ప్రజా భవన్, హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసం
(ప్రగతి భవన్, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)

జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసం. ఇది హైదరాబాదులోని పంజాగుట్టలో ఉంది.[1] భారతదేశంలో పేరొందిన వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ భవనం రూపొందించబడింది.[2]

జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్
జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్
సాధారణ సమాచారం
నిర్మాణ శైలినియోక్లాసికల్, పల్లాడియన్
చిరునామాగ్రీన్ లాండ్స్ రోడ్డు, పంజాగుట్ట
హైదరాబాదు 500 082
తెలంగాణ, భారతదేశం
ప్రస్తుత వినియోగదారులుఅనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి
నిర్మాణ ప్రారంభంమార్చి 2016
పూర్తి చేయబడినది23 నవంబరు 2016; 7 సంవత్సరాల క్రితం (2016-11-23)
వ్యయం38 కోట్ల రూపాయలు
(US$5.4 మిలియన్)
క్లయింట్తెలంగాణ ప్రభుత్వం
సాంకేతిక విషయములు
పరిమాణం9 ఎకరాలు (3.6 హెక్టార్లు)
నేల వైశాల్యం100,000 sq ft (9,300 m2)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిహఫీజ్ కాంట్రాక్టర్
ఇంజనీరుషాపూర్జీ పల్లోంజి

చరిత్ర మార్చు

తెలంగాణ ముఖ్యమంత్రి విధుల నిర్వాహణకోసం ఈ నూతన భవనం నిర్మించబడింది. అంతకుముందు ఈ ప్రదేశంలో పదిమంది ఐఏఏస్ అధికారులు, ఇరవైనాలుగు ఇతర అధికారుల క్వార్టర్స్ ను తొలగించి నూతన భవనాన్ని నిర్మించి, దానికి ప్రగతి భవన్ అనే పేరు పెట్టారు. 2016, నవంబరు 23న ఉదయం గం. 5.22 ని.లకు చినజీయర్ స్వామి సమక్షంలో సాంప్రదాయ ఆచారాలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లోకి గృహప్రవేశం చేశాడు.

2023 డిసెంబరులో జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ గా పేరు మార్చబడింది.

 
2022లో జనహితలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఇతరులు

నిర్మాణం మార్చు

నియోక్లాసికల్ & పల్లాడియన్ శైలిలో భారతీయ వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన ఈ భవనం బ్రిటీషు రెసిడెన్సీ, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రాత్మక భవంతుల నిర్మాణాన్ని పోలివుంటుంది. దీని నిర్మాణాన్ని వాస్తుశిల్పి సుద్దాల సుధాకర్ తేజ పర్యవేక్షించాడు.[3][4]

2016, మార్చిలో జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ భవన్ నిర్మాణం ప్రారంభించబడి 38కోట్ల రూపాయలతో ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి అనే నిర్మాణ సంస్థ నేతృత్వంలో రాత్రి పగలు 200మంది కార్మికులు పనిచేయగా తొమ్మిది నెలల్లో 2016, నవంబరులో పూర్తయింది. ఈ భవన్ ముందుభాగంలో పెద్దపెద్ద స్తంభాలతో పొడవైన వరండా ఉంది. ఆ వరండా దాటి లోపలికి వెళ్ళకా లోపలిభాగంలో విశాలమైన గదులు ఉన్నాయి.

భవన సముదాయం మార్చు

9 ఎకరాల (3.64 హెక్టార్ల) భూభాగంలో తూర్పుముఖంగా 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ సముదాయం నిర్మించబడింది. ఈ నూతన భవనంలోకి నార్త్ ఈస్ట్ మూలలో ప్రధాన ద్వారం ఉంది. ఇందులో మూడు భవనాలు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో అమర్చబడి ఉన్నాయి. ఈ భవనాలకు సమీపంలో మైసమ్మ ఆలయం ఉంది. దశాబ్దాల కాలంనాటి ఆలయం కూడా ఒక కొత్త స్థానంలో పునర్నిర్మించబడింది.[5] ఇందులో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత (సమావేశ మందిరం), మాజీ ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయాలుగా విభజించబడ్డాయి.[6][7]

నివాసం మార్చు

దీర్ఘచతురస్రాకారంలో రెండు అంతస్తులతో కూడిన ప్లాట్‌లో నివాస భవనం ఉంది. ఒక ఎకరం స్థలంలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇది నిర్మించబడింది. నివాసంలో 250 మంది కూర్చునే సామర్థ్యంతో థియేటర్-కమ్-ఆడిటోరియం కూడా ఉంది.

