పెదనందిపాడు

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా గ్రామం

పెదనందిపాడు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని గ్రామం. ఇది సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1755 ఇళ్లతో, 6090 జనాభాతో 1390 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3044, ఆడవారి సంఖ్య 3046. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1311 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 127. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590339.[1]

పెదనందిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
పెదనందిపాడు is located in Andhra Pradesh
పెదనందిపాడు
పెదనందిపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′18″N 80°19′45″E / 16.071785°N 80.329210°E / 16.071785; 80.329210
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదనందిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కొలగాని కోటేశ్వర రావు
జనాభా (2001)
 - మొత్తం 6,156
 - పురుషుల సంఖ్య 3,115
 - స్త్రీల సంఖ్య 3,041
 - గృహాల సంఖ్య 1,546
పిన్ కోడ్ 522235
ఎస్.టి.డి కోడ్ 08643

గ్రామ గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6156. ఇందులో పురుషుల సంఖ్య 3115, స్త్రీల సంఖ్య 3041, గ్రామంలో నివాస గృహాలు 1546 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1390 హెక్టారులు.

గ్రామ చరిత్ర మార్చు

  • స్వాతంత్ర్యోద్యమంలో పెదనందిపాడు పన్నుల వ్యతిరేఖ ఉద్యమం ద్వారా ఖ్యాతికెక్కింది. దీనికి కొండా వెంకటప్పయ్య మరి కొందరు నాయకత్వం వహించారు.
  • సీనియర్ ఆడిటర్ ఇన్ డిఫెన్స్ ఫైనాన్స్ శ్రీ నూతి శేషగిరిరావవు, పెదనందిపాడు చరిత్ర అను పుస్తకం రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం, 2014, డిసెంబరు-25వ తేదీనాడు, స్థానిక ఆర్ట్స్ & సైన్స్ కలాశాలలో నిర్వహించెదరు.

సమీప గ్రామాలు మార్చు

ఈ గ్రామానికి సరిహద్దులలో అన్నపర్రు, పాలపర్రు, వరగాణి, కొమ్మూరు, అన్నవరం ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.

సమీప ఇంజనీరింగ్ కళాశాల కుర్నూతలలో ఉంది. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

పెదనందిపాడు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మార్చు

ఈ గ్రామవాసులైన శ్రీ చెంచు బాపనయ్య, గ్రామంలో కళాశాల ఏర్పాటుకు అప్పట్లోనే, తన పొలం అమ్మి రు.10,000 విరాళంగా అందజేశారు. వీరు 2/2014లో కాలధర్మం చెందినారు.

ఈ కళాశాలలో అధ్యాపకులుగా పనిచెయుచున్న వెంకటస్వామి, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. వెంకటస్వామి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

ఈ పాఠశాలలో ప్రస్తుతం 310 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల మార్చు

ఈ పాఠశాల స్థానిక ఎస్.సి.కాలనీలో ఉంది.

లయన్ మాంటిస్సోరి పాఠశాల మార్చు

ఈ పాఠశాల స్థానిక పెదనందిపాడు, బాపట్ల రహదారి పక్కన ఉంది.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

పెదనందిపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

పెదనందిపాడులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

శ్రీ కొల్లా వెంకయ్య మెమోరియల్ గ్రంథాలయంలో 2014, ఆగస్టు 10 న, "పుస్తకాలు పిలుస్తున్నాయి" అను కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ ప్రముఖులు మార్చు

