వ్రిందావన్

ఉత్తప్రదేశ్ లోని పట్టణం, భారతదేశం

జాదవ్ పూజ యొక్క ప్రియమైన కృష్ణా బృందావనం.

వృందావన్ ( బృందావనం)
నగరం
పై నుండి క్రిందికి: వృందావనంలో కృష్ణ బలరాం మందిరం, కుసుమ సరోవర్, ప్రేమ మందిరం
వృందావన్ ( బృందావనం) is located in Uttar Pradesh
వృందావన్ ( బృందావనం)
వృందావన్ ( బృందావనం)
Location in Uttar Pradesh, India
వృందావన్ ( బృందావనం) is located in India
వృందావన్ ( బృందావనం)
వృందావన్ ( బృందావనం)
వృందావన్ ( బృందావనం) (India)
Coordinates: 27°35′N 77°42′E / 27.58°N 77.7°E / 27.58; 77.7
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తరప్రదేశ్
జిల్లామధుర
Elevation
170 మీ (560 అ.)
Population
 (2011)[1]
 • Total63,005
భాషలు
 • అధికారహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
281121
టెలిఫోన్ కోడ్0565
Vehicle registrationUP-85

ప్రత్యామ్నాయంగా వ్రిందాబన్, బ్రిందావన్, బ్రిందావన, లేక బృందావన్ అని అంటారు ఉత్తర ప్రదేశ్, భారతదేశం నందలి మథుర జిల్లాలోని ఒక పట్టణం. ఇది కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశాలలో ఒకటి.

ఈ పట్టణం కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో, ఆగ్రా-ఢిల్లీ రహదారికి దగ్గరలో ఉంది. ఈ పట్టణం రాధాకృష్ణుల వందలాది ఆలయాలకు నిలయముగా ఉంది. ఇది గౌడియ వైష్ణవ మతం, వైష్ణవ మతం, సాధారణ హిందూమతం లాంటి అనేక మత సంప్రదాయాలచే పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది.

పద చరిత్ర మార్చు

 
యమునానదిపై గల కేసి ఘాట్.

ఈ నగరపు పురాతన నామం బృందావన అనేది 'బృందా' అనగా తులసి, 'వన్" అనగా వనము లేదా ఒక అడవి నుంచి వచ్చింది.[2] నిదివన్, సేవా కుంజ్ లో రెండు చిన్న వనాలు ఇప్పటికీ ఉన్నాయి.

శ్రీ కృష్ణ - జాదవ్ పూజ చరిత్ర మార్చు

వ్రిందావన్ కు హిందూ చరిత్రకు సంబంధించిన పురాతన చరిత్ర ఉంది, ఇది ఒక ముఖ్యమైన హిందూ పుణ్య క్షేత్రము. ఇంకనూ నిలిచి ఉన్న పురాతన ఆలయాలలో గోవింద దేవ్ ఆలయం ఒకటి. ఇది 1590లో నిర్మించబడింది.ఈ పట్టణం అదే శతాబ్దము ప్రారంభంలో కనుగొనబడింది.[3]

వ్రిందావన్ ప్రాశస్త్యం, 16వ శతాబ్దములో భగవాన్ చైతన్య మహాప్రభు తిరిగి కనుగోనేంత వరకు కాలగర్భంలో కలిసిపోయినట్లు నమ్మబడుతోంది. శ్రీ కృష్ణ ప్రభువునకు అతిశయించిన చిలిపిచేష్టలకు సంబంధించి కనుమరుగైన పవిత్ర ప్రదేశాలను గుర్తించే ఉద్దేశంతో భగవాన్ చైతన్య మహాప్రభు, 1515లో వ్రిందావనమును సందర్శించాడు. చైతన్య మహా ప్రభువు వ్రిందావన్ యొక్క పవిత్రమైన అడవులలో తిరుగుతూ పవిత్రమైన ప్రేమలో ఆధ్యాత్మికంగా మైమరచిపోయాడు. అతని దైవికమైన ఆధ్యాత్మిక శక్తి వలన, అతను వ్రిందావనములో, చుట్టుప్రక్కల కృష్ణ భగవానుడు సంచరించిన ముఖ్య ప్రదేశాలను గుర్తించగలిగాడు.[4]

