రాజాజీ జాతీయ ఉద్యానవనం

రాజాజీ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్, హరిద్వార్, పౌరి గాహార్వాల్ అనే మూడు జిల్లాలకు చేరువలో ఉంది.[1]

రాజాజి జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
ప్రదేశంఉత్తరాఖండ్, భారతదేశం
సమీప నగరంహరిద్వార్, డెహ్రాడూన్
స్థాపితం1983
పాలకమండలిఉత్తరాఖండ్ అటవీ శాఖ విభాగం

చరిత్ర మార్చు

ఈ ఉద్యానవనం 1983 లో స్థాపించారు. ఇది 820 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది..[2] దీనిని చిల్ల, మొత్తిచూర్, రాజాజి అనే మూడు సంరక్షణ కేంద్రాలను కలిపి రాజాజి జాతీయ ఉద్యానవనంగా ఏర్పరిచారు. ఈ ఉద్యానవనాన్ని ఏప్రిల్ 15, 2015 న పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.

మరిన్ని విశేషాలు మార్చు

ఈ ఉద్యానవనంలో గంగా, సాంగ్ అనే నదులు ప్రవహిస్తాయి. దీనికి రాజాజి అనే పేరు స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న పురస్కార గ్రహీత రాజగోపాల చారి నుంచి వచ్చింది.

మూలాలు మార్చు

  1. http://projecttiger.nic.in/News/25_Newsdetails.aspx
  2. Rajaji Archived 19 ఫిబ్రవరి 2008[Date mismatch] at the Wayback Machine Official website of Haridwar.