మ్లేచ్చ (వేద సంస్కృత మ్లేచ్చ నుండి, "వేదప్రమాణికం" కానిది అని అర్ధం అంటే "అనాగరిక" అని అర్ధం) అనేది ప్రాచీన భారతదేశంలో విదేశీ లేదా అనాగరిక ప్రజలను సూచించే సంస్కృత పదం. ఇది ఆర్యుల సంస్కృతికి భిన్నంగా ఉంటుంది. విదేశీయుల అనాలోచిత, అపరిమిత ప్రసంగాన్ని సూచించడానికి, నాగరికత తెలియని ప్రవర్తనను సూచించడానికి, "అపవిత్రమైన" ("హీనమైన") వ్యక్తులు అని సూచించడానికి దీనిని అవమానకరమైన పదంగా కూడా పురాతన భారతీయులు దీనిని ఉపయోగించారు.

మ్లేచ్చ అనే పదాన్ని భారతీయులు సాధారణంగా 'జాతి లేదా రంగు రూపాల బేధం కలిగిన అనాగరికులను సూచించడానికి' ఉపయోగించారు.[1][2]

భారతీయులు ప్రాచీన కాలంలో తక్కువ నాగరికత కలిగిన దేశాంతర సంస్కృతులు, జాతులకు చెందిన ప్రజలను 'మ్లేచ్చ' [3] లేదా అనాగరికులు అని అని పిలిచారు. మ్లేచ్చ అని పిలువబడే తెగలలో సకాలు, హూణులు, యవనులు, కాంభోజులు, పహ్లవులు, బాహ్లికులు, రిషికాలు ఉన్నారు.[4] అమరకోశము కిరాతులు, ఖాసాలు, పుళిందులను మ్లేచ్చ-జాతులుగా అభివర్ణించింది. ఇండో-గ్రీకులు, సిథియన్లు, [5] కుషాణులను [6] మ్లేచ్చులు అంటారు.[7][7]

పేరు వెనుక చరిత్ర మార్చు

మ్లేచ్చ దేశాలలో ఏడు హిమాలయ నదులు ప్రవహిస్తున్నాయని వాయు, మత్స్య, బ్రహ్మండ పురాణాలు పేర్కొన్నాయి. [8] బ్రాహ్మణులు మ్లేచ్చులను వేదకాల చతుర్వర్ణాలకు వెలుపల ఉంచారు. అస్కో పార్పోలా దీనిని సుమేరియను మూలాలకు చెందిన సింధు లోయ మెలుహాతో సంబంధం కలిగి ఉందని పేర్కొన్నాడు.[9][10]

పాలి, థెరావాడ బౌద్ధమతం ఉపయోగించిన పాత ప్రాకృత, మిలక్కా అనే పదం మూలమని మైకొందరు భావిస్తున్నారు. ఇది నాటకీయ ప్రాకృతం నుండి అరువు తెచ్చుకున్న మిలక్కు అనే పదం కూడా మూలంగా ఉందని కొందరు భావిస్తున్నారు.[11] మధ్యయుగ మరాఠీ సాధువు సమర్ధ రామదాసు కూడా మెన్చా అనే పదం (బహుశా తద్భావా అని అర్ధం ఉండవచ్చు) ఉపయోగించాడు.[12]

భాష మార్చు

"మ్లేచ్చ" అనే పదం స్వదేశీ ప్రజల ఇండో-ఆర్యుల నుండి ఉద్భవించిందని కొన్ని వివరణలు సూచిస్తున్నాయి. అందులో అవి "మ్లేచ్చ" అంటే "స్పష్టంగా మాట్లాడక పోవడం" అని సూచిస్తున్నాయి. అందుకని ఇండో-ఆర్యన్లు ఇతర భాషల కఠినతను అనుకరించడానికి, అపారదర్శకతను సూచించడానికి మ్లేచ్చ అనే పదాన్ని ఉపయోగించారని కొందరు సూచిస్తున్నారు. తద్వారా ఈ ప్రజలను "మ్లేచ్చులు "గా సూచించారు.[13]

