రాధికాభాయి

భారతీయ యోగిని

మహారాష్ట్రలోని నాసికుకు చెందిన సర్దారు గుప్తే కుమార్తె రాధికాబాయి గుప్తే (1745 జూలై 4- 1798 నవంబరు 29). మొదటి బాజీ రావు (టిప్నిసు కార్యదర్శి). రఘునాథరావు అందమైన కుమార్తె అయిన రాధికాబాయికి చిన్నప్పటి నుండి ఛత్రపతి మొదటి షాహు అజింక్యతారా కోటలో పరిపాలనలో, యుద్ధంలో శిక్షణ పొందింది. ఆమె సదాశివరావు భావు భార్య పార్వతిబాయి మేనకోడలుగా ఆమెతో మానసికంగా అనుబంధం ఉంది. ఆమెకు శ్రీమంతు విశ్వసరావు పేష్వాతో నిశ్చితార్థం జరిగింది.[1][2]

బాల్యం మార్చు

రాధికాబాయి తన బాల్యాన్ని సతారాలో గడిపింది. తన అత్త పార్వతిబాయి అదుపులో బ్ల్యజీవితం గడిపింది. ఆమె అత్తలాగే ఆమె విలువిద్య, ఆయుధాలయం, కోర్టు రాజ్యసభా వ్యవహారాలను నిర్వహించడం వంటి వాటిలో శిక్షణ పొందింది. ఆమె అద్భుతమైన తెలివితేటలు, ఆకర్షణీయమైన అందం కారణంగా నానాసాహెబు పేష్వా తన పెద్ద కొడుకు విశ్వాసరావుతో (పెష్వా సింహాసనం వారసుడు)తో వివాహం చేయడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసరావుతో రాధికాబాయి వివాహం ఏర్పాట్లు చేసే ముందుగా చత్రపతి షాహు తన పేష్వా పదవి వంశపారంపర్యం చేయాలని షరతు విధించాడు. ఈ ఏర్పాటు 1749 పద్వా రోజున జరిగింది. పార్వతిభాయి దత్తపుత్రిక సదాశివరావు భార్య అయింది.[3]

శ్రీమంతు విశ్వనాథరావు పేష్వా, రాధికాభాయి మద్య పరస్పర సంబంధాలు మార్చు

మామతో పాటు సతారాకు వచ్చినసమయాలలో శ్రీమంత విశ్వసరావు రాధికాబాయితో కలిసి ఆడుకునేవాడు. విశ్వాసరావు విలువిద్య, ఆయుధాలయ నిర్వహణ, పరిపాలనా పాఠాలలో కూడా ఆమెకు సహాయం చేశాడు. ఇద్దరి మధ్య నాలుగేళ్ల వయసు తేడా ఉంది. శ్రీమంత విశ్వాసరావు ఎప్పుడూ ఆమెను ఇష్టపడేవాడు. శనివార వాడలో నవరాత్రి అష్టమి పండుగ సందర్భంగా చిన్న విశ్వరావు ఆమెను చూసినప్పుడు ఆమెలాంటి బొమ్మను తీసుకువస్తానని నానాసాహెబు చెప్పాడు. నెలల తరువాత భూసాహెబు మొదటి భార్య ఉమాబాయి మెహెండాలే, ఇద్దరు శిశువులు మరణించిన తరువాత, 9- సంవత్సరాల విశ్వసరావుకు రాధికాబాయితో నిశ్చితార్థం జరిగింది. విశ్వాసరావు మామయ్య రాధికాభాయి అత్త పార్వతిబాయిని వివాహం చేసుకున్నాడు.

