శోభానాయుడు (1956-14 అక్టోబరు 20) కూచిపూడి నాట్య కళాకారిణి.

శోభా నాయుడు

సంగీత నాటక అకాడమి ఢిల్లీ లో ప్రదర్శన
జననం 1956
అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారత్
రంగం శాస్త్రీయ నృత్యం నర్తకి
ఉద్యమం కూచిపూడి
పురస్కారాలు పద్మశ్రీ పురస్కారం

జీవిత విశేషాలు మార్చు

శోభానాయుడు వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించింది. 12 యేళ్ళ వయస్సులో కూచిపూడిలో అరంగేట్రం చేసింది.

నృత్య జీవితం మార్చు

శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది.

హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ద్వారా పిల్లలకు శిక్షణ నిస్తోంది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

అవార్డులు మార్చు

మరణం మార్చు

ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2020 అక్టోబర్ 13 అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచింది.కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతుంది.[1]

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. "నృత్యకారిణి డా.శోభానాయుడు ఇక లేరు". www.eenadu.net. Retrieved 2020-12-13.

బయటి లింకులు మార్చు