ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - 2018
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - 2018 (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) 48వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో 2018 జనవరి 23 నుంచి జనవరి 27 వరకు ఐదు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సు 1970లలో ఒక చిన్న బృందంగా ప్రారంభమైంది. ప్రముఖ విద్యావేత్త క్లాజ్ స్వ్కాబ్ దీనిని ప్రారంభించినపుడు సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో 130 మంది పాల్గొన్నారు. 1997లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ తర్వాత ఈ సదస్సుకు నరేంద్రమోడీ హాజరయ్యారు. [1]
![]() | |
ఆశయం | Committed to improving the state of the world |
---|---|
స్థాపన | 1971 |
వ్యవస్థాపకులు | క్లాజ్ స్వ్కాబ్ |
రకం | Nonprofit organization |
చట్టబద్ధత | Foundation |
కేంద్రీకరణ | Economic[అస్పష్టంగా ఉంది] |
ప్రధాన కార్యాలయాలు | స్విట్జర్లాండ్ |
సేవా ప్రాంతాలు | Worldwide |
అధికారిక భాష | English |
Executive Chairman | క్లాజ్ స్వ్కాబ్ |
మారుపేరు | European Management Forum |
మూఖ్యాంశాలు సవరించు
ఈ సదస్సులో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి సాధనలో పర్యావరణం, ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాల్లో తలెత్తే సమస్యలు, సంపన్న దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక విభేదాలపైనా చర్చిస్తారు.[2]
ప్రారంభం సవరించు
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు చైర్మన్ క్లాజ్ స్కాబ్ స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమయింది. క్లాజ్ స్కాబ్ తన సందేశంలో సదస్సు ఉద్దేశాన్ని తెలియజేసారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ఆస్ట్రేలియా సినీ నటి కేట్ బ్లాంచెట్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎల్టన్ జాన్లకు ఆయా రంగాల్లో విశేష సేవలందించినందుకు క్రిస్టల్ అవార్డులు ప్రదానం చేశారు.
పాల్గొన్న వారు సవరించు
తెలంగాణ రాష్ట్రం నుండి కల్వకుంట్ల తారక రామారావు బృందం తొలిసారిగా ఈ సదస్సులో పాల్గొన్నది.
ఇవీ చదవండి సవరించు
మూలాలు సవరించు
- ↑ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. "నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు". tnews. www.tnews. Retrieved 23 January 2018.[permanent dead link]
- ↑ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. "ప్రపంచ ఆర్థిక వేదిక: దావోస్ సమావేశాలకు హాజరు కావాలంటే ఏం చేయాలి? అసలక్కడ ఏం జరుగుతుంది?". BBC. www.bbc.com. Retrieved 23 January 2018.