రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం

(రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

రాజమండ్రి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°0′36″N 81°48′0″E మార్చు
పటం

చరిత్ర మార్చు

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు శాసనసభా నియోజకవర్గములు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు శాసనసభా నియోజకవర్గములు వచ్చిచేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 శాసనసభా నియోజకవర్గములు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.

శాసనసభా నియోజకవర్గాలు మార్చు

  1. అనపర్తి: ఇది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో విస్తరించివుంది.
  2. కొవ్వూరు
  3. గోపాలపురం (SC): ఇది తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది.
  4. నిడదవోలు
  5. రాజమండ్రి గ్రామీణ
  6. రాజమండ్రి సిటీ
  7. రాజానగరం

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,87,158 [1]
  • ఓటర్ల సంఖ్య: 11,77, 031.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 20.11%, 0.77%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 కానేటి మోహనరావు

నల్లా రెడ్డి నాయుడు

భారతీయ కమ్యూనిస్టు పార్టీ
రెండవ 1957-62 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 యస్.బి.పి. పట్టాభిరామారావు భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 యస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 యస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 చుండ్రు శ్రీహరిరావు తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 జూలూరి జమున భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 కె.వి.ఆర్. చౌదరి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 చిట్టూరి రవీంద్ర భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 గిరజాల వెంకటస్వామి నాయుడు భారతీయ జనతా పార్టీ
పదమూడవ 1999-04 యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు భారతీయ జనతా పార్టీ
పద్నాలుగవ 2004-09 ఉండవల్లి అరుణ కుమార్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-14 ఉండవల్లి అరుణ కుమార్ భారత జాతీయ కాంగ్రెసు
పదహారవ 2014-19 మాగంటి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ
పదియేడవ 2019 - ప్రస్తుతం మార్గాని భరత్‌ వైఎస్సార్‌సీపీ

2004 ఎన్నికలు మార్చు

2004 ఎన్నికలలో విజేత,సమీప ప్రత్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి పేరు (పార్టీ) పొందిన ఓట్లు
ఉండవిల్లి అరుణకుమార్ (కాంగ్రెస్)
  
413,927
కంటిపూడి సర్వారాయుడు (బి.జె.పి)
  
265,107
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్ పోటిచేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీలో ఉన్నాడు.[3]

2009 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  ఉండవిల్లి అరుణ కుమార్ (35.12%)
  మురళీ మోహన్ (34.91%)
  కృష్ణంరాజు (24.90%)
  ఇతరులు (5.07%)
భారత సాధారణ ఎన్నికలు,2004:రాజమండ్రి
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ ఉండవిల్లి అరుణకుమార్ 3,57,449 35.12
తెలుగుదేశం పార్టీ మురళీమోహన్ 3,55,302 34.91
ప్రజా రాజ్యం పార్టీ కృష్ణంరాజు 2,53,437 24.90
లోక్ సత్తా పార్టీ డా.పాలడుగు చంద్రమౌళి 13,418 1.32
భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు 7,123 0.70
బహుజన సమాజ్ పార్టీ వజ్రపు కోటేశ్వరరావు 5,805 0.57
మెజారిటీ 2,147
మొత్తం పోలైన ఓట్లు
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

2014 ఎన్నికలు మార్చు

భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: రాజమండ్రి
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ మాగంటి మురళీమోహన్ 630,573 54.62
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బొడ్డు వెంకటరమన చౌదరి[4] 463,139 40.12
భారత జాతీయ కాంగ్రెస్ గుర్గేష్ కందుల 21,243 1.84
Jai Samaikyandhra Party ముళ్ళపూడి సత్యనారాయణ 11,718 1.02
BSP మర్రి బాబ్జీ 6,079 0.53
NOTA None of the Above 7,456 0.65
మెజారిటీ 1,67,434 14.50
మొత్తం పోలైన ఓట్లు 1,154,381 81.22 +0.50
TDP gain from INC Swing

మూలాలు మార్చు

  1. సాక్షి దినపత్రిక
  2. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.