వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు
మార్చి 31, 2008
మార్చి 30, 2008
మార్చి 29, 2008
మార్చి 28, 2008
  • చెన్నై లోని చేపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్ ‌లో అతివేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. భారత్ తరఫున ఇది రెండో ట్రిపుల్ సెంచరీ కాగా, రెండూ అతని పేరిటే నమోదై ఉన్నాయి.
  • ద్రవ్యోల్భణ రేటు ఈ ఏడాదిలోనే గరిష్ఠంగా 6.68 %గా నమోదైంది.
మార్చి 27, 2008
  • సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఏ.బి.బర్దన్ ఎంపికైనాడు. ఇతడు ఈ పదవిని చేపట్టడం ఇది నాలుగవ సారి. 1990 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
  • సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1990 నుంచి ములాయం ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
మార్చి 26, 2008
మార్చి 25, 2008
  • కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై గెలిచి హర్యానా జనహిత్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ పెట్టినందున హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ ‌పై ఫిరాయింపుల నిరోధకచట్టం క్రింద నిరోధం విధించారు.
  • పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
మార్చి 24, 2008
  • 2006లో ఏర్పాటు చేసిన బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఆరవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వోద్యుగుల వేతనాలను 40% పెంచాలని, కనిష్ఠ వేతనం రూ. 6600 ఉండాలని సిఫార్సు చేసింది.
  • భూటాన్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనది.
  • పసిఫిక్ లై ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల, మహిళ టైటిళ్ళను వరుసగా జకోవిక్ (సెర్బియా), ఇవానోవిక్ (సెర్బియా) లు గెలుచుకున్నారు.
మార్చి 23, 2008
  • కొత్తగా నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 22 అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. లుప్తాన్సా ఎయిల్ లైన్స్‌కు చెందిన విమానం మొదటిసారిగా ఇక్కడికి చేరింది.
  • ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద వీలర్స్ ద్వీపంలో అగ్ని-1 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించిందిం. ఈ క్షిపణికి అణ్వాయుధాలు మోసుకెళ్ళగల సామర్థ్యం ఉంది.
  • కొత్త ప్రధానమంత్రి పదవికి యూసఫ్ రజా గిలానీ పేరును పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.
మార్చి 22, 2008
  • చైనా వాయవ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రత నమోదైనది.
  • దేశంలో 20 కొత్త టెలివిజన్ ఛానెళ్ళ ఏర్పాటుకు రిలయెన్స్ నిర్ణయం.
  • ఇంగ్లాండు క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. ఇతను ఇంగ్లాండు తరఫున 76 టెస్టులు, 120 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.
మార్చి 21, 2008
మార్చి 20, 2008
మార్చి 19, 2008
మార్చి 18, 2008
  • పాకిస్తాన్ తొలి మహిళా స్పీకర్‌గా ఫామిదా మీర్జాను నియమించాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిర్ణయించింది.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలలో హైదరాబాదు జట్టు పేరు దక్కన్ చార్జర్స్‌గా మార్చుకుంది.
  • ఐసిసి ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా ఇంతియాజ్ పటేల్ నియమించబడ్డాడు. ఇతడు దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి వ్యక్తి.
మార్చి 17, 2008
మార్చి 16, 2008
మార్చి 15, 2008
మార్చి 14, 2008
మార్చి 13, 2008
మార్చి 12, 2008
మార్చి 11, 2008
మార్చి 10, 2008
మార్చి 9, 2008
  • నాగాలాండ్ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. 60 స్థానాలు కల శాసనసభలో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ 25 స్థానాలతో ముందంజలో ఉంది.
  • మలేషియా పార్లమెంటు ఎన్నికలలో ప్రధానమంత్రి అబ్దుల్లా బదావీ నేతృత్వంలోని అధికార బారిసన్ నాసినల్ 130 స్థానాలు సాధించి ముందంజలో ఉంది.
  • బెంగుళూరు ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది.
మార్చి 8, 2008
మార్చి 7, 2008
  • త్రిపుర శాసనసభ ఎన్నికలలో లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా నాలుగవ సారి విజయం సాధించింది. 60 స్థానాలు కల శాసనసభలో లెఫ్ట్ ఫ్రంట్ 49 స్థానాలలో విజయం సాధించగా కాంగ్రెస్ 11 స్థానాలు పొందినది.
  • మేఘాలయ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు పొందినది. శాసనసభలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ చేకూరలేదు.
  • తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల రాజీనామాలకు స్పీకర్ ఆమోదం.
  • భారత్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారానికి అనుమతించబోమని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • బిఎస్ఇ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ మరో 567 పాయింట్లు తగ్గి 15,975 పాయింట్లకు చేరింది.
మార్చి 6, 2008
మార్చి 5, 2008
మార్చి 4, 2008
మార్చి 3, 2008
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సముద్రతీరప్రాంత అడవులైన సుందర్‌బాన్స్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • మేఘాలయా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమాప్తం.
  • రష్యా అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
మార్చి 2, 2008
  • కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ను భారత్ విజేతగా నిలిచింది. ఈ కప్‌ను భారత్ గెలవడం ఇది రెండో సారి.
  • ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో మొదటి ఫైనల్‌లో భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. సచిన్ టెండుల్కర్ సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.
మార్చి 1, 2008
"https://te.wikipedia.org/w/index.php?title=మార్చి_2008&oldid=4016327" నుండి వెలికితీశారు