మొదట్లో స్థానిక రాజుల వలన, ప్రస్తుత దశాబ్దాలలో అపార్టుమెంట్ల అభివృద్ధి వలన, గత 250 సంవత్సరాలలో, వ్రిందావన్ నందలి విశాలమైన అడవులు నగరీకరణకు గురైనాయి. అటవీ ప్రాంతం నరికి వేయబడి కొద్ది ప్రాంతాలు మాత్రమే మిగిలాయి. నెమళ్లు, ఆవులు, కోతులు వంటి స్థానిక వన్య ప్రాణులు, అనేక రకాల పక్షి జాతులు క్రమంగా తగ్గిపోయాయి. కొన్ని నెమళ్ళు, కోతులు మాత్రమే అక్కడ కనపడుతున్నాయి. ఆవులు మాత్రం వ్రిందావన్ యొక్క పెద్ద ఆశ్రమముల గోశాలలలో మాత్రమే కనపడుతున్నాయి.

కృష్ణ భగవానుని కృప చేత కలియుగము, వ్రిందావనంలోనికి ప్రవేశించదనే నమ్మకం ఉంది.

మతసంబంధ వారసత్వం మార్చు

 
మదన్ మోహన్ ఆలయము

హిందూ మతం యొక్క అన్ని సంప్రదాయముల వారికి వ్రిందావన్ ఒక పవిత్ర స్థలంగా భావించబడుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆచరిస్తున్న సాప్రదాయం వైష్ణవ మతం, అనేక వ్రిందావన్ ఆశ్రమాల నిర్వహణలో ఇది ఒక అధ్యయన కేంద్రంగా ఉంది. ఇది కృష్ణుని ఆరాధనకు కేంద్రంగా ఉంది, ఈ ప్రాంతము కృష్ణునితో సంబంధం ఉన్న గోవర్ధన, గోకుల్ వంటి ప్రదేశములను కలిగి ఉంది. రాధా కృష్ణులకు చెందిన మిలియన్ల మంది భక్తులు లేదా భక్తదాసులు ప్రతి సంవత్సరము ఈ ప్రదేశాలకు యాత్రలకు వస్తుంటారు, భువిపై కృష్ణుని జీవిత గాథలకు సంబంధించిన అనేక ఉత్సవాలలో పాల్గొంటారు.

సంప్రదాయ ప్రకారం, నమోదు కాబడిన సాక్ష్యముల ఆధారంగా, కృష్ణుడు గోకులం నందలి ఆవులమంద గ్రామంలో సంరక్షక తల్లిదండ్రులు నంద మహారాజుమరియు యశోదల వద్ద పెరిగాడు. కృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు, అతని గోపబాల స్నేహితులు వెన్న దొంగతనాలు, బాల్యపు చిలిపి పనులు చేశారో, రాక్షసులతో పోరాడారో, ఆ వృందావన్ అడవినందలి కృష్ణుని బాల్యపు కాలక్షేపముల గురించి భాగవత పురాణము వివరిస్తుంది. ఈ కార్యకలాపాలతో పాటు, వ్రిందావన్ గ్రామంలో గోపికలుగా పిలవబడే స్థానిక ఆడపిల్లలతో ముఖ్యంగా రాధారాణితో కృష్ణుడు చేసిన ముచ్చట్లు, నాట్యాల గురించి కూడా వివరిస్తుంది. సంస్కృత కవి జయదేవ రచించిన సంస్కృత పద్య కావ్యం గీత గోవిందానికి ఆధారం ఈ చిలిపి చేష్టలే.

