యమేశ్వరాలయం

ఒడిషా లోని మందిరం

యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.

యమేశ్వరాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భువనేశ్వర్
అక్షాంశ రేఖాంశాలు:20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139
ఇతిహాసం
సృష్టికర్త:తూర్పు గాంగులు

నిర్మాణం మార్చు

ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది.[1] ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.[1] ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.[1] గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ[1]

పర్వదినాలు మార్చు

ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, సంక్రమణపు రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.

ఇవికూడా చూడండి మార్చు

చిత్రావళి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-12. Retrieved 2017-10-12.

బయటి లింకులు మార్చు