వి. ఆర్. కృష్ణ అయ్యర్

సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి

జస్టిస్ కృష్ణ అయ్యర్ గా సుప్రసిద్దుడైన వి. ఆర్. కృష్ణ అయ్యర్ ఒక భారతదేశ న్యాయమూర్తి. ఈయన సేవలకు గానూ భారత ప్రభుత్వము 1999లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

వి. ఆర్. కృష్ణ అయ్యర్
వి. ఆర్. కృష్ణ అయ్యర్


వ్యక్తిగత వివరాలు

జననం (1914-11-15)1914 నవంబరు 15
పలక్కడ్,
మలబార్ జిల్లా,
మద్రాసు రాజ్యము,
బ్రిటీష్ ఇండియా
మరణం 2014 డిసెంబరు 4(2014-12-04) (వయసు 100)
కోచి,
కేరళ,
భారతదేశం
జాతీయత భారతీయుడు
నివాసం ఎర్నాకుళం
మతం హిందూ

నేపధ్యము మార్చు

కేరళలోని పాలక్కడ్ సమీపంలోని వైద్యనాథపురంలోని తమిళ బ్రాహ్మణుల ఇంట 1914 నవంబరు 15న జన్మించిన వైద్యనాథపుర రామకృష్ణయ్యర్..యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు భావాలను ఒంటబట్టించుకున్నారు. 1937 నుంచి క్రిమినల్ లాయర్‌గా పేరున్న తండ్రి వి.వి. రామయ్యర్ శిష్యరికంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం అప్పటి మద్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలోనే మొదటిసారిగా కేరళలో ఎన్నికైన ఈఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1965 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టారు. 1968లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇలా రెండు రంగాల్లో అవిరళ కృషి చేసిన అరుదైన వ్యక్తి అయ్యర్. కాగా, 1957లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేరళలో భూ సంస్కరణలు అమలయ్యాయి. అలాగే, 1973 నుంచి 1980 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన హయాంలోనే బెయిల్ నిబంధనలు సరళమయ్యాయి. విచారణ సందర్భంగా నిందితులకు బేడీలు వేయటాన్ని కూడా అయ్యర్ వ్యతిరేకించారు. భారత న్యాయవ్యవస్థకు అయ్యర్ భీష్మ పితామహుడు వంటి వారని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ కొనియాడారు. 1975లో ఇందిరాగాంధీని ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తదనంతర పరిణామాలు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు దారితీశాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో 400 వరకు తీర్పులు వెలువరించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. లా కమిషన్ సభ్యునిగా 1971-73 కాలంలో పనిచేశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ ప్రత్యర్థి వీఆర్ కృష్ణయ్యర్. గుజరాత్ అల్లర్లపై విచారణకు ఏర్పాటైన పౌర సంఘంలో అయ్యర్ కూడా సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 2002 గుజరాత్ అల్లర్లకు నరేంద్రమోదీయే కారణమని అప్పట్లో అయ్యర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించగా కృష్ణయ్యర్ హర్షం వ్యక్తం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

రచనలు మార్చు

వి. ఆర్. కృష్ణ అయ్యర్ దాదాపు 105 గ్రంథాలను రచించారు. ఇందులో నాలుగు ట్రావెలాగ్ రచనలు కూడా ఉన్నాయి.ఆయన న్యాయశాస్త్రానికి సంబంధించి 70కి పైగా పుస్తకాలు రాశారు. ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్’ ( ISBN 978-81-317-1835-3 ) పేరుతో ఆత్మకథ రాసుకున్నారు .

గ్రంథము పేరు సంవత్సరము ప్రకాశకులు
Law and the People 1972 Peoples Publishing House, Rani Jhansi Road, New Delhi.
Law, Freedom and Change 1975 Affiliated East West Press Pvt. Ltd., 5, General Patters Road, Madras
Law India, Some Contemporary Challenges 1976 University College of Law, Nagpur.
Jurisprudence and Juris-Conscience à la Gandhi 1976 Gandhi Peace Foundation, 221/3-Deen Dayal Upadhyaya Marg, New Delhi-2
Social Mission of Law 1976 Orient Longmans Ltd., 160, Anna Salai, Madras-2
Law & Social Change and Indian Overview 1978 Publication Bureau, Punjab University, Chandigarh
Social Justice and the Handicapped Humans 1978 The Academy of Legal Publications, Punnan Road, Trivandrum-695001
The Integral Yoga of Public Law and Development in the Context of India 1979 The Institute of Constitutional & Parliamentary Studies, Vithal Bhai Patel House, Rafi Marg, New Delhi
Of Law & Life 1979 Vikas Publishing House Pvt. Ltd., 20/4 Industrial Area, Ghaziabad, U.P.
Life After Death[1] 2005 DC Books, Kottayam
Wandering in Many Worlds[2] 2009 Pearson Education
The Indian Law (Dynamic Dimensions of the Abstract) 2009 Universal Law Publishing

మరణము మార్చు

అనారోగ్యం కారణంగా ఆయన్ని 2014 నవంబరు 24న కుటుంబ సభ్యులు కోచిలోని ఒక ప్రైవేట్‌ మెడికల్‌ ట్రస్టు ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతం, కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె, న్యూమోనియా వ్యాధుల కారణంగా 2014 డిసెంబరు 4న జస్టిస్‌ అయ్యర్‌ మరణించారు[3]. వామపక్ష భావాలు గల మేధావిగా, బడుగుల హక్కుల కోసం చట్టాలను పునర్నిర్వచించిన న్యాయకోవిదుడుగా జస్జిస్‌ అయ్యర్‌ గుర్తింపు పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "The Hindu : Book Review / Language Books : Life after death". hindu.com. Archived from the original on 2009-06-03. Retrieved 2014-12-05.
  2. "Wandering in Many Worlds"
  3. http://www.ndtv.com/article/people/vr-krishna-iyer-a-legendary-judge-dies-at-100-630062

బయటి లంకెలు మార్చు