ప్రద్యోత రాజవంశాన్ని దీనిని ప్రతీవిం భోక్స్యంతి (లిట్. భూమిని ఆస్వాదించడం) అని కూడా పిలుస్తారు.[1] ఇది ఒక పురాతన భారతీయ రాజవంశం. ఇది ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అవంతిని పరిపాలించింది. అయితే చాలా పురాణాలు (ఢాకా విశ్వవిద్యాలయంలో భద్రపరచబడిన బ్రహ్మండ పురాణం వ్రాతపతి మినహా) ఈ రాజవంశం మగధలోని బృహద్రత రాజవంశం తరువాత రాజ్యపాలన సాధించిందని చెప్తున్నాయి.[2] రాజవంశం మగధను 138 సంవత్సరాలు పరిపాలించింది. [1]

పాలకులు మార్చు

  • ప్రద్యోత మహాసేన లేదా చందా (క్రీ.పూ. 541-518)
  • పాలక (క్రీ.పూ. 518-494)
  • విశాఖ్యూప (క్రీ.పూ. 494-444)
  • అజాకా లేదా ఆర్యక (క్రీ.పూ. 444-423)
  • వర్తివర్ధన లేదా నందివర్ధన (క్రీ.పూ. 423-403)

ప్రద్యోత రాజవంశం స్థాపకుడు అవంతిని పాలించాడు. ఆయన తల్లి పులికా (పునికా) తన కుమారుడిని రాజుగా చేయడానికి ఉజ్జయిని వద్ద తన యజమానిని చంపిందన్న కథనాలు ప్రచారంలో ఉంది. ప్రద్యోత బుద్ధుడు, బింబిసారుని సమకాలీనుడు. ఆయన పేరు మహావాగ, పురాణాలలో ప్రస్తావించబడింది.[3]ఆయన 23 సంవత్సరాలు పాలించినట్లు భావిస్తున్నారు.[4]పాలకుల పాలన క్రీస్తుపూర్వం 518 లో మెరుతుంగాకు చెందిన విసరస్రేనితో ప్రారంభమైంది.[5] ఆయన ఉజ్జయినికి చెందిన చందా ప్రద్యోత కుమారుడు. [6] ఆయాన కోసాంబిని జయించాడని భావిస్తున్నారు.[4] ఉదయనుడు విసరస్రేనిని చాలాసార్లు ఓడించాడు. కాని చివరికి క్రీ.పూ 444 లో ఉదయనుడు విసరస్రేని చేత చంపబడ్డాడు.[7] పాలకాలు 25 సంవత్సరాలు పాలించినట్లు భావిస్తున్నారు.[7]

విశాఖ్యూపా, అజకా, నందివర్ధన వరుసగా 50, 21, 20 సంవత్సరాలు పరిపాలించినట్లు భావిస్తున్నారు.[7]నందివర్ధనను శిశునాగా ఓడించి తద్వారా మగధను అవంతిని కలుపుకున్నాడు.[8][9]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Thapar 2013, p. 295.
  2. Misra, V.S. (2007). Ancient Indian Dynasties, Mumbai: Baratiya Vidya Bhavan, ISBN 81-7276-413-8, p. 300
  3. Kailash Chand Jain 1972, pp. 98–99.
  4. 4.0 4.1 Kailash Chand Jain 1972, p. 101.
  5. Kailash Chand Jain 1991, p. 85.
  6. Kailash Chand Jain 1991, p. 81.
  7. 7.0 7.1 7.2 Kailash Chand Jain 1972, p. 102.
  8. Kailash Chand Jain 1972, p. 103.
  9. Upinder Singh 2016, p. 272.

మూలాలు మార్చు

అంతకు ముందువారు
Vitihotra dynasty
Avanti dynasties తరువాత వారు
Haryanka dynasty