తొలి భారతీయులు సంస్కృతంలో సంభాషించేవారు. ఇది వివిధ ఆధునిక స్థానిక సంస్కృత-ఉత్పన్న భాషలుగా ఉద్భవించింది. సంభాషణకు అవసరమైన అన్ని శబ్దాలను సంస్కృతం కలిగి ఉంటుందని భావిస్తారు. తొలి భారతీయులు ఇతర భాషలను విదేశీ భాషగా- "మ్లేచ్చ భాష" - కొట్టిపారేస్తారు. సంస్కృత పదం సూచించినట్లుగా "మ్లేచ్చుల" భాష పరాయిదని భావించబడింది.[14] యజ్ఞాలలో (మతపరమైన ఆచారాలు, యాగాలు) పాల్గొనడానికి "సరైన భాష"గా సంస్కృతం ఒక కీలకమైన అంశంగా ఉండేది. అందువలన సరైన భాష లేకుండా సరైన మతాన్ని ఆచరించలేరని భావించారు.

ఆర్యులు కర్మ శ్లోకాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సంస్కృత పరిజ్ఞానాన్ని ఉపయోగించారు; ఇది సంస్కృతభాషా ప్రాముఖ్యతను సూచిస్తుంది.పరాశరుడు బ్రాహ్మణాలకు చెందిన మతంలో యాగాలు, ఇతర కర్మాచరణ చేయటానికి సరైన భాషాజ్ఞానం కలిగి ఉండాలన్న ప్రాముఖ్యతను గురించి చర్చించాడు. పరాశరుడు ఇలా అన్నాడు: "యాగం చేయడంలో ఉత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులు నిస్సందేహంగా ఇండో-ఆర్య సామాజిక వ్యవస్థలో ఒక సోపానక్రమంలో ఉన్నత స్థానంలో ఉంచబడిన బ్రాహ్మణుల వివిధ కలిగిన కుటుంబాలు, స్వచ్ఛమైన, ఉత్తమమైన భాషా ఉచ్ఛారణను కలిగి ఉండడం సమర్థించబడింది".[15]

ప్రారంభ ఇండో-ఆర్యులు అన్ని ఇతర రకాల భాషలకంటే సంస్కృతం ఉన్నతమైన భాష అని విశ్వసించారని చరిత్రకారులు గమనించారు. అందుకని మ్లేచ్చ లేదా అనాగరిక సంభాషణ ఇలా ఉన్నాయని చెప్పబడింది: ఇతర భాష కానప్పటికీ వ్యక్తుల సంభాషణకు ఉపయోగించే వ్యవహారిక భాష అసభ్యకరమైనది; సంస్కృతం అయినప్పటికీ ఇది తప్పుగా ఉచ్చరించబడడం ఈ వర్గంలో చేర్చబడింది: సహజంగా అర్థం చేసుకోలేనిది భాష మ్లేచ్చభాషగా వర్ణించబడింది. ఎందుకంటే ఇతర ప్రాంతీయ ప్రజలు దానిని అర్థం చేసుకోలేరు ".[16]

భూభాగం మార్చు

పురాతన భారతదేశంలో విదేశీయులు అంటే భారతీయ ఉపఖండానికి వెలుపల నివసించేవారు అని అనాగరికుడు అని తరచూ భావించారని చరిత్రకారులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతాల వెలుపల ప్రాంతాలకు చెందని సమూహాలను, అలాగే విదేశీయులను సూచించడానికి మ్లేచ్చ అనే పదప్రయోగం చేసినట్లు భావించబడింది. దానితో ఇది అనాగరిక అర్థాన్ని కలిగి ఉంది.[17]

