తుంగ నది కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది గంగమూల వద్ద పడమటి కనుమల లోని వరాహ పర్వతంపై పుట్టి చిక్క మగళూరు, షిమోగా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. తరువాత తూర్పుగా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నది నీరు స్వచ్ఛంగా తాగేందుకు మధురంగా ఉంటుందని చెబుతూ "గంగా స్నానం తుంగా పానం" అనే సామెత ఉంది.

తుంగ నది
తీర్థహళ్ళి వద్ద తుంగ నది
స్థానం
దేశంభారత దేశం
రాష్ట్రంకర్ణాటక
భౌతిక లక్షణాలు
మూలంగంగ మూల
 • స్థానంచిక్కమగళూరు జిల్లా, కర్ణాటక
సముద్రాన్ని చేరే ప్రదేశంతుంగభద్ర
 • స్థానం
కూడ్లి, భద్రావతి, కర్ణాటక
పొడవు147 km (91 mi)approx.

గజనూరు వద్ద ఈ నదిపై ఒక ఆనకట్ట ఉంది. ఇది తుంగభద్ర నదిలో సంగమించాక, ఆ నదిపై హోస్పేట వద్ద ఒక పెద్ద ఆనకట్ట ఉంది.

పవిత్ర ప్రదేశాలు మార్చు

 
గర్భిణీ[permanent dead link] కప్పకు కాపలాగా ఉన్న పాము - తుంగ నది ఒడ్డున శృంగేరి వద్ద శిల్పం

శృంగేరి వద్ద తుంగ నది ఒడ్డున చాలా దేవాలయాలున్నాయి. వానిలో శారదా పీఠం, విద్యాశంకరాలయం ప్రముఖమైనవి.

"https://te.wikipedia.org/w/index.php?title=తుంగ_నది&oldid=2970858" నుండి వెలికితీశారు