శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (1906 - 1987) హరిదాసు, సంగీత విద్వాంసుడు, సంగీత పోషకుడు. నెల్లూరు పట్టణంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను సంప్రదాయంగా మలిచిన వ్యక్తి. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తండ్రి.[1]

సాంబమూర్తి గారి విగ్రహం.


సంగీత రంగం మార్చు

సాంబమూర్తి హరిదాసుగానూ, సంగీత విద్వాంసునిగానూ మాత్రమే కాక త్యాగరాజ సంగీతోత్సవాలు నిర్వహిస్తూ కూడా ఆ రంగానికి సేవలందించారు. భిక్షమెత్తి, ఆ వచ్చిన సొమ్ముతో త్యాగరాజస్వామికి ఆరాధనోత్సవాలు నిర్వహించడమనే సంప్రదాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఆయన, మరికొందరు కలసి పట్టణంలో త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తూ భిక్షమెత్తిన సొమ్ముతో ఆ కార్యక్రమాలను దశాబ్దాల పాటు నిర్వహించారు.

మూలాలు మార్చు

  1. "S.P.Balasubramaniam Biography / Profile". Archived from the original on 2015-10-16. Retrieved 2015-07-11.

ఇతర లింకులు మార్చు