2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం

మహబూబ్ నగర్ బస్సు ప్రమాదం అక్టోబరు 30 2013 న బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సు ఒక కారును ఓవర్‌టేకింగ్ చేస్తూ ఒక కల్వర్టును ఢీ కొని ఘర్షణ వలన అగ్ని ప్రమాదానికి గురి అయినది. ఈ ప్రమాదంలో 45 మంది మరణించారు, 7 మంది గాయాలపాలయ్యారు.[1][2][3] ఈ ప్రమాదం తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లా లోని పాలెం గ్రామం వద్ద 5:30 గంటలకు జరిగింది.[4][5][6]

2013 Mahabubnagar bus accident
పాలెం is located in Telangana
పాలెం
పాలెం
తెలంగాణాలొ పాలెం ఉనికి
వివరాలు
తేదీ30 అక్టోబరు 2013
5.30 AM
స్థానంఎన్.హెచ్ 7, మహాబూబ్ నగర్, తెలంగాణ
దేశం india
గణాంకాలు
మరణాలు45[1]
గాయపడినవారు7
నష్టంబస్సు

ప్రమాదం మార్చు

ఈ బస్సు స్థానిక యాత్రా ఆపరేటర్ అయిన జబ్బార్ ట్రావెల్స్కు చెందినది. ఇది బెంగళూరులో అక్టోబరు 29 2013 రాత్రి 11 గంటలకు 49 ప్రయాణీకులతో హైదరాబాదుకు బయలుదేరింది.[7] ఈ ప్రమాదం ఆ బస్సు డ్రైఅరు ఒక కారుకు ఓవర్‌టేక్ చేయుట వలన ఒక కల్వర్టును గుద్దుకొని డీసిల్ ట్యాంకు అగ్నిప్రమాదానికి గురై జరిగింది. కానీ బస్సు డ్రైవరు, క్లీనరు, ఐదుగురు ప్రయాణీలులు తప్పించుకున్నారు.

సి.ఐ.డి విచారణ మార్చు

మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన పైన సిఐడి పోలీసులు కేంద్రానికి 400 పేజీల నివేదికను సమర్పించారు. బస్సు ప్రమాదానికి పలు కారణాలని అందులో పొందుపర్చారు. ఛార్జీషీటులో జెసి ప్రభాకర్ రెడ్డి సతీమణి పేరును కూడా చేర్చారు. వోల్వో బస్సుల తయారీలోనే లోపాలున్నాయని ఈ నివేదికలో సిఐడి పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చారని రిపోర్టులో పేర్కొంది. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని నిర్థారించింది. ఈ డీజిల్ ట్యాంక్ కూడా ఘోర ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ లోపం, సీట్లు పెంచడం, బస్సులో ఓవర్ లోడ్ లగేజీ, ప్రమాదకర వస్తువులు తదితరాలు ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ఛార్జీషీటులో ఆర్ అండ్ బి అధికారులు, జబ్బార్ ట్రావెల్స్, జెసి సతీమణి పేరును చేర్చారు.[8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "45 charred in Bangalore-Hyderabad bus fire". HYDERABAD: The New Indian Express. Express News Service. 2013-10-31. Archived from the original on 2013-10-31. Retrieved 2013-10-31.
  2. "Bus accident in India killed 44 people". CNN IBN. 30 October 2013. Archived from the original on 31 అక్టోబరు 2013. Retrieved 30 October 2013.
  3. "At least 44 people die in bus crash". NDTV. 30 October 2013. Retrieved 30 October 2013.
  4. "40 feared killed as bus hits oil tanker, catches fire in Andhra Pradesh". The Times of India. Archived from the original on 2013-11-01. Retrieved 30 October 2013.
  5. "Andhra Pradesh bus tragedy: Bus hits oil tanker in Mahabubnagar, 40 charred to death". India Today. Retrieved 30 October 2013.
  6. "42 die in India bus accident". BBC News. 30 October 2013. Retrieved 30 October 2013.
  7. "Hyderabad bound Bus catches Fire at Mahabubnagar killing 40". Retrieved 30 October 2013.
  8. పాలెం వోల్వో బస్సు ప్రమాదం: ఛార్జీషీట్లో జెసి భార్య పేరు

ఇతర లింకులు మార్చు