నివాసానికి దక్షిణాన, ఇది ఒక ఎకరం స్థలంలో తోట ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా ఎంచుకున్న ఆయుర్వేద, ఇతర చెట్ల ఇందులో ఉన్నాయి. నివాసం ముందు 5000 మందికి సరిపడ పెద్ద బహిరంగ మైదానం ఉంది.

ముఖ్యమంత్రి కార్యాలయం మార్చు

రెండు అంతస్తుల తెలంగాణ సీఎంవో భవనం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనం. పాత సచివాలయం సీ బ్లాక్‌లోని 6వ అంతస్తులో ఉన్న సీఎం పేషీగా పిలిచే సీఎంఓ కార్యాలయం స్థల సమస్య వల్ల[8] ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి అధికారిక భవనం నిర్మించబడింది.[9]

ఇందులో చిన్న సమావేశ గది, వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం ఒక గది ఉన్నాయి. ప్రతి మండల ప్రధాన కార్యాలయంలోని అన్ని ప్రధాన కార్యాలయాలకు హాట్‌లైన్ కనెక్షన్‌లు ఉన్నాయి. అంతకుముందు స్టార్ హోటళ్ళలో, ఇతర సమావేశ మందిరాల్లో పెద్ద ఎత్తున ఉన్నతస్థాయి సమావేశాలు జరిగేవి. ఈ కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శులు పరిపాలనా సిబ్బందికి గదులు ఉన్నాయి.

జనహిత మార్చు

జనహిత అనేది 1000 మందికి పైగా కూర్చునే సామర్థ్యంతో కూడిన పెద్ద బహిరంగ సభ గది. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2017 ఫిబ్రవరి 17న దీన్ని ప్రారంభించారు.[10] 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 24 అడుగుల ఫ్లోర్-టు-సీలింగ్ ఎత్తుతో ఒకే అంతస్తు భవనమిది. దీనికి జనహిత (ప్రజలకు మంచిది) అని పేరు పెట్టారు. మొఘల్ చక్రవర్తి, అక్బర్ పీపుల్స్ కోర్ట్, దివాన్-ఇ-ఆమ్ తరహాలో దీని నిర్మాణం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి తన సభికులు, ఇతరులతో వారి సమస్యలను చర్చించడానికి కలుసుకుంటారు.

ఇందులో కార్యదర్శులు, కలెక్టర్లు, అధికారిక సమీక్షా సమావేశాలు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖ్యమైన విధాన సమావేశాలు నిర్వహిస్తారు.[11] రైతులు, కార్మికులు, ఉద్యోగులు, చేతివృత్తులవారు మొదలైన రాష్ట్ర పౌరులతో సంభాషించడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. ఇందులో రోజువారీ సందర్శకులతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఉపయోగించే పెద్ద లాంజ్ ప్రాంతం కూడా ఉంది.

పాత ముఖ్యమంత్రి అధికారిక నివాసం మార్చు

2004లో నిర్మించిన ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని అశుభకరమైనదిగా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రగతి భవన్ నిర్మించే వరకు అందులోనే ఉన్నాడు. ఇప్పుడు ఇది ప్రజా భవన్ లో భాగంగా, రాష్ట్ర అతిథి గృహంగా ఉపయోగించబడుతోంది. క్యాంపు కార్యాలయం ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) కార్యాలయంగా ఉంది.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు మార్చు

భవిష్యత్ ప్రణాళిక మార్చు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ స్పీకర్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, కౌన్సిల్‌ స్పీకర్‌లకు ఇళ్ళు, క్యాంపు కార్యాలయాలు నిర్మించేందుకు పక్కనే ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ఉపయోగించనున్నారు.

మూలాలు మార్చు

  1. "India outrage at minister's $7.3m house with bullet-proof bathroom". BBC News. 25 November 2016. Retrieved 5 June 2019.
  2. Sudhir, Uma (1 November 2016). "Vastu Or Waste? Telangana To Explain KCR's New Hyderabad Office In Court". NDTV. Retrieved 5 June 2019.
  3. KCR to move to his new official residence in Begumpet tomorrow | Business Standard News
  4. "Telangana CM Moves Into Bullet-Proof Residence Twice The Size Of A Football Field". Archived from the original on 2019-06-05. Retrieved 2019-06-05.
  5. Birthday wishes pour in for KCR
  6. Telangana Chief Minister KCR Moves Into New 9-Acre House, Complete With Bulletproof Windows
  7. KCR moves to new home where even the toilet is bulletproof
  8. KCR's new 50 crore home: Telangana CM lavishness with taxpayer's money
  9. Telangana: Camp office eclipses glory of Secretariat
  10. Priority is to peoples’ welfare, development of State: KCR
  11. Pragati Bhavan: Pragati Bhavan is pride of Telangana: K Chandrasekhar Rao | Hyderabad News – Times of India