలో ఉత్తీర్ణుడై, మరో 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

ఆ సమయంలో, అతను భారత స్వాతంత్ర్య పోరాటం వైపు ఆకర్షితుడై, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 1937 నాటికి, అతను కాంగ్రెసులో క్రియాశీల సభ్యుడయ్యాడు. KJ థామస్‌తో అనేక స్వాతంత్ర్య పోరాట సమావేశాలను నిర్వహించాడు. 2001లో, అతనికి నివాళిగా DC కిజకేమూరి ఫౌండేషన్ (DCKF) ను స్థాపించారు.

DC బుక్స్ మార్చు

DC బుక్స్ [2] భారతదేశంలోని కేరళలోని కొట్టాయంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రచురణ సంస్థ, పుస్తక విక్రేత. ఇది 6,500 పైచిలుకు పుస్తకాలను ప్రచురించింది. ప్రధానంగా మలయాళంలో సాహిత్యం, పిల్లల సాహిత్యం, కవిత్వం, సూచన, జీవిత చరిత్ర, స్వయం-సహాయం, యోగా, నిర్వహణ వంటి అంశాలపై పుస్తకాలతో పాటు విదేశీ అనువాదాలను కూడా ప్రచురిస్తుంది. కేరళలో 70% పుస్తకాలను ఇదే పంపిణీ చేస్తుంది.

అయితే, DC కిజాకెమూరి జీవితం పుస్తకాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. అతను తన స్నేహితులు పొన్‌కున్నం వర్కీ, పిటి చాకో, కెజె థామస్‌లతో కలిసి కొట్టాయంలో నేషనల్ బుక్ స్టాల్ అనే పుస్తక దుకాణాన్ని ప్రారంభించాడు. ఆ వెంటనే డిసి కిజకేమూరి ఎంపి పాల్, కరూర్ నీలకంఠ పిళ్లైతో కలిసి సాహిత్య ప్రవర్తక కో-ఆపరేటివ్ సొసైటీ (ఎస్‌పిసిఎస్) ని ప్రారంభించారు. ఈ సమాజం ఆసియాలోనే మొదటిది. SPCS మలయాళంలో అత్యుత్తమ రచనలను ప్రచురించింది. రచయితల సంక్షేమానికి కృషి చేసింది.

1949లో, NBS, SPCS లు చేతులు కలిపాయి. DC కిజకేమూరి నాయకత్వంలో ఈ విలీనం మలయాళ ప్రచురణ రంగంలో కొత్త యుగానికి నాంది పలికింది. అప్పటి వరకు అది చాలా దుర్భర స్థితిలో ఉండేది. NBS నెట్‌వర్క్ కేరళలోని అన్ని జిల్లాలను కవర్ చేసింది. SPCS అతిపెద్ద ప్రచురణకర్తగా అవతరించింది.

మూలాలు మార్చు

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
  2. dcbooks.com