అయితే శ్రీమంత విశ్వాసరావు తల్లి గోపికాబాయి ఈ వివాహబంధాన్ని ఎప్పుడూ ఆమోదించలేదు. ఆమె అధికారం కేంద్రంలో ఉన్న సనాతనసంప్రదాయాలను అనుసరించే మహిళ. కాబట్టి ఆమె వివాహ తేదీని వాయిదా వేస్తూనే ఉంది. నానాసాహెబు సదాశివరావు, విశ్వాసరావు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె వివాహం జరగనివ్వలేదు. ఆమె కులం, జాతకం పొసగలేదనడం వంటి సాకులు చెప్పింది. కానీ ఆమె కుమారుడు శ్రీమంత్ విశ్వసరావు తాను ప్రేమించిన రాధికాబాయిని వివాహం చేసుకోవడంలో గట్టిగా నిలబడ్డాడు. శ్రీమంత విశ్వసరావుకు 15 సంవత్సరాల వయస్సులో సింధ్ఖేడ (1756-57) వద్ద సోలో మోహింను చేపట్టి దానిని గెలుచుకున్నాడు. ఆయనను ఉడ్గిరు యుద్ధానికి (1759) పంపే ముందు, నానాసాహెబు, భూసాహెబు విశ్వసరావును రాధికాబాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ గోపికబాయి తనకు నచ్చిన అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని సంకల్పించింది. అయినప్పటికీ ఆమె ఎంపికను నానాసాహెబు, ఆమె అత్యంత అభిమాన కుమారుడు విశ్వాసరావు తిరస్కరించారు. అయినప్పటికీ ఆమె పెళ్లిని జరగకుండా కొంతకాలం నిలిపివేయగగింది. విశ్వసరావు ఉద్గిరు యుద్ధానికి వెళ్లి తన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాడు. పానిపట్టు మోహింకు ముందు, నానాసాహెబు మళ్ళీ తన కొడుకుతో రాధికాబాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పుడు గోపికాబాయి తన కొడుకును నియంత్రించాలని నిర్ణయించుకున్నది. కుమారుడిని వివాహం నుండి బయటపడమని శాసించింది. దేశం మాత్రమే ప్రాధాన్యతగా ఉండాలని వివాహం కాదు అని ఆమె కుమారుడికి గుర్తు చేసింది. తీవ్రమైన దేశభక్తి, కర్తవ్యదీక్షతో శ్రీమంత విశ్వసరావు తన వివాహాన్ని వాయిదా వేసి పానిపట్టు మోహిం మీదకు యుద్ధానికి వెళ్ళాడు.

పండిటు మోహిం మార్చు

1758 మేలో రాధికాబాయికి 13 సంవత్సరాల వయసులో ఆమె ఆమె అత్త పార్వతిబాయి ఇతర మహిళలతో పాటు రాధికాభాయిని తీసుకుని దక్కను నుండి బయలుదేరి తీర్థయాత్ర చేయడానికి కురుక్షేత్రానికి వెళ్ళింది. రాధికాబాయితో పాటు కాశీ అనే నమ్మకమైన పనిమనిషి కూడా ఉంది. ఆమె వయస్సు 8 సంవత్సరాలు, రాధికాబాయి, పార్వతిబాయి ఆమెను అత్యంత ప్రేమతో చూసుకున్నారు. వివిధ పుణ్యక్షేత్రాలలో లభ్యమయ్యే రికార్డుల ప్రకారం పార్వతిబాయి, రాధికాబాయి ఉజ్జయిని, బృందావను, హరిద్వారు, రావల్పిండి శివాలయం, ముల్తాను లోని నరసింహ ఆలయాన్ని సందర్శించారు. చమురు దీపాలను వెలిగించడం కొరకు అమృతసరు లోని బంగారు ఆలయానికి పార్వతిబాయి ఇచ్చిన విరాళాలు స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. ఇది యుద్ధానికి దాదాపు 14 నెలల ముందు 1759 లో దీపావళి అమావాస్యగా ఆమె సందర్శించిన తేదీ ధృవీకరించబడింది. 25 నెలలుగా ఆమె తన అత్త పార్వతీబాయి, కాబోయే శ్రీమంత విశ్వసరావుతో కలిసి పానిపట్టు మోహిం వద్ద ఉన్నారు. అయినప్పటికీ తరువాత భద్రతా కారణాల దృష్ట్యా, ఆమెను మొదట సమీపంలోని సిక్కు పాలకుడి రాజభవనానికి, ఆతరువాత గ్వాలియరుకు పంపాడు. అక్కడ ఆమె తండ్రి ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడు. పానిపట్టు పరాజయం, ఆమె కుమారుడి బలిదానం తరువాత గోపికబాయి ఒక వికారమైన దృశ్యాన్ని సృష్టించి, రాధికబాయిని శపించింది. తన జీవితమంతా రాధికాబాయి ఎప్పుడూ పూనాసమీపానికి కూడా రాలేదని గోపికాబాయి గ్రహించింది. గోపికాభాయి తనతో రాధికాభాయి కుటుంబానికి ఉన్న అన్ని సంబంధాలను రద్దు చేసింది. రాధికాభాయితో సన్నిహితంగా ఉండటాన్ని ఆమె నిషేధించింది. ఆమె తండ్రి సర్దారు గుప్తే అత్యాశ, అధికారదాహంతో ఉన్నడని ఆమె తండ్రిని నిందించింది. అమరవీరుడైన పార్వతిబాయి పెద్దకుమారుడు శ్రీమంత మాధవరావు పేష్వా (విశ్వాసరావు సోదరుడు), రాధికాబాయికి గోపికాభాయి కుటుంబం పట్ల ఉన్న ప్రేమను గౌరవించారు.