ఆలయాలు మార్చు

బాగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కొన్ని:

మదన్ మోహన్ ఆలయం మార్చు

కాళి ఘాట్ సమీపమున ఉన్న మదన్ మోహన్ ఆలయం, ముల్తాన్ కు చెందిన కపూర్ రామ్ దాస్ చే నిర్మింపబడింది. ఇది వ్రిందావన్ నందలి అతి ప్రాచీన దేవాలయం. పుణ్యాత్ములు చైతన్య మహాప్రభుతో ఈ ఆలయం దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది. మదన్ గోపాల్ భగవానుని యొక్క అసలు విగ్రహాన్ని ఔరంగజేబ్ పాలనలో కాపాడటంకోసం మందిరం నుంచి రాజస్థాన్ లోని కరులికి మార్చారు. ప్రస్తుతము ఆ ప్రతిమ యొక్క ప్రతిరూపమును మందిరములో ఆరాధిస్తున్నారు.

బన్కే బిహారీ ఆలయం మార్చు

  • 1862[5]లో నిర్మించబడిన బన్కే బిహారీ ఆలయము వ్రిందావన్ నందలి ప్రఖ్యాత మందిరము. బన్కే-బిహారీ యొక్క ప్రతిమ నిధివనలో, నింబార్క సంప్రదాయానికి చెందిన గొప్ప కృష్ణ భక్తుడైన స్వామి హరిదాస్ చే కనుగొనబడింది.

రాధా వల్లభాలయం మార్చు

  • రాధా వల్లభ మందిరం, శ్రీహిత్ హరివంశ్ మహాప్రభు, [6] రాధా-వల్లభ సంప్రదాయము ప్రకారం దీనిని నిర్మించారు, ఈ పవిత్ర స్థలములో రాధారాణి యొక్క కిరీటాన్ని శ్రీ కృష్ణుని ప్రతిమ పక్కన ఉంచారు.

జైపూర్ మందిరం మార్చు

జైపూర్ మందిరము 1917లో జైపూర్ మహారాజు అయిన సవై మధో సింగ్ II చే నిర్మించబడింది, ఇది ఎక్కువ శృంగారమైన, సంపన్న దేవాలయం. అసమానమైన పనితంతో చలువరాతిపై అందముగా చేతితో చెక్కబడింది. ఈ మందిరము రాధా మాధవులకు అంకితం చేయబడింది.

శ్రీ రాధా రమణ్ మందిరం మార్చు

శ్రీ రాధా రమణ్ మందిరం, 1542లో గోపాల భట్ట గోస్వామి అభ్యర్ధన మేరకు వ్రిందావన్ లో ఎంతో అద్భుతంగా చెక్కబడి ప్రత్యేకించి గోస్వాములచే పూజలు జరుపుతున్న దేవాలయాలలో ఇది ఒకటి. రాధారాణితో పాటు కృష్ణుని అసలు సాలిగ్రామ దేవతా విగ్రహం గల సదనాలు ఇప్పటికీ ఉన్నాయి.[7]

షాజీ మందిరం మార్చు

షాజీ మందిరం, వ్రిందావన్ లో మరొక ముఖ్యమైన మందిరం, ఇది లక్నోకి చెందిన సంపన్న నగల వర్తకుడైన షా కుందన్ లాల్ చే 1876లో నిర్మించబడింది. ఈ ఆలయములోని దేవుళ్ళు (ప్రతిమలు) చోటే రాధా రమణ్ గా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దీని యొక్క అద్భుతమైన వాస్తుశిల్పము, చలువరాతి శిల్పాలు గుర్తింపు పొందాయి, ఈ ఆలయము 15 అడుగుల ఎత్తు గల 12 ఒంపు తిరిగిన స్తంభాలను కలిగి ఉంది. `బసంతి కమ్ర' - దర్బార్ హాలు బెల్జియన్ గాజు ద్వీప స్తంభాలు, అద్భుతమైన చిత్రాలతో రూపుదిద్దుకుంది.

