మహబూబ్ మాన్షన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న భవనం. ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ పేరుమాదుగా ఈ రాజభవనంకు మహబూబ్ మాన్షన్ గా పేరు వచ్చింది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

మహబూబ్ మాన్షన్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
చిరునామామలక్‌పేట , హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రారంభం1902
యజమానినిజాం

చరిత్ర మార్చు

19వ శతాబ్దం చివరలో నిర్మించబడిన ఆ భవనం సాంప్రదాయ ఐరోపా, మొఘల్ శైలిలో నిర్మించబడింది. కింగ్ కోఠి ప్యాలెస్ లోని ముబారక్ మాన్షన్ యొక్క తూర్పు బ్లాక్ మాదిరిగా ఉన్న ఈ భవనం 19వ శతాబ్దంలో ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ చే కొనుగోలు చేయబడింది.[2]

ఇతర వివరాలు మార్చు

మహబూబ్ అలీ ఖాన్ భార్య సర్దార్ బేగం రాజభవనం నుండి బయటికి చూడడంకోసం కిటీకీలకు బంగారు దారంతో తయారుచేసిన పరదాలను ఏర్పాటుచేశారు. బంగారు పరదాలపై సూర్యరశ్మి ప్రతిబింబిస్తుండడంవల్ల ఎవరినైనా రాణి వైపు చూడడానికి అసాధ్యమయ్యేది.[2]

ప్రస్తుతం మార్చు

1983 లో, ఉస్మాన్ గంజ్ యొక్క సుగంధ ద్రవ్యాల మార్కెట్ అధికారికంగా మహబూబ్ భవనంలోని బహిరంగ ప్రదేశానికి మార్చబడింది.[3] ఈ పాలెస్ నిషేధించబడింది, చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది, భారత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ భవనం శిధిలావస్థకు చేరింది,, గృహ, వాణిజ్య అవసరాల దృష్ట్యా భవనం చుట్టుప్రక్కల ఉన్న భూమి పూర్తిగా ఆక్రమించబడింది.[4][5]

మూలాలు మార్చు

  1. Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.
  2. 2.0 2.1 Telangana Today, SundayScape,Telangana Diaries (3 December 2017). "Pit stop of the royals". Dr. Anand Raj Varma. Archived from the original on 28 January 2019. Retrieved 28 January 2019.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  3. "Fire in cracker shop triggers panic". The Hindu. Archived from the original on 13 అక్టోబరు 2010. Retrieved 28 January 2019.
  4. "The 116-year-old Mahbub Mansion in a state of neglect". The New Indian Express. Retrieved 28 January 2019.
  5. "A time when it was the icon of luxury". The New Indian Express. Retrieved 28 January 2019.