అందువలన మ్లేచ్చులు, మ్లేచ్చేతరులు మధ్య మరొక వ్యత్యాసంగా నివాస ప్రాంతం ఉంది. వారు ఒక ప్రాంతీయేతర సమూహంగా పరిగణించబడినప్పటికీ మ్లేచా-దేసా (వారి భూములను ఆర్యుల నుండి వేరుచేసిన సహజ సరిహద్దు) గా పరిమితి శాశ్వతంగా ఉండదు. ఇది ఆర్యావర్తం గురించి మారిన భావనల ఆధారంగా నిర్వచించబడింది. పరాశరుడు 'ఆదిమ తెగలు' నివసించే ఏకైక స్థిరనివాసిత ప్రాంతాలను "మ్లేచా దేసా అని పేర్కొన్నాడు. అలాగే వారు ఎక్కువ కాలం బ్రాహ్మణ, బౌద్ధ లేదా జైన వంటి మతప్రభావానికి లోబడి ఉండరు" అని పేర్కొన్నాడు.[18]

కాలక్రమంలో ఆర్యుల ప్రాంతం విస్తరించినప్పటికీ, భూమి అంతా ఉన్న భావన "స్వచ్ఛత". వేద సాహిత్యం ఇండో-ఆర్యులకు సుపరిచితమైన ప్రదేశాలు, భూభాగాలను మాత్రమే సూచిస్తున్నందున, ఈ భూములు చివరికి ఆర్యవర్తలో భాగమయ్యాయి. పరాశరుడు ఈ విధంగా ఆర్యవర్తం "సరస్వతి నది అదృశ్యమయ్యే ప్రాంతం (పంజాబులోని పాటియాలా జిల్లా)." పరియాత్ర పర్వతాలు (బహుశా మాల్యపర్వతాలు) వింధ్య శ్రేణికి చెందినవి. కాలకవనం ప్రయాగా దగ్గర ఏదోఒక ప్రాంతంలో ఉందని భావించబడుతుంది. " అయినప్పటికీ ఆర్యావర్తం ఇతర వ్యాఖ్యానాలు నల్ల జింక తిరుగుతున్న ప్రాంతాలను సూచిస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలు యాగాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటాయి. ఆర్యుల నివాస ప్రాంతాన్ని నిర్వచించడం మీద దృష్టి సారించిన ప్రారంభ వేద సాహిత్యం స్వచ్ఛమైనదిగా పరిగణించబడింది; ఇంకా మ్లేచ్చ దేశం లేదా ప్రజల ప్రవర్తన గురించిన సూచన ఇందులో అసలు లేదు. భూభాగం ఎక్కడ ఉన్నా ఆర్యవర్త వంటి భూములకు పేరు పెట్టడం వల్ల ఆ ప్రాంతం నుండి మినహాయించబడిన భూములు అశుద్ధమైనవిగా పరిగణించబడతాయి.[19]

ఇంకా వేద కాలం నాటి భారతీయులు వాస్తవానికి ఉపఖండానికి వెలుపల ఉన్న వ్యక్తులతో అంటే పర్షియన్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ సమయంలో (క్రీ.పూ. 522-486) ​​సింధు నది లోయను పాలించిన పర్షియన్లు మ్లేచ్చులుగా పేర్కొనబడలేదు. బహుశా వారు బ్రాహ్మణ జీవన విధానంలో జోక్యం చేసుకోలేదు.[20]

తరువాత వేద సాహిత్యం పశ్చిమ అనావా తెగలను మ్లేచ్చులు అని పేర్కొన్నారు. వీరు ఉత్తర పంజాబు, సింధు, తూర్పు రాజస్థాన్లను ఆక్రమించి నివసించారు. గాంధారా, కాశ్మీర, కాంభోజుల వంటి రాజ్యాల సరిహద్దులలో ఉన్నందున ఉత్తరాన ఉన్న గిరిజనులు మ్లేచ్చులు అని పేర్కొనబడ్డారు. అందువల్ల వారి సంభాషణా, సంస్కృతి రెండూ కలుషితమై వారు ఆర్యవర్తానికి భిన్నంగా ఉండేవారు. లేదంటే దక్షిణ భారతదేశం మాదిరిగా వారు ఒకప్పుడు ఆర్యులుగా ఉన్నారు. కాని వేద ఆచారాలను విడిచిపెట్టిన తరువాత మ్లేచ్చ హోదా పొందినట్లు పరిగణించారు.[21][ఆధారం యివ్వలేదు]