రంగాజీ ఆలయం మార్చు

రంగాజీ ఆలయము , 1851లో నిర్మించబడినది, ఇది రంగనాథ భగవానునికి లేదా రంగాజీకి అంకితము చేయబడింది. ఇది పవిత్ర శేష నాగుపై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉన్న విష్ణు భగవానుని శేషశాయి అవతారముగా వర్ణించబడింది. ఈ ఆలయము ద్రవిడియన్ శైలిలో (శ్రీవల్లిపుతర్ ప్రతిరూపంగా) ఒక పొడవాటి గోపురం (సింహద్వారము), ఆరు అంతస్తులు, 50 అడుగుల ఎత్తు గల బంగారు పూత ధ్వజ స్తంభమును కలిగి ఉంది. ఒక నీటి తొట్టి, ఒక సుందరమైన తోట ఆలయము ఆవరణంలో ఉన్నాయి. ఈ దేవతలకి సంబంధించిన సావంత్సరిక ఉత్సవము జల్ విహార్ నీటి తొట్టి దగ్గర ఎంతో ఉత్సాహముతో, వైభవముగా జరుగుతుంది. ఈ ఆలయములో మార్చి-ఏప్రిల్ లలో జరిగే `బ్రహ్మోత్సవాలు' కూడా ప్రసిద్ధమైనవి, ఇవి `రథ్ కా మేళా' గా ప్రాచుర్యం పొందాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో గుడి నుండి దగ్గరి తోటల వరకు రధాన్ని (రధము) లాగటం గుర్తింపు పొందింది. ఈ ఆలయములో జరుగు పూజలన్ని, దక్షిణ భారత దేశానికి చెందిన 12 మంది వైష్ణవ గురువులలో ఒకరైన అండాళ్ పద్దతిలో జరుగుతాయి.

గోవింద్ దేవ్ మార్చు

గోవింద్ దేవ్ (గోవిందాజీ) ఆలయం ఒకప్పుడు గ్రీకు నిర్మాణ శైలిలో గల ఏడు అంతస్తుల అద్భుత నిర్మాణంగా ఉండేది. ఈ ఆలయ నిర్మాణము కొరకు అక్బర్ మహారాజు ఆగ్రాలోని ఎర్రకోట నుండి ఎర్ర ఇసుక రాళ్ళను తెప్పించి ఈ ఆలయ నిర్మాణానికి దానం చేశాడు. ఖగోళ ధరల ప్రకారం కోటి రూపాయలతో 1590లో అతని సేనానాయకుడు రాజా మాన్ సింగ్చే నిర్మించబడింది, ఈ ఆలయము పాశ్చాత్య, హిందూ, మహ్మదీయుల వాస్తుశిల్పములు కలగలిపిన నిర్మాణము. ఇది మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ చే నాశనము చేయబడింది.

శ్రీ కృష్ణ-బలరామ ఆలయం మార్చు

శ్రీ కృష్ణ-బలరామ ఆలయం , 'రమణ-రీతి' గా పేర్కొనబడుతున్న ఇంటర్ నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్ నెస్ (ISKCON) చే నిర్మించబడింది, ఇది ప్రస్తుతము వ్రిందావన్ లోని అందమైన ఆలయములలో ఒకటి. ఈ ఆలయములోని ముఖ్య దేవతామూర్తులు కృష్ణ, బలరాములతో, రాధా-శ్యామసుందర్, గౌర-నిటై ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. ఈ ఆలయము పూర్తి తెల్లని చలువరాతితో నిర్మించిన ISKCON ను ఏర్పరచిన A. C. భక్తివేదాంత స్వామి ప్రభుపాద సమాధిని ఆనుకొని ఉన్నది.

