నాసిరుద్దౌలా

(నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV నుండి దారిమార్పు చెందింది)

నాసిర్-ఉద్-దౌలా ( 1794 ఏప్రిల్ 25 - 1857 మే 16) బ్రిటిషు ఇండియా లోని రాచరిక రాష్ట్రమైన హైదరాబాదుకు‌ చెందిన నిజాం. 1829 మే 24 నుండి 1857 లో మరణించే వరకు అతడు పరిపాలించాడు. అతని అసలు పేరు మీర్ ఫర్కుందా అలీ ఖాన్

నాసిరుద్దౌలా
నిజాం ఉల్ ముల్క్
నాసిరుద్దౌలా
నాసిరుద్దౌలా
హైదరాబాదు నిజాం
Reign1829 మే 24 – 1857 మే 16
Coronation1829 మే 24, చౌమహల్లా పాలెస్ లో
Predecessorసికందర్ జా
Successorఅఫ్జలుద్దౌలా
జననంమీర్ ఫర్కుందా ఆలీ ఖాన్
(1794-04-25)1794 ఏప్రిల్ 25
బీదర్
మరణం1857 మే 16(1857-05-16) (వయసు 63)
Burial
మక్కా మసీదు, హైదరాబాదు
బేగందిల్వరున్నీసా బేగం
Issue
Houseఆసఫ్ జాహి
తండ్రిసికందర్ జా
తల్లిఫజిలతున్నీసా బేగం
మతంఇస్లాం

నిజాం సికందర్ జా, ఫజిలతున్నీసా బేగం దంపతులకు ఫర్కుందా అలీ ఖాన్‌ జన్మించాడు. నాసిర్-ఉద్-దౌలా పేరుతో 1829 లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతను ఆర్థికంగా బలహీనమైన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అతని అభ్యర్థన మేరకు, లార్డ్ విలియం బెంటింక్ యూరోపియన్ పౌర విభాగాల సూపరింటెండెంట్లందరినీ ఉపసంహరించుకున్నాడు. నిజాం వ్యవహారాల్లో జోక్యం చేసుకోని విధానాన్ని అనుసరించాడు. నిజాం 1846 లో హైదరాబాద్ మెడికల్ స్కూల్ను స్థాపించాడు. అతను అరబ్బులు, రోహిల్లాల వద్ద అనేక అప్పులు చేసాడు. బ్రిటిషు వారికి పెద్ద ఎత్తున అప్పులు తీర్చలేక 1853 లో గవర్నర్ జనరల్, డల్హౌసీ నేతృత్వం లోని బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని అప్పులన్నింటినీ రద్దు చేసినందుకు ప్రతిఫలంగా తన భూభాగంలో కొంత భాగాన్ని బ్రిటిషు వారికి హస్తగతం చేసాడు.

బాల్యం మార్చు

మీర్ ఫర్కుందా అలీ ఖాన్‌ 1794 ఏప్రిల్ 25 న కర్ణాటకలోని బీదర్‌లో జన్మించాడు. అతను నిజాం సికందర్ జా పెద్ద కుమారుడు. నాసిర్-ఉద్-దౌలా తల్లి ఫజిలతున్నీసా బేగం, అతని తండ్రికి ఇష్టమైన భార్య. [1] [2] [3] నిజాంలు బ్రిటిషు ఇండియాలో అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్ పాలకులు.

పాలన మార్చు

నాసిర్-ఉద్-దౌలా తండ్రి నిజాం సికందర్ జా 1829 మే 21 న మరణించాడు. [4] మే 24 న, అతను హైదరాబాద్ సింహాసనాన్ని అధిష్టించాడు. [1] అసిస్టెంట్ రెవెన్యూ మంత్రి మహారాజా చందూ లాల్ చేసిన అవకతవకల కారణంగా, నాసిరుద్దౌలా గద్దె నెక్కేనాటికి రాజ్యం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. [5]

సింహాసనాన్ని అధిరోహించిన తరువాత, బహుశా మహారాజా చందు లాల్ సలహా మేరకు, నాసిర్-ఉద్-దౌలా హైదరాబాద్ రెసిడెంటైన సర్ చార్లెస్ మెట్‌కాఫ్, తన రాజ్యపు పౌర ప్రయోజన విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకొమ్మని ఆదేశించాలని భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్‌ను కోరాడు. గవర్నర్ జనరల్ సానుకూలంగా స్పందించి, పౌర విభాగాల్లో ఉన్న యూరోపియన్ సూపరింటెండెంట్లను తొలగించాడు. [6] అతడి పాలనా కాలమంతా, బెంటింక్ రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోని విధానాన్నే అనుసరించాడు. [7]

రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నాసిర్-ఉద్-దౌలా తన సైన్యానికి జీతాలు ఇవ్వడం కష్టమైంది. ఉండే కొద్దీ బ్రిటిషు వారికి తీర్చాల్సిన అప్పు పెరిగిపోతూ పోయింది. [8] అతను తన రాజ్యంలోని కొన్ని భాగాలను అరబ్బులు, రోహిల్లాలకూ తనఖా పెట్టాడు. చిన్న జాగీర్దార్లు (భూస్వాములు) కూడా తమ ఎస్టేట్లను తనఖా పెట్టారు. ఫలితంగా, ఈ అప్పులిచ్చినవాళ్ళు భీడ్, ఉస్మానాబాద్ జిల్లాల్లోని భాగాలతో సహా రాజ్యంలోని ముఖ్యమైన భాగాలను నియంత్రణలో పెట్టుకున్నారు. దీంతో జమీందార్లు (కులీనులు), పెద్ద జాగీర్దార్ల అహంకారం పెరిగిపోయింది. హింగోలి జిల్లాలో, రెసిడెంట్ ఒక తిరుగుబాటును అణిచివేసేందుకు దళాలను పంపవలసి వచ్చింది. [9]

సమకాలీన రికార్డుల ప్రకారం, నాసిర్-ఉద్-దౌలా పాలనలో దారి దోపిడీలు, దోపిడీ, హత్యలు, భూ కబ్జాలూ పెరిగాయి. లంచం, అవినీతి సర్వసాధారణమైంది. జమీందార్లు కూలీలను దోచుకున్నారు. [9] నిజాం మంత్రి ఫాతుల్లా ఖాన్ మాట్లాడుతూ బ్రిటిషు అధికారులను ఉపసంహరించడం వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పాడు. [10]

1835 లో, ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు ఎదురు తిరిగారు. హైదరాబాద్ రాష్ట్రంలో శాంతిభద్రతల విచ్ఛిన్నమయ్యాయని, ఈ దుశ్చర్యలను విస్మరించలేమనీ బ్రిటిషు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రతిస్పందనగా, నాసిర్-ఉద్-దౌలా రెవెన్యూ అధికారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, వారి దమనకాండను అణచివేయడానికీ, న్యాయాన్ని నెలకొల్పేందుకూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను రహస్య సేవకులుగా నియమించాడు. అయితే, ఈ సేవకులు తక్కువ ర్యాంక్ కలిగిన నిరక్షరాస్యులైన మన్సబ్దార్లు (సైనికాధికారులు) కావడంతో, ఈ వ్యవస్థ విఫలమైంది. ఈ సేవకులు తాలూక్దార్ల ఏజెంట్లుగా మారి ప్రైవేటు వ్యక్తుల నుండి డబ్బును దోచుకోవడం మొదలుపెట్టారు. [7] [11] నాలుగు సంవత్సరాల తరువాత, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మళ్ళీ ఇలాంటిదే ఇంకో లేఖ రాశారు. [12]

నాసిర్-ఉద్-దౌలా తమ్ముడు, ముబారెజ్-ఉద్-దౌలా భారతదేశంలోని వహాబీ ఉద్యమంతో ప్రేరణ పొందాడు. అతను దేశంలో బ్రిటిషు ఉనికిని అసహ్యించుకున్నాడు. వారినీ, నిజాంనూ పడగొట్టాలని అనుకున్నాడు. అతను కర్నూలు నవాబు అయిన రసూల్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్ రెసిడెంటు జేమ్స్ స్టూవర్ట్ ఫ్రేజర్, తన ఏజెంట్ల సహాయంతో వారి ప్రణాళికలను అడ్డుకున్నాడు. ముబారెజ్-ఉద్-దౌలా, నాసిర్-ఉద్-దౌలాపై కుట్ర చేసాడని ఆరోపించాడు. 1839 జూన్ 15 న, ముబారెజ్-ఉద్-దౌలా ప్యాలెస్‌పై దాడి చేయాలని నాసిర్-ఉద్-దౌలా ఆదేశించాడు, తద్వారా ముబారెజ్-ఉద్-దౌలాను అరెస్టు చేసి గోల్కొండ కోటలో ఉంచాడు. అతను 1854 లో మరణించే వరకు జైల్లోనే ఉన్నాడు. [13]

ప్రధాన మంత్రి సిరాజ్-ఉల్-ముల్క్ (1853 లో ఆయన మరణించే వరకు), తదుపరి ప్రధాన మంత్రి సాలార్ జంగ్ I యొక్క మార్గదర్శకత్వంలో, నాసిర్-ఉద్-దౌలా ఆధునిక రెవెన్యూ పరిపాలన వ్యవస్థను స్థాపించాడు. [14] [15] రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించాడు. దీన్ని పౌర పరిపాలనకు బాధ్యత వహించే తాలూక్దార్ నిర్వహిస్తాడు.[14] 1846 లో, నాసిర్-ఉద్-దౌలా హైదరాబాద్ మెడికల్ స్కూల్‌ను స్థాపించాడు. దీనిని ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీగా పిలుస్తారు. అతను వైద్య రంగంలో పురుషులు, మహిళలు ఇద్దరినీ నియమించటానికి ఆసక్తి చూపించాడు.

1850 డిసెంబరు 31 నాటికి నాసిర్ ఉద్-దౌలా బ్రిటిషు వారికి తీర్చాల్సిన అప్పులు ₹ 70 లక్షలకు చేరుకుంది. 1852 మధ్య నాటికి, అతను తన సొంత అధికారులకు జీతాలు చెల్లించడం కష్టమైంది. [16] 1853 లో, గవర్నర్ జనరల్ ది ఎర్ల్ ఆఫ్ డల్హౌసీ పాలనలో, బ్రిటిషు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం, బేరార్ ప్రావిన్స్‌ను బ్రిటిషు వారికి అప్పజెప్పాడు. బదులుగా బ్రిటిషు వారు అతడి అప్పులను రద్దు చేయడానికి అంగీకరించారు. [17]  బ్రిటిషు వారు నిజాం అధికారుల జీతాలు కూడా చెల్లించారు. [17] 

వ్యక్తిగతం మార్చు

నాసిర్-ఉద్-దౌలాకు ఇద్దరు నిక్కా భార్యలు ఉన్నారు. అతని మొదటి భార్య దిల్వరున్నిసా బేగం, అతని దర్బారులోని అధికారి కుమార్తె. అతని రెండవ భార్య తన ప్యాలెస్‌లో పనిచేసే దిగువ స్థాయి అధికారి కుమార్తె. అతడికి ఇద్దరు కుమారులున్నారు. 1827 అక్టోబరులో జన్మించిన అఫ్జల్-ఉద్-దౌలా, దిల్వరున్నిసా బేగానికి పుట్టిన కుమారుడు. రెండవ కుమారుడు రోషన్-ఉద్-దౌలా, 1828 మార్చి న రెండవ భార్యకు జన్మించాడు. [17]

1857 మే 16 న, నాసిర్-ఉద్-దౌలా మరణించాడు. అతన్ని మక్కా మసీదులో ఖననం చేశారు. [18]  అతని తరువాత అతని కుమారుడు అఫ్జల్-ఉద్-దౌలా హైదరాబాదుకు ఐదవ నిజాంగా గద్దెనెక్కాడు. [19]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Briggs 2007, p. 104.
  2. Prema Kasturi; Chitra Madhavan (2007). South India heritage: An introduction. East West Books. p. 163. ISBN 9788188661640. Mir Farkhunda Ali Khan (1829-1857) Mir Farkhanda Ali Khan Nusir-ud-Daulu was born in Bidar on 25th April 1794. He was the eldest son of Sikander Jah and after his father's death he succeeded him on 23rd May 1829. During the reign of his father, a number of British officers were employed in several civil services. He continued in the footsteps of his father.
  3. Chandraiah, K. (1998). Hyderabad, 400 Glorious Years. K. Chandraiah Memorial Trust. p. 233. The Nizam permits Chandini Begum entitled Fazilat-unnisa Begum, the mother of Mubarizuddaula to visit the Golkonda Fort
  4. Briggs 2007, p. 100.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Outlook అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Briggs 2007, pp. 96, 105, 307.
  7. 7.0 7.1 Briggs 2007, p. 106.
  8. Kate 1987, p. 35.
  9. 9.0 9.1 Kate 1987, p. 36.
  10. Kate 1987, p. 37.
  11. Briggs 2007, p. 107.
  12. Briggs 2007, p. 108.
  13. Mallampalli 2017, p. 66.
  14. 14.0 14.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Outlook2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  15. Gribble, J. D. E. History of the Deccan: Volume Two. India: Mittal Publications. pp. 234–235.
  16. Briggs 2007, p. 113.
  17. 17.0 17.1 17.2 Briggs 2007, p. 114.
  18. Sarojini Regani (1988). Nizam-British Relations, 1724–1857. Concept Publishing Company. p. 300.
  19. Kate 1987, p. 38.