రాధికాభాయి గోపికాభాయి మార్చు

1778 లో కుంభమేల సమయంలో రాధికాబాయి తీర్థయాత్రగా నాసికు వచ్చింది. అధికార పదవిని వదిలి నైరాశ్యంగా నాసికులో నివసిస్తున్న గోపికబాయి పవిత్ర నగరమైన నాసికుకు చేరిన సర్దార్ల వాడల ముందు యాచించి జీవితం కొనసాగిస్తూ ఉండేది. గోపికాబాయి సేవకుల నుండి భిక్ష తీసుకోదు వారి కానీ తల్లులు, భార్యలు లేదా ఉన్నత స్థాయి సర్దార్ల కుమార్తెల నుండి మాత్రమే నైవేద్యాలను సేకరిస్తుందని వ్రాతపూర్వ ఆధారాలు పేర్కొన్నాయి; ఆమె భిక్షయాచించే సమయంలో తనతో పాటు ఉన్న ఆవుకు కట్టిన గంటను మోగిస్తుంది. హిందూ మాసం అయిన పుష్యమాసంలో 1778 లో గోపికబాయి తనకు తెలియకుండానే భిక్ష కోరుతూ సర్దారు గుప్తే ఇంటికి వెళ్ళింది. ఆమె ఆవు గంట మోగిస్తూ కొంతసేపు వేచి ఉంది. తన తండ్రి నివాసంలో ఉంటున్న రాధికాబాయి, నైవేద్యంతో బయటకు వచ్చి, గోపికాబాయి భిక్షాటన కోరడం చూసి ఆశ్చర్యానికి గురైంది. అప్పుడే గోపికాబాయి తలెత్తి భిక్ష ఇస్తున్నవారిని చూడగానే ఇద్దరు మహిళల కళ్ళు కలిశాయి. తన కుమారుడు విశ్వాసరావు మరణానికి కారణమని రాధికాబాయిని ఎప్పుడూ నిందించిన గోపికబాయి, కోపంతో విరుచుకుపడి, ఆమె చెడ్డ శకునమని రాధికాబాయి మీద కేకలు వేయడం ప్రారంభించింది. గోపికాబాయి అనారోగ్యానికి ప్రధాన కారణమై ఇలాంటి అవమానాలను భరించడానికి కారణమైన రాధికాభాయిని దేవుడు ఆమెను ఎందుకు సజీవంగా ఉంచాడని నిందించింది. గోపికబాయి మిగిలిన నెలలో ఉపవాసం ఉండి బలహీనమై అనారోగ్యంతో నిర్జలీకరణానికి గురై చివరికి మరణించింది. రాధికాబాయి గోపికాబాయికి చివరి కర్మలు చేసి నాసికు లోని గోదావరి నది ఒడ్డున డీప్మాలా (దీపగోపురాన్ని) ను నిర్మించింది. 1961 వరదల సమయంలో ఈ డీప్మాలా కొట్టుకుపోయింది. మిగిలిన పునాదిమీద ప్రస్తుతం ప్రజలు తమ బంధువుల చివరి కర్మలు చేసేటప్పుడు చమురు దీపాలను ఉంచుతున్నారు.

వెలుపలి లింకులు మార్చు

  1. "पेशवीण गोपिकाबाईंचा असा झाला अहंकारामुळे दुर्दैवी अंत!!". बोभाटा (in ఇంగ్లీష్). 2020-01-13. Archived from the original on 2020-02-13. Retrieved 2020-02-18.
  2. pragati. "सखाराम हरी गुप्ते". साप्ताहिक अंबर | Weekly Amber | Talegaon News | Lonavala News | Maval News | Latest Marathi News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2019-11-14. Retrieved 2020-02-18.
  3. "'पानिपत'मध्ये नाशिकचे त्रिमूर्ती". Maharashtra Times (in మరాఠీ). 2019-12-08. Retrieved 2020-02-27.