బొత్స ఝాన్సీ లక్ష్మి

శ్రీమతి డా|| బొత్సా జాన్సీ లక్ష్మి ప్రస్తుతం వున్న 15 వ లోక్ సభలో విజయనగరం లోక్ సభ నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బొత్స ఝాన్సీ లక్ష్మి

పార్లమెంటు సభ్యులు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
తరువాత పూసపాటి అశోక్ గజపతి రాజు
నియోజకవర్గం విజయనగరం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-04-11) 1964 ఏప్రిల్ 11 (వయసు 59)
రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి బొత్స సత్యనారాయణ
సంతానం సందీప్, అనూష
నివాసం విజయనగరం

బాల్యము మార్చు

11 ఏప్రిల్, 1964 లో రాజమండ్రిలో పుట్టారు. వీరి తల్లి దండ్రులు: శ్రీమతి మజ్జి కళావతి, శ్రీ మజ్జి రామారావు.

విద్య మార్చు

వీరు ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, న్యాయ విద్యలో రెండు పీహెచ్‌డీలు కంప్లీట్‌ చేశారు.

కుటుంబము మార్చు

వీరు .... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన శ్రీ బోత్స సత్య నారాయణ గారిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తావనము మార్చు

బొత్స ఝాన్సీ 2001 నుండి 2006 వరకు విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్‌గా, 2007లో బొబ్బిలి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఎంపీగా ఎన్నికై, ఆ తరువాత 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును అందుకుంది.[1]

అభిరుచులు మార్చు

వీరికి ఆటలు, సామాజిక కార్యక్రమాలపై ఇష్టము ఎక్కువ.

సందర్శించిన విదేశాలు మార్చు

వీరు జర్మనీ, ఇటలీ, నేపాల్, శ్రీ లంక, స్విట్జర్ లాండ్, అమెరికా, బ్రిటన్ దేశాలను సందర్శించారు.

పురస్కారాలు మార్చు

వీరు 2002 -2003 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా అవార్డును పొందారు.

మూలాలు మార్చు

https://web.archive.org/web/20130201162904/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4218

  1. TV9 Telugu (14 August 2023). "ఏపీ హైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి.. రాజకీయాల్లో ఉంటూనే నిత్య విద్యార్థిగా కొనసాగిన ఝాన్సీ." Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)