మహామేఘవాహన సామ్రాజ్యం

మహామేఘవాహన వంశం (కళింగ వంశం, చేది వంశం) (ఒరియా - ମହାମେଘବାହନ; Mahā-Mēgha-Bāhana) సా.పూ.250ల నుండి సా.శ 5వ శతాబ్దం వరకు, కళింగ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం. వీరిలోని మూడవ పాలకుడు ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రసిద్ధమైంది

మహామేఘవాహన సామ్రాజ్యం
మహామేఘబాహన

ମହାମେଘବାହନ
సా.శ.పూ 2 వ శతాబ్దం–సా.శ. 5వ శతాబ్దం
రాజధానిసింహపురి
(ప్రస్తుతం సింగుపురం)
సామాన్య భాషలుసంస్కృతం, ప్రాకృతం,తెలుగు(?)
మతం
జైనమతం
ప్రభుత్వంరాజరికం
చారిత్రిక కాలంప్రాచీన యుగం
• స్థాపన
సా.శ.పూ 2 వ శతాబ్దం
• పతనం
సా.శ. 5వ శతాబ్దం
Preceded by
Succeeded by
మౌర్య సామ్రాజ్యం
గుప్త సామ్రాజ్యం

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

చరిత్ర మార్చు

మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం సా.పూ. 255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేసుకున్నాడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించి కళింగ స్వతంత్య్ర రాజ్యమయ్యింది. స్వతంత్య్రాన్ని ప్రకటించుకున్న మొదటి రాజు ఎవరనేదానిమీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కళింగుల గురించి తెలుస్తున్న చరిత్ర అంతా, హాతిగుంఫా శాసనం నుండే సేకరించడింది ఇది ఖారవేలుని పరిపాలనాకాలంనాటిది.

పాలకులు మార్చు

  • ఖేమ్ రాజ లేదా క్షేమరాజు
  • వుధ రాజ లేదా వృద్ధరాజు
  • ఖారవేల లేదా భిక్కు/భిక్షురాజు - ఈ వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందాడు. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు.
  • వక్రదేవ/కుడేపసిరి
  • వడూఖ/బడుఖ

శాతవాహనులతో యుద్ధాలు మార్చు

ఖారవేలునికి, అతని సమకాలీనుడైన శాతవాహన రాజు శాతకర్ణి జరిగిన యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (సా.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేం "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట. "ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.

మతం మార్చు

పరమతసహనాన్ని పాటించిన మహామేఘవాహనులు., జైనమతాన్ని పోషించినట్టు తెలుస్తుంది. [1][2]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Hampa Nagarajaiah (1999). A History of the Early Ganga Monarchy and Jainism. Ankita Pustaka. p. 10. ISBN 978-81-87321-16-3.
  2. Kailash Chand Jain (2010). History of Jainism. D. K. Print World (P) Limited. p. 437. ISBN 978-81-246-0547-9.

ఇతర లింకులు మార్చు