  • కొల్లా వెంకయ్య: (1910 - 1997):1910 జూలై 14న పెదనందిపాడు గ్రామంలో కొల్లా కృష్ణయ్య, రత్తమ్మలకు జన్మించాడు[2]. స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంట్ సభ్యునిగా, శాసన సభ్యునిగాపనిచేసిన ప్రముఖ కమ్యునిస్ట్ నాయకుడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు.
  • లావు రత్తయ్య - విజ్ఞాన విద్యాసంస్థల వ్యవస్థాపకుడు
  • లావు నాగేశ్వరరావు: ఈ గ్రామానికి చెందిన లావు నాగేశ్వరరావు, ఢిల్లీలో సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇతను తన స్వగ్రామమైన పెదనందిపాడు గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అన్ని విధాలా అభివృద్ధిపరచడానికై దత్తత తీసికొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇతను ఇంతకుముందే గ్రామంలో చాలా అభివృద్ధిపనులు చేపట్టాడు.ఈ గ్రామములో 1957, జూన్-8న జన్మించిన ఇతను, గుంటూరులో న్యాయవిద్యనభ్యసించి, అక్కడే 1982లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. కొంతకాలం అనంతరం,హైదరాబాదు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసారు. 1995 నుండి 2014 వరకు సుప్రీంకోర్టులో రెండుసార్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేసాడు. ఇతను 2016, మే-13వ తేదీ శుక్రవారంనాడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసారు.
  • లావుశ్రీ కృష్ణ దేవరాయలు: ( జననం 1983 ఏప్రిల్ 29) ఒక భారతీయ రాజకీయ నాయకుడు 17వ లోక్ సభ సభ్యునిగా పనిచేస్తున్నాడు. అతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట నియోజకవర్గం నుండి 2019 భారత జాతీయ ఎన్నికలలో పోటీ చేసి గెలిచాడు. అతను విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇది ఒక ప్రధాన విశ్వవిద్యాలయం .

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 21 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

పెదనందిపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 207 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 2 హెక్టార్లు
  • బంజరు భూమి: 106 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1070 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 937 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 239 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

పెదనందిపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 48 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 191 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

పెదనందిపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

ప్రత్తి, మిరప

సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

ఓగేరు వాగుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం మార్చు

పెదనందిపాడులో ఇటీవల జిల్లాలోకే పెద్దదయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని, 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ పథకం ద్వారా పెదనందిపాడు, కాకుమాను మండలాలోని 9,013 ఎకరాలకు సాగునీరు అందించెదరు. [15]

గ్రామ పంచాయతీ మార్చు

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొలగాని కోటేశ్వర రావు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా కొత్త శ్రీధర్ ఎన్నికైనాడు.
  • ఈ పంచాయతీ 87వ వార్షికోత్సవం 2016, ఫిబ్రవరి-14వ తేదీనాడు నిర్వహించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

ఈ గ్రామంలో పంచాలయాలు ఉన్నాయి. అక్కడ నిత్య పూజలు జరుగుచున్నవి. ఆ ఆలయాల పేర్లు:-

  • శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.
  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 15వ వార్షికోత్సవం, 2014, జూన్-16 నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దినారు. ఆ రోజున ప్రత్యేకపూజలు, నిర్మలోదక మంగళస్నానం, 108 మంది భక్తులచే సామూహిక పూర్ణకుంభ జలాభిషేకం, 54 మంది దంపతులచే సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించెదరు. సాయంత్రం సంధ్యాహారతి, పల్లకీ మహోత్సవం నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు.
  • శ్రీ కోదండరామాలయం:- ఈ ఆలయంలో 2014, మే-30 శుక్రవారం నాడు, ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. భక్తుల భజనలు వీనుల విందుగా కొనసాగాయి. అనంతరం భక్తులకు ప్రసాదాల పంపిణీ చేసారు.
  • శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయాన్ని 1970 లో పునరుద్ధరించారు. అప్పటినుండి ఆలయం భక్తుల ఆదరణకు నోచుకుంటున్నది. గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించుచున్నారు. ఆనాటి నుండి ఇక్కడ దేవీనవరాత్రులు నిర్వహించారు.
  • శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో బహుళ పక్షంలో (మే నెలలో), అమ్మవారి తిరునాళ్ళు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసెదరు. మహిళలు పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలతో విద్యుత్తు ప్రభలను ఊరేగించారు. ఈ ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో గ్రామస్థులేగాక, పరిసర గ్రామాలనుండి గూడా భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
  • శ్రీ వీర్లంకమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఆలయంలో, 2014, ఆగస్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి కొలువులను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. పొంగళ్ళు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుదీపాలతో అందంగా అలంకరించారు. భజనలు చేసారు.

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 135

వెలుపలి లంకెలు మార్చు