బి.గోపాలం లేదా బొడ్డు గోపాలం (1927 - సెప్టెంబర్ 22, 2004) తెలుగు సినిమా సంగీత దర్శకులు.

బొడ్డు గోపాలం
బి.గోపాలం
జననంగోపాలం
1927
గుంటూరు జిల్లా తుళ్ళూరు
మరణంసెప్టెంబర్ 22, 2004
మంగళగిరి
నివాస ప్రాంతంమంగళగిరి
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీత దర్శకులు.
తండ్రిరామదాసు

జననం మార్చు

వీరు గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామంలో రామదాసు దంపతులకు 1927 జనవరిలో జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలంకి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని విజయవాడలో సంగీత విద్వాంసులైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు. 1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది. వేములపల్లి శ్రీకృష్ణ, షేక్ నాజర్, వేపూరి రామకోటి మున్నగు వారితో తోడు. శ్రీకృష్ణ వ్రాసిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా" పాటకు, పులుపుల శివయ్య గారి "పలనాడు వెలలేని మాగాణిరా" పాటకు స్వరరచన చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్ సైన్యానికి వ్యతిరేకముగా, సోవియట్ సేనలకు విజయము కలగాలని పాటలు వ్రాసి పాడేవాడు. "స్టాలినో నీ ఎర్ర సైన్యం" అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.

విజయవాడ రేడియో కెంద్రములో ఎంకి-నాయుడు బావ, భక్త రామదాసు వంటివాటితో పాటు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ వారి సంగీత రూపకాలు, గేయాలు పాడాడు. రేడియో గాయని రేణుకతో పరిచయం పెళ్ళికి దారి తీసింది. 1952లో తాతినేని ప్రకాశరావు పిలిపు మేరకు మద్రాసు వెళ్ళి ఘంటసాల వద్ద సహాయకులుగా చేరాడు. పల్లెటూరు, బతుకుతెరువు, పరోపకారం సినిమాలకు పనిచేశాడు. తరువాత నలదమయంతి చిత్రానికి సంగీత దర్శకుడుగా చేశాడు. నాగభూషణం గారి రక్తకన్నీరు, కలికాలం, పాపం పండింది, నాటకాల రాయుడు నాటకాలకు సంగీతము సమకూర్చాడు. 1972-84 ప్రాంతములో వెంపటి చినసత్యంతో శ్రీనివాస కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పారిజాతాపహరణం, నృత్య రూపకాలకు నేపథ్య గానం ఇచ్చి దేశ విదేశాలలో పర్యటించాడు.

మరణం మార్చు

మంగళగిరిలో చాలాకాలం నివసించి సెప్టెంబరు 22, 2004 న చనిపోయారు.

సంగీతం సమకూర్చిన సినిమాలు మార్చు

  1. నలదమయంతి (1957)
  2. బికారి రాముడు (1961)
  3. అప్పగింతలు (1962)
  4. విజయశంఖం (1966)
  5. రౌడీ రంగడు (1971)
  6. శ్రీ కృష్ణ లీల (1971)
  7. పెద్దలు మారాలి (1974)
  8. రంగులరాట్నం
  9. బంగారు పంజరం
  10. కరుణామయుడు

బయటి లింకులు మార్చు