పాతూరి రాజగోపాల నాయుడు

పాతూరి రాజగోపాల నాయుడు (1920 ఏప్రిల్ 5 – 1997 సెప్టెంబరు 21) ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త, రచయిత.[1] ఈయనను రాజన్న అని కూడా అంటారు.

పాతూరి రాజగోపాలనాయుడు
జననం(1920-04-05)1920 ఏప్రిల్ 5
మరణం1997 సెప్టెంబరు 21(1997-09-21) (వయసు 77)
వృత్తిరాజకీయ నాయకుడు, రచయిత
పిల్లలుగల్లా అరుణకుమారి

రాజకీయ జీవితం మార్చు

రాజన్న స్వతంత్ర పార్టీ తరపున చిత్తూరు నియోజక వర్గము నుండి వరుసగా రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 6 వ లోక్ సభకు 1977-1980 మధ్య కాలంలోనూ, 7 వ లోక్ సభకు 1980-1984 మధ్య కాలంలో వీరు పార్లమెంటు సభ్యునిగా వ్యవహరించారు.

సంతానము మార్చు

ఈయన కుమార్తె గల్లా అరుణ కుమారి కూడా రాజకీయ నాయకురాలే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించింది. ఈమె వ్యాపారవేత్త గల్లా రామచంద్ర నాయుడుని వివాహమాడింది. వీరి కుమారుడు గల్లా జయదేవ్ కూడా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.

రచనలు మార్చు

ఛత్రపతి శివాజీ, రామానుజం ప్రతిజ్ఞ, కురుక్షేత్రం, సారాసీసా (నాటకం), కూలోళ్ళు, తమసోమా, చంద్రగిరి దుర్గం, ఓరుగల్లు పీఠం, అనార్కలి, జేజవ్వ (నాటకం), లకుమ (అనువాదం)

మూలాలు మార్చు

  1. Parliamentary career: http://rajyasabha.nic.in/photo/princets/p16.html Archived 2 ఏప్రిల్ 2015 at the Wayback Machine