సూర్యదేవర రామచంద్ర రావు

ప్రభుత్వోద్యోగి, పద్మశ్రీ పురస్కార గ్రహీత

సూర్యదేవర రామచంద్ర రావు భారతదేశానికి చెందిన ప్రభుత్వ అధికారి. గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద మునిసిపాలిటీల్లో ఒకటైన సూరత్కు మునిసిపల్ కమీషనరుగా పనిచేశాడు.[1] 1994 లో సూరత్ నగరంలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు దాన్ని అరికట్టడానికి ఆయన విశేష కృషి చేశాడు. ఆయన కృషి వల్ల మురికి నగరంగా పేరు పడిన ఈ నగరం భారతదేశంలో రెండో పరిశుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకున్నది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ప్రకారం దేశంలో చండీఘర్ తర్వాత ఇదే అత్యంత పరిశుభ్రమైన నగరం.[2]

సూర్యదేవర రామచంద్ర రావు
జననం
ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుఎస్. ఆర్. రావు
వృత్తిప్రభుత్వోద్యోగి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సూరత్ నగరం అభివృద్ధి
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
తిరుపతి రాజు స్మారక పురస్కారం

దీని తర్వాత ఈయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు ఛైర్మన్ గా పనిచేశాడు. దానిని దేశంలో ముఖ్యమైన ఓడరేవుగా అభివృద్ధి చేశాడు.[3] తర్వాత కేంద్ర ప్రభుత్వంలో సమాచార, సాంకేతిక శాఖ, వాణిజ్య శాఖల్లో కూడా కార్యదర్శిగా పనిచేశాడు.[4]

1998లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. సర్వీసులో ఉండగానే పద్మ పురస్కారం అందుకున్న అతికొద్ది మంది అధికారుల్లో ఈయన ఒకడు.[5] తిరుపతి రాజు స్మారక పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.

మూలాలు మార్చు

  1. "Cleaning Up The Plague City". Outlook. 27 November 1996. Archived from the original on 10 డిసెంబరు 2015. Retrieved October 27, 2015.
  2. "Not the same Surat". Himal. March 1998. Archived from the original on 2016-03-04. Retrieved October 27, 2015.
  3. "His was a purposeful life". The Hindu. 14 April 2003. Archived from the original on 7 మే 2003. Retrieved October 27, 2015.
  4. "SR Rao named Union commerce secretary". Kammas World. 30 May 2012. Archived from the original on 5 మార్చి 2016. Retrieved October 27, 2015.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.