• మున్నూరు కాపులు తెలంగాణా బీసీ కులాల జాబితా డి గ్రూపులో ఒక ప్రధానమైన కులం. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులు

వీరు ప్రధానంగా వ్యవసాయ దారులు, అలాగే వీరు చిన్న, సన్నకారుతో పాటు పెద్ద రైతులు.తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోతుబరి రైతులుగా భూస్వాములుగా కూడా వున్నారు వీరు గ్రామాల్లో పట్వారీ పటెళ్లుగా, పోలీస్ పటెళ్ళుగా, వుండడం వలన చాలా గ్రామాలలో వీరి ఆధిపత్యం ఉన్నది, గ్రామాలలో నాయకొళ్లుగా గ్రామాధికారులుగా పనిచేసి వున్నందున మున్నూరు కాపులు తమ పేరు చివర [పటేల్] అని పెట్టుకుంటున్నారు.

చరిత్ర మార్చు

  • పండితుడు బాలగోపాల్ ప్రకారం, "మున్నూరు కాపులు, బలిజలు, తెలగలు, తెనుగులు , ముదిరాజులు సమిష్టిగా 'కాపులు'గా సూచిస్తారు". వారు ఒకే సంఘంగా సంఘటితం కావడానికి ప్రయత్నించారు, కానీ "అది పూర్తికావాల్సి ఉంది ".[20][21

మున్నూరు కాపులు తెలంగాణలో అత్యధిక జనాభాగల ప్రధాన సామాజికవర్గం వీరి ప్రధాన వృత్తి వ్యవసాయమే అయిన కాకతీయుల కాలంలో సామంత రాజులుగా జమీందారులుగా సైనిక దళాల నాయకులుగా అలాగే సుల్తానుల & కులీ కుతుబ్ షాహీ, నైజాం పాలనలో సైనిక అధికారులుగా సుభేదారులుగా గ్రామ అధికారులుగా గ్రామ పటేల్లుగా సుంకాలు, పన్నులు వసూలు చేసే గ్రామ నాయకొళ్లుగా[నాయికోటి తనం] పనిచేసారు, వీరు సహజంగా ఆత్మాభిమానం పౌరుషం గలవారు గ్రామ రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం బలి పెట్టడానికి వెనుకాడరు వీరు కాపు కులానికి చెందిన వారు, మున్నూరు అనేది ఒక సంఖ్యా పదం మున్నూరు అనేది సంఖ్యా మాత్రమే అదీ కులానికి చిహ్నం కాదు, వీరు కాపులు తెలంగాణాలో 3 నూర్లా కాపులు అని, కర్ణాటకలో మున్నూరు రెడ్లు అనీ తమిళనాడులో నాయకర్లుగా కేరళలో నాయర్లుగా మహారాష్ట్రలో నాయకవాడిగా పిలవబడుతున్నరు, మున్నూరు పదానికి చరిత్రలో పురాణ ఇతిహాసం వున్నదీ రామాయణ కాలంలో శిరధ్వజుడు అనగా సీత మాత తండ్రీ గారు జనక మహారాజు, ఇతను కాపు కులానికి చెందిన వారు సీత మాత స్వయంవరం ఏర్పాటు చేశారు పవిత్రమైన శివుని యొక్క ధనస్సు తమ పూజా మందిరము నుండి తేవటానికి చాలామంది సైనికులు ప్రయత్నం చేసినా వీలుపడలేదు అప్పుడు జనక మహారాజు తమ బంధువులను ఆ పవిత్రమైన శివ ధనుస్సు తెమ్మని తెలపడంతో మొదట ఒక నూరు మంది వెళ్లి ప్రయత్నం చేస్తే అది తేవటానికి వీలు పడదు తరువాత మారో నూరు మంది వెళతారు అయిన శివ ధనుస్సు లేపలేక పోతారు అల మరో నూరు మంది వెళ్లి పవిత్రమైన శివ ధనుస్సుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రయత్నం చేయడంతో శివ ధనుస్సు కదులుతుంది అల మూడు నూర్ల కాపులు ఆ ధనస్సును స్వయంవర మందిరానికి తీసుకొస్తారు ఆ పవిత్రమైన శివ ధనుస్సును తెచ్చిన మూడు నూరుల కాపులే తదనంతరం మున్నూరు కాపులుగా రూపాంతరం చెందినారని చరిత్ర కారులు కుల పెద్దలు బాశెట్టి రంగమ్మ పటేల్ గారు అలాగే సుతారి నర్సింహులు గారు తెలిపారు, *ఆధునిక కాలంలో వీరి మూల పురుషునిగా కాకతీయ సేనాని జాయాప సేనుని కొలుస్తారు. మున్నూరు కాపులకు కాకతీయులతో బంధుత్వం కలదు*

