?పోఖ్రాన్
రాజస్థాన్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 233 మీ (764 అడుగులు)
జిల్లా (లు) జైసల్మేర్ జిల్లా జిల్లా
జనాభా 19,186 (2001 నాటికి)

పోఖ్రాన్ (ఆంగ్లం : Pokhran) లేదా పోకరాన్, రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా లోని, ఒక పట్టణం, పురపాలక సంఘం . ఇది థార్ ఎడారి ప్రాంతంలో ఉంది. భారత్ తన మొదటి అణుపరీక్ష ఇక్కడనే చేపట్టింది.

భూగోళికం మార్చు

పోఖ్రాన్ 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92 న ఉంది.[1] దీని సరాసరి ఎత్తు 233 మీటరులు (764 అడుగులు) రాళ్ళతో చుట్టబడిన ఇసుక ప్రాంతం. పోఖ్రాన్ అనగా 'ఐదు ఎండమావులు'. జోధ్‌పూరు నుండి జైసల్మేరు, బికనేరు నుండి జైసల్మేరు పోయే మార్గం మధ్యన పోఖ్రాన్ ఉంది.

జనగణన మార్చు

2001 గణాంకాల ప్రకారం,[2] పోఖ్రాన్ పట్టణ జనాభా 19,186,అందులో పురుషులు 55%, స్త్రీలు 45%. అక్షరాస్యత సరాసరి 56%, జాతీయ సరాసరి 59.5% కంటే తక్కువగా ఉంది. అక్షరాస్యత పురుషులలో 68%, స్త్రీలలో 41%. పోఖ్రాన్ లో 19% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారు ఉన్నారు.

అణు పరీక్ష ప్రదేశం మార్చు

1972 సెప్టెంబరు 7 న, పోఖ్రాన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ భాభా అణు పరిశోధనా సంస్థ (B.A.R.C) ట్రాంబేకు, భారత్ లో తయారైన అణు పరికరాన్ని పరీక్ష చేయడానికి అధికారాలు ఇచ్చింది. మే 18 1974 న భారత్ తన మొదటి అణుపరీక్ష చేపట్టింది. 1998 మే 11 నుండి మే 13 వరకు ఐదు అణుపరీక్షలు చేపట్టింది. ఆ తరువాత పరీక్షలకు నిషేధం ప్రకటించింది.

మూలాలు మార్చు

  1. "Falling Rain Genomics, Inc. - Map and weather data for Pokhran".
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పోఖ్రాన్&oldid=3834180" నుండి వెలికితీశారు