రాధా దామోదర్ మందిర్ మార్చు

రాధా దామోదర్ మందిర్ సేవా కుంజ్ లో ఉన్నది, ఈ మందిరము 1542లో శ్రీల జీవ గోస్వామిచే స్థాపించబడినది. శ్రీ శ్రీ రాధా దామోదర్ ల దేవతామూర్తులు ఇక్కడ ఉన్నాయి. A. C. భక్తివేదాంత స్వామి ప్రభుపాద యొక్క భజన్ కుటీర్ కూడా ఈ మందిరంలో ఉన్నది.

శ్రీ మా కాత్యాయని మందిర్ మార్చు

శ్రీ మా కాత్యాయని మందిర్ , రంగనాథ్ మందిర్ కి దగ్గర రాధ బాఘ్ లో ఉంది. శక్తికి సంబంధించిన శుద్ధ శక్తి పీఠములలో ఇది ఒకటి.

చింతహరణ్ హనుమాన్ మందిర్ మార్చు

హనుమాన్ కి చెందిన చింతహరణ్ హనుమాన్ మందిర్ అతల్వన్ కి దగ్గరలో కలదు.

శ్రీ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయం మార్చు

శ్రీ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయం: వ్రిందావన లోని ఆలయంలో గల కృష్ణ భగవానుని “లీలా స్థాన్” (పవిత్ర రాస క్రీడా ప్రదేశం ), 84 కోష్ వ్రజ్ పరిక్రమ యాత్ర ముగింపులో కచ్చితంగా చూడవలసిన ప్రదేశము. ఈ ఆలయము శతాబ్దాల క్రితంది, ఇది భారతదేశంలోనే మొదటి ఆలయము, ఇది ఆ పవిత్ర జంట, వారి యొక్క అష్ట సఖులు - రాధతో పాటు కృష్ణ భగవానుని ప్రేమలో పూర్తిగా లీనమైన ఆమె యొక్క ఎనిమిది మంది "సఖుల"కు అంకితం చేయబడింది . అష్ట సఖులు గురించి పురాణములు, భాగవత పురాణములోని పురాతన కథలు తెలిపాయి. ఈ ఆలయమును శ్రీ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయము అని అంటారు, ఇది కృష్ణ భగవానుడు, రాధారాణి ల పవిత్ర రాస లీలా గృహము. ఇది శ్రీ బన్కే బిహారీ మందిరమునకు చాలా దగ్గరలో ఉన్నది. పురాణములలో, మథురలోని రెండు ప్రదేశములలో శ్రీ రాధా రాస్ బిహారీ అష్ట సఖి ఆలయము ఒకటి, ఎక్కడైతే కృష్ణ భగవానుడు అతని ఇష్ట సఖి అయిన రాధ, ఆమె సఖులతో నిజముగా రాస లీలా లాడిన ప్రదేశము వ్రిందావన్ గా చెప్పబడి ఉన్నది. ఈ రాత్రులలో, భక్తులు అందెలు చేయు పవిత్రమైన శ్రావ్యమైన సవ్వడిని విన్నామని చెబుతున్నారు.

ఇతర పవిత్ర స్థలాలు మార్చు

 
అక్బర్, తాన్సేన్ ల స్వామి హరిదాస్ సందర్శన.

ఇతర ఆసక్తికర ప్రదేశాలలో సేవా కుంజ్, కేసి ఘాట్, శ్రిజి ఆలయము, జుగల్ కిషోర్ ఆలయము, లాల్ బాబు ఆలయము, రాజ్ ఘాట్, కుసుమ సరోవర్, మీరా-బాయ్ ఆలయము, ఇమ్లి తాల్, కాళీయ ఘాట్, రమణ రీతి, వరాహ ఘాట్, చిరా ఘాట్, నది గుండా కొద్ది పడవ ప్రయాణంతో గత శతాబ్దపు ప్రఖ్యాత సన్యాసి దేవ్రహ బాబా సమాధి ఉన్నాయి.

