హింగోలి జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

హింగోలీ (हिंगोली), మహారాష్ట్రలో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [1]. ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.

హింగోలీ జిల్లా
हिंगोली जिल्हा
మహారాష్ట్ర పటంలో హింగోలీ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో హింగోలీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుఔరంగాబాదు డివిజన్
ముఖ్య పట్టణంహింగోలీ
మండలాలు1. హింగోలీ, 2. కాలమ్నూరి, 3. సేన్‌గావ్, 4. ఔందా, 5. బాస్మత్
Government
 • లోకసభ నియోజకవర్గాలుహింగోలీ
 • శాసనసభ నియోజకవర్గాలు3
Area
 • మొత్తం4,526 km2 (1,747 sq mi)
Population
 (2001)
 • మొత్తం9,87,160
 • Density220/km2 (560/sq mi)
 • Urban
15.60
Websiteఅధికారిక జాలస్థలి
ఔంధ నాగనాథ్ ఆలయం

జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి, సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా, బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి, హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.[1]

ఇతర విశేషాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2009-03-24.

బయటి లింకులు మార్చు