ద్రావిడ నిర్మాణం

దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన నిర్మాణ శైలి ద్రావిడ నిర్మాణం. ద్రావిడ భాషలు మాట్లాడే ద్రావిడ ప్రజలు ఈ నిర్మాణాలను నిర్మించడం వలన వీటిని ద్రావిడ నిర్మాణాలు అని పిలుస్తున్నారు. ఇవి ప్రధానంగా పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉన్న దేవాలయాలు, తమిళంలో వీటిని కోవెలలు అంటారు. కఠినమైన రాతి శిలలను చెక్కి దేవాలయ రూపాన్ని సృష్టించడానికి ఈ నిర్మాణాలలో అనేక దేవతల, యోధుల, రాజుల, నర్తకుల విగ్రహాలను పొందు పరిచారు. పురాతన పుస్తకం వాస్తు శాస్త్ర లో దేవాలయ నిర్మాణం మూడు శైలులు ఒకటిగా చెప్పబడింది, ఇది ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో ప్రారంభమైంది. ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలో అధిక భాగం నిర్మాణాలు ఉన్నాయి. అనేక ఇతరులతో పాటు చోళులు, చేర, పాండ్య, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, హోయసలులు, విజయనగర సామ్రాజ్యం వివిధ రాజ్యాలు, సామ్రాజ్యాలు కాలక్రమంలో ద్రావిడ నిర్మాణకళావికాసానికి విశేష కృషి చేశారు. ఇంకా ద్రావిడ శైలి నిర్మాణం ఉత్తర భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేయ ఆసియా వివిధ భాగాలను వివిధ ప్రాంతాల్లో చూడవచ్చు. కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్, ఇండోనేషియాలోని ప్రాంబనాన్ ప్రారంభ ద్రావిడ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు.

తమిళనాడులోని మీనాక్షి ఆలయం యొక్క వైమానిక దృశ్యం. ఇది దక్షిణ గోపురం పై నుండి ఉత్తరం వైపు కనిపించే దృశ్యం

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు