పీపుల్స్ ఎన్‌కౌంటర్

మోహనగాంధీ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం

పీపుల్స్ ఎన్‌కౌంటర్ 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మోహనగాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, భానుప్రియ, శ్రీకాంత్, యమున తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అదించాడు.[1]

పీపుల్స్ ఎన్‌కౌంటర్
దర్శకత్వంమోహనగాంధీ
రచనపరుచూరి బ్రదర్
నిర్మాతరామోజీరావు
తారాగణంవినోద్ కుమార్,
భానుప్రియ,
శ్రీకాంత్
ఛాయాగ్రహణంప్రసాద్ బాబు
కూర్పుగౌతంరాజు
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1991 (1991)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

వెనుకబడిన ప్రజలకు న్యాయం చేయడంకోసం పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్ల్యుజి), ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా సైన్యం పోరాటం చేస్తుంది. పీపుల్స్ వార్ గ్రూప్, ప్రభుత్వం మధ్య జరిగిన పోరాటం, సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.

క్రమ సంఖ్య పాటపేరు గాయకులు నిడివి
1 "ఈ నేల మనదిరా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ 04:41
2 "లాల్ సలాం" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 05:14
3 "ముక్కలైన రెక్కలతో" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 04:37
4 "పిండు కుంటే తీపంటా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ 04:39
5 "పొట్ట కూటి కోసం పోలీసన్న" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 02:13
6 "రీ రీ నక్సల్బరి" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. కీరవాణి 01:53
7 "శివ శివ మూర్తివి గణనాధ" జిక్కి 04:30
8 నరదహనం పురదహనం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 04:12

మూలాలు మార్చు

  1. "Interview with Srikanth". idlebrain.com. 28 September 2009. Archived from the original on 15 December 2019. Retrieved 28 July 2020.

ఇతర లంకెలు మార్చు