భీమిరెడ్డి నరసింహారెడ్డి

భీమిరెడ్డి నరసింహారెడ్డి సామాజిక, రాజకీయ కార్యకర్త, కమ్యూనిస్టు నాయకులు. ఆయన భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1971, 1984, 1991లలో ఎన్నికయ్యారు.[1][2]

భీమిరెడ్డి నరసింహారెడ్డి

నియోజకవర్గం మిర్యాలగూడ

వ్యక్తిగత వివరాలు

జననం (1923-12-15) 1923 డిసెంబరు 15 (వయసు 100)
కరివిరాల, నల్లగొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ
జీవిత భాగస్వామి సరోజిని
సంతానం 2 కొడుకులు, 1 కూతురు
మతం హిందూ

జీవిత విశేషాలు మార్చు

ఈయన నల్లగొండ జిల్లాలోని కరివిరాల గ్రామంలో వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో 1922 మార్చి 15న భీమిరెడ్డి నర్సింహారెడ్డి జన్మించారు. ఈయన తండ్రి పేరు రాంరెడ్డి. పదవ తరగతి వరకు చదువుకున్నారు. 1945లో సరోజినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒకకూతురు.

సేవలు మార్చు

పాతిక సంవత్సరాల పార్లమెంటరీ జీవితంలో మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడుగా పేరు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘తెలంగాణ ప్రజాసమితి’ అభ్యర్థిని ఓడించి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సీపీఎం నాయకుడు బీఎన్ ఒక్కరే కావడం విశేషం. సామాజిక న్యాయం లక్ష్యంగా రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం సాగించాలని 1996లో లక్ష మందిని సమీకరించి సూర్యాపేట పట్టణంలో భారీ ప్రదర్శనను నిర్వహించిన విఖ్యాతి ఆయనది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం, ఎంసీపీఐ వరకూ పార్టీ ఏదైనా, ఆయన జీవితమంతా ప్రజల కొరకే పోరాడారు. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాల్లో దిగ్గజంగా వెలుగొందిన బీఎన్ 2008 మే 9న తుదిశ్వాస విడిచారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని అహరహం తపించారు.[3]

పదవులు మార్చు

రచనలు మార్చు

తెలంగాణ అంశంపై అనేక వ్యాసాలు రాశారు.

సందర్శన మార్చు

1986 లో చైనా, 1982-83లో U.S.S.R.

వనరులు మార్చు

  1. లోక్‌సభ జాలగూడు[permanent dead link]
  2. Sakshi (14 March 2019). "వీర తెలంగాణ సాయుధ సేనాని". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  3. "తెలంగాణ సాయుధ పోరాటయెధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి". Archived from the original on 2014-07-12. Retrieved 2016-06-08.

ఇతర లింకులు మార్చు