  • మూడు వైపులా నీటిని ఆపి అడ్డుకట్టలు వేసి చెరువులని కట్టి వ్యవసాయం చేసిన కాపులే మున్నూరు కాపులు. మున్నూరు కాపులు వ్యవసాయంతో పాటు రాజ్యానికి అవసరం వచ్చినపుడు సైనిక సేవలు అందించారు.[హజారీ] సైనిక దళంలో పనిచేసిన మున్నూరు కాపుల ఇంటి పేరు హజారీగా స్థిరపడింది
  • కాకతీయ సామ్రాజ్యంలో [రుద్రమదేవి] పాలనలోనే [బతుకమ్మ పండుగ] ప్రారంభమైనట్లు కులాలు, పండుగలు అనే పరిశోధనాత్మక వ్యాసం రాసి డాక్టరేట్ పొందిన పి.శారద తెలిపారు. బతుకమ్మ పండుగకు ప్రధాన కారణం- రుద్రమదేవిపై ఆమె సవతి కుమారులు హరిహరమురారి దేవులు తిరుగుబాటు చేసినప్పుడు జరిగిన పోరాటంలో [హజారీ మంగమ్మ] అనే మున్నూరు కాపు కులానికి చెందిన అంగరక్షకురాలు రుద్రమదేవిని కాపాడి తను చనిపోతూ రుద్రమదేవిని బతికించినందున బతుకమ్మ పండుగను జరుపడం ఆనవాయితీగా వస్తున్నదని కాకతీయుల కాలంలో మహిళ గ్రంథంలో రచయిత యం. రాధాకృష్ణ పేర్కొన్నారు.
  • [గణపతిదేవుడు] స్నేహితుడు, గజ సేనాధిపతి ఐన జాయాప సేనాని తన చెల్లెలైన నారమ్మ, పేరమ్మలని గణపతిదేవుడికిచ్చి పెండ్లి చేసిండు. యుద్ధ విద్యలలో అరితేరిన వాడే కాక [నృత్య రత్నావళి] అనే గ్రంథ రచయిత ఐన ఈ [జాయప సేనాని] మున్నూరు కాపు. మున్నూరు కాపులు నైజాం నవాబు పాలనలో సైన్యంలో చేరి అక్కడ ఉన్నత పదవులు అనుభవించారు, అలాగే వీరు ప్రధానంగా నైజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలో గ్రామ అధికారులైన పట్వారీ పటేల్లుగా, పోలీస్ పటేల్లుగా గ్రామాలపై ఆధిపత్యం వహిస్తు నైజాం నవాబుకు నమ్మకంగా వుంటూ సమాజంలో ఉన్నతంగా గౌరవ ప్రదంగా తమ జీవనాన్ని కొనసాగించేవారు, కాపులు ప్రధానంగా వ్యవసాయం చేస్తూ ఉన్నత విద్య అప్పటి ఉర్దూ అరబిక్ పర్షియన్ తో పాటు తెలుగు మరాఠీ కన్నడ భాషలు అభ్యసించారు.

కాపు-ఉప కులాలు మార్చు

రాజకీయ నాయకులు మార్చు

 
పీవీ రంగయ్య నాయుడు

మూలాలు మార్చు