సాంస్కృతిక కార్యాచరణ మార్చు

వ్యవస్థ అని పిలవబడే లక్షణాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ "సాంప్రదాయ విలువ కలిగిన వ్యవస్థ"గా భావించిన ఆర్యసమాజాలు స్వీకరించని సమూహాలను వర్గీకరించడానికి పురాతన హిందువులు మ్లేచ్చ అనే పదప్రయోగం చేసారు. మ్లేచ్చులు సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన సంప్రదాయానికి అనుగుణంగా లేని ప్రజలు అని భావించబడింది.[22]

ప్రారంభ రచనలలో ఈ విదేశీ ప్రజలను "సగం నాగరిక, మార్పులేని వ్యక్తులు, అకాలంలో నిద్ర లేవడం లేదా తినడం" అని సూచిస్తాయి. వీరు నివసించే ప్రాంతాలు సన్యాసులు, సన్యాసినులకు సురక్షితం కానందున వీరు నివసించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని వారు పేర్కొన్నారు. అంటే "అజ్ఞానులు స్న్యాసులను శత్రు గ్రామాల నుండి వచ్చిన గూఢాచారులు అనే అభిప్రాయంతో వారిని కొట్టవచ్చు, వేధించవచ్చు, దోచుకోవచ్చు." ఇంకా జైన విశ్వాసం వంటి కొన్ని మ్లేచ్చేతర అటవీ తెగల ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ, వారిని మ్లేచ్చులుగా పేర్కొన్నారు. వీరికి స్థిరపడిన వ్యవసాయం, పట్టణ జీవనశైలి, ప్రమాణాలతో సగర్వంగా నిలిచిన మైదాన ప్రాంతాల ప్రజల విలక్షణ వైఖరి ఉండేది.[23]

కొన్ని ఆచారాలకు అనుమతులు - లేదా "స్వచ్ఛతను" నిర్ణయించే వ్యవస్థలు కూడా ఉన్నాయని చరిత్రకారులు గమనించారు. చివరికి దీనిని బ్రాహ్మణులు నిర్ణయిస్తారు. అందువల్ల బ్రాహ్మణ వ్యవస్థలోని సభ్యులకు శుద్ధత, ప్రవర్తనా నియమాలు, ఆచారాలు, ఆచారాల స్వచ్ఛతను నిర్వచించడానికి సంక్లిష్టమైన నియమాలు ఉన్నాయి. ఈ సలహాదారులు బ్రాహ్మణ వ్యవస్థ ప్రజలు ఏ మ్లేచ్చ ఆచారాల సభ్యత్వాన్ని పొందకుండా ఉండటానికి కఠినంగా ప్రవర్తిస్తారు.[24]

పేర్లను సంస్కృతీకరించడం స్వదేశీ, విదేశీ మ్లేచ్చ సమూహాలు రెండింటిలో ఒక సాధారణ లక్షణం చేసుకున్నారు. అలా వారు నెమ్మదిగా వారి స్థితి నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించారు. చాలా తరచుగా పాలక కుటుంబాల విషయంలో పరివర్తన చెందడానికి ఒకటి నుండి రెండు తరాలు పట్టింది. బ్రాహ్మణ కర్మ స్వచ్ఛత వ్యక్తీకరణ ప్రత్యక్ష రూపాలలో ఒకటి బ్రాహ్మణుడు తినే ఆహారం ప్రాధాన్యత వహిస్తుంది. అపరిశుభ్రమైన వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహారాన్ని అంగీకరించడం బ్రాహ్మణులకు నిషేధించబడింది. ఆ విధంగా పంజాబు ప్రాంతం ముస్లింలు స్వాధీనం చేసుకున్న మ్లేచ్చ ప్రాంతంగా మారినప్పుడు ప్రధానమైన ఆహారానికి తక్కువ స్థానం లభించింది. సా.శ. 12వ శతాబ్దం నాటికి గోధుమలను ఒక నిఘంటువులో 'మ్లేచ్చుల ఆహారం' గా వర్ణించారు. బియ్యం 'స్వచ్ఛమైన' తృణధాన్యంగా మారింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా మ్లేచ్చుల ఆహారంగా పరిగణించబడ్డాయి. అందువలన అర్చక మేధో వర్గానికి చెందిన బ్రాహ్మణులకు అది నిషేధించబడింది. మ్లేచ్చులు మద్యం సేవించారు, ఆవు మాంసాన్ని తిన్నాడు, ఇది సనాతన ధర్మం నిజమైన విశ్వాసానికి కచ్చితంగా నిషేధించబడింది. ఇతర దేవుళ్ళను విశ్వాసానికి చెందినదిగా మారింది.[7][25]