సేవా కుంజ్ అనేది కృష్ణ భగవానుడు రాధా-రాణి, గోపికలతో రాసలీలలాడిన ప్రదేశము, నిధి వనము అనేది ఈ పవిత్ర జంట విశ్రాంతి తీసుకున్న ప్రదేశము. తాన్సేన్ గురువు అయిన స్వామి హరిదాస్ సమాధి కూడా ఇక్కడ ఉంది. అతనికి గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరము ఇక్కడ స్వామి హరిదాస్ సమ్మేళనం నిర్వహింపబడుతుంది, అందులో భారతదేశంలోని ప్రఖ్యాత సంగీతకారులు పాల్గొంటారు.

శ్రీ వ్రిందావన్ లోని ఇతర ప్రముఖ ఆలయములలో గురుకుల్ రోడ్ నందలి శ్రీ కతియా బాబా కా స్థాన్ ఒకటి, "బ్రజోబిదేహి మహంత" గా పేరు పొందిన కతియా బాబా", నింబార్క వర్గము నందలి స్వాభూరామ్ ద్వారా ఆచార్య, శ్రీ స్వామి రాష్ బేహారి దాస్ కతియా బాబాజీ మహారాజ్ ఇక్కడ ఉన్నారు.

  • శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం [8]- వ్రిందావన్ కు చెందిన మహామండలేశ్వర్ మహంత్ శ్రీ కృష్ణ బలరాం స్వామిజిచే నిర్మించబడింది. 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు శిష్యుడు అయిన శ్రీల రూప గోస్వామిచే నిర్మించబడిన ప్రసిద్ధ చారిత్రక ఆలయము ఆధారముగా కొత్తగా నిర్మించిన రాధా గోవింద ఆలయము 2004లో పూర్తి అయింది.

భౌగోళిక స్వరూపం మార్చు

వ్రిందావన్ 27°35′N 77°42′E / 27.58°N 77.7°E / 27.58; 77.7 ఉంది.[9] ఇది సగటున 2269 మీటర్ల (882 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది ఒక పవిత్ర నగరం కూడా.

జనాభా మార్చు

As of 2001భారత జనాభా లెక్కల ప్రకారం, [10] వ్రిందావన్ 56,618 ల జనాభాను కలిగి ఉంది. మొత్తం జనాభాలో పురుషులు 56%, మహిళలు 44% మంది ఉన్నారు. వ్రిందావన్ సగటు అక్షరాస్యతా రేటు 65%, ఇది జాతీయ సగటు 59.5% కంటే అధికంగా ఉంది: పురుషుల అక్షరాస్యత 73%, మహిళల అక్షరాస్యత 55%గా ఉంది. వ్రిందావన్ లో 13% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సును కలిగినవారు. 6 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువగల 13%తో కలిపి స్త్రీల జనాభా 24,200.

తమ భర్తలను కోల్పోయిన విధవలు ఎక్కువ మంది ఈ నగరంలోకి, సమీప ప్రాంతాలకు కదలి వచ్చినందువల్ల వ్రిందావన్ ను విధవల నగరం[11] అని కూడా పిలుస్తారు. కొన్ని హిందూ సంప్రదాయాల ప్రకారం, అగ్ర-వర్ణాల విధవలు పునర్వివాహం చేసుకొనకూడదు, కాబట్టి వారి భర్తల మరణానంతరము కుటుంబాలచే వదిలి వేయబడిన వారు తమ మార్గాన్ని ఇటు వైపు మళ్ళిస్తారు. 15,000 నుంచి 20,000 మంది విధవలు వీధులలో నివసిస్తున్నారని ఒక అంచనా, [12][13] వారిలో చాలామంది 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు. 7–8 గంటలపాటు భజనాశ్రము లలో భజనల కీర్తనలు పాడినందుకు ప్రతిఫలంగా గుప్పెడు బియ్యం, అతి తక్కువ జీతం (దాదాపు రూ.10) [11] పొందుతారు, దానికి అదనంగా వీధులలో యాచన ద్వారా కొన్ని సందర్భాలలో వేశ్య వృత్తి ద్వారా ఆదాయం పొందటానికి ప్రయత్నిస్తారు.[14] ఈ అనాథ స్త్రీలు, పిల్లల సహాయం కొరకు గిల్డ్ ఆఫ్ సర్వీసు అనే ఒక సంస్థ స్థాపించబడింది.[13] 2000లో ఆ సంస్థ అమర్ బారి (మై హోమ్) ను 120 మంది వ్రిందావన్ విధవల కొరకు ప్రారంభించింది, రెండవ ఆశ్రమము 500 మంది విధవల కొరకు ప్రారంభించబోతోంది.

