సూక్ష్మ అర్థ శాస్త్రము

ఆర్థిక శాస్త్రములో వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేయు శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం (Microeconomics). ఆర్థిక శాస్త్రము లోని చిన్న చిన్న భాగాల గురించి ఇది వివరిస్తుంది. ఒక వైయక్తిక వినియోగదారుడు గురించి, ఒక పరిశ్రమ గురించి, డిమాండు, సప్లై ల మార్పుల గురించి ఇది వివరిస్తుంది. రాగ్నర్ ప్రిష్ అనే ఆర్థిక వేత్త స్థూల ఆర్థిక శాస్త్రము ప్రారంభించడంతో సూక్ష్మ ఆర్థ శాస్త్రము అనే విభాగం ప్రత్యేకంగా వెలిసింది.

సూక్ష్మ అర్ధశాస్త్రాన్ని సామాన్యంగా ధరల సిద్ధాంతము (Price Theory) అని కూడా అంటుంటారు. ఒక వినియోగదారుడు తన సంతృప్తిని ఏ విధంగా గరిష్ఠం (వీలయినంత ఎక్కువ) చేసుకొంటాడో, ఒక సంస్థే విధంగా గరిష్ఠలాభాలను పొందుతుందో నిర్ణయించే సూత్రాలు ఈ విభాగం పరిధిలోనికి వస్తాయి. - ఏ వస్తువులు ఉత్పాదన చేయాలి? ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి? సాధనాల కొరత ఎలా ఉంది? సాధనాల కేటాయింపు ఎలా జరగాలి - వంటి విషయాలకు ఈ విభాగంలో ప్రాముఖ్యత లభిస్తుంది.

ఇతర వ్యాసాలు మార్చు