సమాజం క్షీణత, విలువల రద్దు సాధారణంగా మ్లేచ్చుల చేత ఆక్రమించబడుతుందనే భావనతో ముడిపడి ఉండి నాగరికత పతనానికి దారితీస్తుంది. ప్రపంచాన్ని తమ అసహ్యకరమైన విధానంలోకి మార్చడానికి చరిత్రను వారి ఇష్టానుసారం తిరిగి వ్రాయడానికి మ్లేచ్చులు ప్రయత్నించారు. ఈ పరిస్థితిని మహాభారతంలో వివరించబడింది:

" ప్రపంచం మొత్తం మ్లేచ్చ ప్రవర్తన, భావాలు, వేడుకలతో నిండి ఉంటుంది. యాగాలు ఆగిపోతాయి. ఆనందం ఎక్కడా ఉండదు. సాధారణ ఆనందం అదృశ్యమవుతుంది. యుధిష్ఠిరా, ప్రపంచం మొత్తం మలిచిపోతుంది. పురుషులు యఙ, యాగాదుల ద్వారా దేవతలను సంతృప్తి పరచడం మానేస్తారు. ఒకరి మాటలను ఒకరు ఎవరూ వినరు. గురువుగా ఎవరూ పరిగణించబడరు. మానవ పాలకులారా మేధో చీకటి మొత్తం భూమిని చుట్టుముడుతుంది. "[26]

మ్లేచ్ఛ సాహిత్యం మార్చు

మహాభారతంలో కొంతమంది మ్లేచ్చ యోధులు "తలలు పూర్తిగా గుండు లేదా సగం గుండు లేదా అల్లికచేయబడి తాళాలతో కప్పబడిన శిగాలంకారాతో, అపరిశుభ్రమైన అలవాట్లతో, వంకర ముఖాలు, ముక్కులతో ఉన్న ప్రజలగురించిన వర్ణన చేయబడింది.[27] వారు" పర్వత నివాసులు ", "పర్వత-గుహల నివాసులు, మ్లేచ్చులు అని పులువబడ్డారు. మ్లేచ్చులు ఆవు నుండి జన్మించారు (వసిష్ఠుడి నందిని అనే ఆవు నుండి) పౌరాణిక రచనలలో వర్ణించబడింది. వీరికి భయంకరమైన కళ్ళు, యమ దూతలుగా కనిపించడం, కొట్టడం, అసురులతో, మోసపూరిత శక్తులతో సంభాషించడం "[28] వంటి లక్షణాలు ఉన్నట్లు వర్ణించబడింది.

విశ్వమిత్ర, వసిష్ఠుల మధ్య గొడవ జరిగినప్పుడు యాగం కొరకు వశిష్ఠుడు పెంచుతున్న దేవలోక ఆవు నందిని తోక నుండి మ్లేచ్చ తెగ జన్మించిందని స్వామి పరమేశ్వరానందు చేత పేర్కొనబడింది. మహాభారతం దీనికి సంబంధించి ఈ క్రింది సమాచారాన్ని ఇస్తుంది:

  • దేవలోక ఆవు నందిని తోక నుండి ఉద్భవించిన మ్లేచ్చులు విశ్వమిత్ర సైన్యంతో బీభత్సంగా దాడిచేసారు.
  • భగదత్తుడు మ్లేచ్చ రాజు.
  • భీముడు, నకులుడు, సహదేవుడు వంటి పాండవులు ఒకప్పుడు వారిని ఓడించారు.
  • కర్ణుడు తన ప్రపంచ పోరాటంలో అనేక మ్లేచ్చ దేశాలను జయించాడు.
  • యుధిష్ఠిరుడు యగసాలాలో బ్రాహ్మణులకు బహుమతులుగా పంపిణీ చేసిన తరువాత మిగిలి ఉన్న సంపదను మ్లేచ్చులు స్వాధీనం చేసుకున్నారు.
  • మ్లేచ్చులు పాండవ సైన్యం మీద కోపంతో ఉన్న ఏనుగులను నడిపారు. "ఇది మ్లేచ్చులు పాండవులకు వ్యతిరేకంగా ఉన్నట్లు చూపిస్తుంది".[29][30]

వేదాలలో మ్లేచ్చులు ధ్రువీకరించబడలేదు. మొదటిసారిగా చివరి వేద గ్రంథంలో శతాపాత బ్రాహ్మణంలో ఇది సంభవించింది. బౌద్ధాయన సూత్రాలు ఒక మ్లేచ్చుడు "మాంసం తింటాడు లేదా స్వీయ-విరుద్ధమైన భావప్రకటన ప్రదర్శిస్తాడు అని వర్ణించాయి. లేదా ధర్మం, ప్రవర్తనా స్వచ్ఛత లేనివారు " అని కూడా వర్ణించారు. [ఆధారం చూపాలి] అని నిర్వచించాయి. అంటే వేద విశ్వాసాలకు భిన్నమైన బోధలను అనుసరించేవారిని మ్లేచ్చులు అని సూచించబడి ఉండవచ్చు. భారత చరిత్రలో అస్సాంలోని కొంతమంది స్వదేశీ పాలకులను మ్లేచ్చ రాజవంశం అని పిలుస్తారు. భాగవత పురాణంలో ఈ పదం మాంసం తినేవారు, బహిష్కృత జాతులకు చెందిన ప్రజలను సూచించడానికి ఉపయోగించబడింది.

చైతన్య మహాప్రభు వంటి మధ్యయుగ హిందూ సాహిత్యం ఇతర మతాల పెద్ద సమూహాలను (ముఖ్యంగా ముస్లింలను సూచించడానికి) ఈ పదాన్ని ఉపయోగించారు.[31] మధ్యయుగ భారతదేశాన్ని సందర్శించిన విదేశీ సందర్శకుడు అల్-బిరుని (1048 లో మరణించాడు) విదేశీయులను 'అపవిత్రమైన' వారిగా 'మ్లేచ్చులు'గా పరిగణించారని, హిందువులు వారితో సాంఘిక లేదా వివాహ సంబంధాలు నిషేధించబడతాయని గుర్తించాడు.[32]

కామరూపససనావళి మ్లేచ్చులను ఇలా వర్ణించింది - "ఆల్పైను ఆర్యన్లు తరువాతి సంచార జాతుల మతం, సంస్కృతిని అంగీకరించడం కష్టం అనిపించినప్పటికీ వారు వాస్తవాన్ని అంగీకరించారు. అయినప్పటికీ తరువాతి తరానికి చెందినవారు దానిని వ్యతిరేకిస్తూ వారిని మ్లేచ్చులుగా నిర్ణయించారు . " . " (మూలం:కామరూపససనావళి, 2 వ ముద్రణ, 2003, పేజి 40; పబ్లికేషను బోర్డు అస్సాం, గౌహతి-21; సంపాదకుడు-డాక్టరుదిబేశ్వర శర్మా, ఎం.ఎ., పి.హెచ్.డి)

విశాఖదత్తా సంస్కృత నాటకం ముద్రాక్షసం కౌలుత (कौलुता), మలయా (मलयः), కాశ్మీరా (काश्मीर), సైంధవ (सैन्धव), పారశీక (पार्सिक) అనే ఐదు తెగలను మలేచ్చులుగా నిర్ణయించింది. (మూలం: విశాఖదత్త ముద్రరాక్ష, సంపాదకుడు- కె.హెచ్. ధ్రువ, 2 వ ముద్రణ, 1923, యాక్ట్. ఐ-१ ९, పేజి ११, ది ఓరియంటల్ బుక్-సప్లై ఏజెన్సీ, పూనా.)