వ్రిందావన్ నందలి పరిశ్రమలు మార్చు

ప్రస్తుతము రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆదాయం సమకూర్చుకొనుటకు వ్రిందావన్ ప్రధాన వనరు అయింది. దాని యొక్క ప్రశాంతమైన, నిశ్శబ్దమైన వాతావరణము, పవిత్ర స్థలములో నివసించుట కొరకు చాలా మంది ఢిల్లీ వాసులు వ్రిందావన్ లో గృహాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ డిమాండ్ ఫలితంగా ఎన్నో ప్రసిద్ధిచెందిన రియల్ ఎస్టేట్, స్థల అభివృద్ధి కంపెనీలు ఎన్నో ఇళ్ళ ప్రాజెక్టులను వ్రిందావన్ లో ప్రారంభించాయి.

చిత్రమాలిక మార్చు

వీటిని కూడా చూడండి మార్చు

  • వ్రిందావన్ ఆరుగురు గోస్వాములు
  • హరే కృష్ణ
  • గోవర్ధన కొండ
  • గౌర కిషోర దాసబాబాజి
  • స్వయం భగవాన్
  • రాధా కృష్ణ

సూచనలు మార్చు

  1. భారత జనాభా లెక్కలు
  2. బ్రిందాబాన్ The Imperial Gazetteer of India, 1909, v. 9, p. 17.
  3. "1911encyclopedia.org". www.1911encyclopedia.org. Retrieved 2023-02-17.
  4. "డిస్కవరి ఆఫ్ వ్రిందావన్ బై లార్డ్ చైతన్య మహాప్రభు". Archived from the original on 2011-01-23. Retrieved 2011-02-19.
  5. "Banke-Bihari ఆలయము website". Archived from the original on 2016-03-04. Retrieved 2020-01-09.
  6. రాధావల్లభ ఆలయము వెబ్ సైట్
  7. ది హిస్టరీ ఆఫ్ శ్రీ రాధా రామన్ ఆలయము
  8. "రెడ్ స్టోన్ ఆలయము". Archived from the original on 2009-08-30. Retrieved 2011-02-19.
  9. "ఫాల్లింగ్ రైన్ జెనోమిక్స్, Inc - వ్రిందావన్". Archived from the original on 2011-03-11. Retrieved 2011-02-19.
  10. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  11. 11.0 11.1 "CNN: India's widows live out sentence of shame, poverty". Archived from the original on 2006-11-29. Retrieved 2007-03-25.
  12. "Catalyst Magazine: Moksha: the widows of Vrindavan". Archived from the original on 2007-04-03. Retrieved 2007-03-25.
  13. 13.0 13.1 "Shunned from society, widows flock to city to die". CNN. 2007-07-05. Retrieved 2007-07-05. (This article was criticized by several members of the South Asian Journalists Association for "generalizations and questionable assertions." An article in the SAJA Forum Archived 2011-09-30 at the Wayback Machine documents several instances where, after such criticisms appeared, CNN quietly made changes in the online version of the article. అరుణ్ వేణుగోపాల్, a reporter for WNYC, wrote, "On the SAJA Discussion list, a number of people across the political spectrum found that the story ascribed too much to 'tradition' rather than to more complex social realities.")
  14. http://womennewsnetwork.net/2007/11/05/nothing-to-go-back-to-the-fate-of-the-widows-of-వ్రిందావన్-india/[permanent dead link]

బాహ్య లింకులు మార్చు