ఇవి కూడా చూడండి మార్చు

  • బార్బేరియను
  • మెలుహా
  • దాస
  • పాలా రాజవంశం (కామపురా)

మూలాలు మార్చు

  1. Basham, A. L. (1954) The wonder that was India, pages 145–146, Sidgwick and Jackson, London.
  2. http://www.dictionary.reference.com/browse/mleccha
  3. Mudrarakshasha by Kashinath Trimbak Telang introduction p12 [1]
  4. National geographer, 1977, p 60, Allahabad Geographical Society – History.
  5. Subramoniam, Vadasery Iyemperumal (1995). Language Multiplicity and Ancient Races in India. ISBN 9788173420290.
  6. Language multiplicity and ancient races in India
  7. 7.0 7.1 7.2 Thapar, Romila (1978-01-01). Ancient Indian Social History: Some Interpretations (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788125008088.
  8. Sharma 1978, p. 152.
  9. Parpola, Asko; Parpola, Simo (1975), "On the relationship of the Sumerian toponym Meluhha and Sanskrit mleccha", Studia Orientalia, 46: 205–238
  10. Witzel, Michael (1999), "Substrate Languages in Old Indo-Aryan (Ṛgvedic, Middle and Late Vedic)" (PDF), Electronic Journal of Vedic Studies, vol. 5, no. 1, p. 25, archived from the original (PDF) on 2012-02-06, retrieved 2020-01-09
  11. "search". Pali-English Dictionary. Pali Text Society. Archived from the original on 27 ఫిబ్రవరి 2021. Retrieved 24 July 2015.
  12. Savant 2011, p. 83.
  13. Thapar, Romila (October 1971). "The Image of the Barbarian in Early India". Comparative Studies in Society and History. 13 (4): 409–410. doi:10.1017/s0010417500006393.
  14. Thapar, Romila (October 1971). "The Image of the Barbarian in Early India". Comparative Studies in Society and History. 13 (4): 408–409. doi:10.1017/s0010417500006393.
  15. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. pp. 48–49.
  16. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. pp. 80–81.
  17. Parasher-Sen, Aloka (2004). Subordinate and Marginal Groups in Early India. Oxford: Oxford University Press. pp. 276–277.
  18. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. p. 90.
  19. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. pp. 94–96.
  20. Parasher-Sen, Aloka (2004). Subordinate and Marginal Groups in Early India. Oxford: Oxford University Press. p. 279.
  21. Thapar, Romila (1978). Ancient Indian Social History: Some Interpretations. Orient Blackswan. p. 279. ISBN 978-81-250-0808-8.
  22. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. pp. 76–77.
  23. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. pp. 101–102.
  24. Parasher, Aloka (1991). Mlecchas in Early India: A Study in Attitudes toward Outsiders up to AD 600. New Delhi: Munshiram Manoharial Publishers Pvt. Ltd. p. 114.
  25. Ancient Indian Social History: Some Interpretations By Romila Thapar
  26. Book 3, Section CLXXXIX (189).
  27. ."Mlecchas in early India: a study in attitudes towards outsiders up to AD 600
  28. Mahabharata, Drona Parva, Section 92.
  29. Encyclopaedic Dictionary of Puranas: (A-C) ; 2.(D-H) ; 3.(I-L) ; 4.(M-R) ; 5 ... By Swami Parmeshwaranand
  30. Parmeshwaranand, Swami (2001-01-01). Encyclopaedic Dictionary of Puranas (in ఇంగ్లీష్). Sarup & Sons. ISBN 9788176252263.
  31. Vedabase Archived 16 నవంబరు 2007 at the Wayback Machine.
  32. Rizvi, S.A.A. (1987), The wonder that was India, volume II, pages 252–253, Sidgwick and Jackson, London
Sources

అదనపు అధ్యయనం మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మ్లేచ్చ&oldid=3809686" నుండి వెలికితీశారు